(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణ చరిత్ర ఢిల్లీ, కోల్కతా, చెన్నైలోని పేరుగాంచిన జాతీయ మ్యూజియంలో పదిలంగా ఉంది. నాడు బుద్ధుడు నడయాడిన చరిత్ర విశేషాలు, రాజులు బౌద్ధానికి ఇచ్చిన ప్రాధాన్యం, నాటి కళాకారుల ప్రతిభకు నిదర్శనాలైన పురాతన శిల్పాలు సందర్శకులతో ఔరా అని పించుకుంటున్నాయి. భారతదేశంలో 1, 2 దశాబ్దాలలోనే ఇంతటి గొప్ప కళారూపాల సృష్టి, బుద్ధుడి బోధనలు, గొప్ప పరిపాలనా పద్ధతులు అవలంభించారా? అంటూ విదేశీయులు ఆశ్చర్యపోతున్రాఉ. నాటి అమరావతి ప్రాంతంలోని విశేషాలను వివరించే అద్భుత కళారూపాలు, శిలాశాసనాల ఏవేవి ఎక్కడ ఉన్నాయనే అంశాలపై ఆంధ్రజ్యోతి పరి