-
Posts
66,776 -
Joined
-
Last visited
-
Days Won
90
Everything posted by sonykongara
-
Buckingham Canal inland waterways
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
అమరావతి.. విజ్ఞాన కాంతి జ్ఞాన కేంద్రంగా రాజధానిని అభివృద్ధి చేస్తాం ఎస్ఆర్ఎం ఏర్పాటుతో తొలి అడుగు పడింది ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ప్రారంభం ఈనాడు - అమరావతి మరపురాని రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ముఖ్యమైనది. ఆ రోజులు మరుపు రానివి. ముఖ్యమంత్రి అయినప్పటికంటే విద్యార్థిగా ఉన్న రోజులే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చాయి. - చంద్రబాబు అమరావతి నగరాన్ని విజ్ఞానానికి కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, దేశ, విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి అభ్యసించే విధంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ‘అమరావతి పేరు చెప్పగానే గుర్తింపు వచ్చేలా... కీర్తి చిహ్నంగా ఉండాలి. ప్రపంచంలో పేరుపొందిన విద్య, వైద్య సంస్థలు, కళాశాలలు, హోటళ్లు, పర్యటకం ఇక్కడికి రావాలి. ఒక వైపు కృష్ణానది... మరో వైపు అందమైన అడవులు ఇక్కడి ప్రత్యేకత. కృష్ణానది పక్కన ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. దసరా రోజున పరిపాలనా నగరానికి పునాది వేస్తామని...’ ముఖ్యమంత్రి ప్రకటించారు. శనివారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన రాజధానిలో నీరుకొండ వద్ద నిర్మించిన ఎస్ఆర్ఎం ఏపీ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని విజ్ఞాన నగరంగా తీర్చిదిద్దడంలో ఎస్ఆర్ఎం ఏర్పాటుతో తొలి అడుగు పడిందని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు. ప్రస్తుతం 226 మంది విద్యార్థులతో ప్రారంభమై రాబోయే రోజుల్లో 50వేల మంది చదువుకునే స్థాయికి ఎదిగి కీలకం కానుందన్నారు. రూ.3024 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి చేయడానికి నాంది పలికారని చెప్పారు. ఇక్కడ నూతన కోర్సులు ప్రవేశపెట్టి వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇక్కడే ఆస్పత్రి నిర్మాణానికి రెండో దశలో వంద ఎకరాలు ఇస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ వల్ల దేశానికి ప్రపంచంలో గుర్తింపు వచ్చిందన్నారు. రాజధాని నిర్మాణానికి ముప్పవరపు సంజీవమ్మ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారని గుర్తు చేస్తూ అమరావతి నిర్మాణంలో 5 కోట్ల మంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొండవీటి వాగుపై 250 ఎకరాల్లో అతిపెద్ద ఉద్యానవనం నిర్మించి దానికి మాజీ మంత్రి ఎంఎస్ కోటేశ్వరరావు పేరు పెడతామని ప్రకటించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఎస్ఆర్ఎం పరిపాలనా భవనం, తరగతి గదులను ఆయన ప్రారంభించారు. అమరావతి అభివృద్ధికి నాంది: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అమరావతి నగరం అన్ని హంగులతో చక్కటి పరిపాలనా, పర్యటక, ఉపాధి, ఉద్యోగాలు కల్పించే కేంద్రంగా ఎదుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఇందుకు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంతో నాంది పలికామన్నారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారని, భవిష్యత్తులో అమరావతి క్యాంపస్లో కూడా ఆ పరిస్థితి రావాలని ఆకాక్షించారు. విదేశాలకు వెళ్లిన వారు తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచంలో మోదీ అగ్రగామిగా ఉన్నారని, ఆయన నేతృత్వంలో దేశం ముందుకెళ్తొందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పేదవారి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే ఈ ఏడాదే 20వేల ఇళ్లయినా మంజూరు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. 13 మంది విద్యార్థులకు ఉచిత విద్య ఎస్ఆర్ఎం వ్యవస్థాపక ఉపకులపతి పచ్చముత్తు మాట్లాడుతూ తాజ్మహల్ నిర్మించిన షాజహాన్ చర్రితలో నిలిచిపోయినట్లు అమరావతి నిర్మాణం చేపట్టిన చంద్రబాబు కూడా చర్రితలో నిలిచిపోతారన్నారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం స్థాయిలో అమరావతిలో ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి కలెక్టర్లు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక బాలికను ఎంపిక చేసి పంపితే 13 మందికి ఉచితంగా విద్యను, ఏటా క్రీడల్లో రాణిస్తున్న 100 మంది విద్యార్థులకు రూ.5వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తామని వెల్లడించారు. ఈ చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాల ప్రజల కోసం ఆస్పత్రి నిర్మించి వైద్యం అందిస్తామన్నారు. సభాపతి కోడెల శివప్రసాద్రావు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, నక్కా ఆనందబాబు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
-
చదువుల కొలువు! నాలెడ్జ్ హబ్గా నవ్యాంధ్ర.. ఎస్ఆర్ఎం వర్సిటీ ప్రారంభోత్సవంలో సీఎం మరో 10 వర్సిటీలొస్తున్నాయ్.. మన కీర్తి చిహ్నం అమరావతి 250 ఎకరాల్లో ‘కొండవీటి’ పార్క్ నిర్మిస్తాం: చంద్రబాబు విదేశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రావాలి: వెంకయ్య రాజధానిని ‘చదువుల నిలయం’ చేయాలన్న ఆకాంక్షలో తొలి అడుగు విజయవంతంగా పడింది. ఉత్తమ విద్యా సంస్థలను రప్పించాలన్న ప్రభుత్వ కృషి ఫలితంగా... ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అమరావతిలో కొలువు తీరింది. ఇదేకాదు... త్వరలో రాజధాని ప్రాంతానికి మరో పది విశ్వవిద్యాలయాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీర్తి చిహ్నం ‘అమరావతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణానికి రైతులు 33,500 ఎకరాలను ఇవ్వడం ఓ చరిత్ర అని పునరుద్ఘాటించారు. దూరదృష్టితో వారు చూపిన చొరవను తన జీవితంలో మర్చిపోలేనన్నారు. అమరావతిలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఏర్పాటైందన్నారు. మరో 10 విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి రానున్నాయని వెల్లడించారు. నవ్యాంధ్ర రాజధానిలో ఏర్పాటైన తొలి ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఎస్ఆర్ఎంకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కలిసి ఆయన శనివారమిక్కడ ప్రారంభోత్సవం చేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ భవిష్యత్తులో 50 వేల మంది విద్యార్థులకు నిలయంగా మారనుందని సీఎం పేర్కొన్నారు. అమరావతి పరిపాలనా రాజధానిగా, నాలెడ్జ్ హబ్గా తయారుకావాలన్నారు. నాలెడ్జ్ హబ్గా రూపుదిద్దుకునే ప్రక్రియలో ఎస్ఆర్ఎం తొలి మెట్టు అవుతుందన్నారు. విద్యార్థులకు అవసరమైన నాణ్యమైన, ఉన్నతమైన కోర్సులను అందించాలని వర్సిటీ అధికారులను కోరారు. ప్రపంచాన్ని శాసించే శక్తి అమరావతికి రావాలంటూ, ఆ క్రమంలో ఎస్ఆర్ఎం తన వంతు పాత్ర పోషించాలన్నారు. పిల్లలను ప్రయోజకులుగా చేస్తే కోట్లు సంపాదిస్తారని, విజ్ఞానానికి ఉన్న శక్తి అదేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని అడ్డుకునేందుకు కొందరు పయ్రత్నిస్తున్నారని, ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి మాత్రం ఆగదని స్పష్టం చేశారు. అమరావతిలో 250 ఎకరాల్లో కొండవీటి వాగు చెంత భారీ పార్కు ఏర్పాటుచేసి.. దానికి మాజీ మంత్రి ఎంఎ్సఎస్ కోటేశ్వరరావు పేరు పెడతామని ప్రకటించారు. రాజధాని నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
-
rayapati nidulu tecchadu anukunta
-
-
-
-
-
-
క్రీడల హబ్గా ఏఎన్యూ 08-05-2017 10:35:01 ఎన్నో జాతీయ క్రీడలను సమర్ధంగా నిర్వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నవ్యాంధ్రలో క్రీడలకు హబ్గా మారింది. ఏపీ పీసెట్ను అప్రతిహతంగా15వసారి నిర్వహిస్తూ పేరుగడిస్తోంది. ఇక్కడ క్రీడల నిర్వహణకు, మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.27.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. రానున్న రోజుల్లో ఏఎనయూ... క్రీడల నిర్వహణ, వ్యాయామ విద్యలో రాష్ర్టానికే వన్నె తీసుకురానుంది. రూ.27.60 కోట్లతో క్రీడా సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్ ట్రాక్ జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణ నవ్యాంధ్రలో క్రీడా వర్సిటీగా ఏఎనయూ 15వ సారి ఏపీ పీసెట్ నిర్వహణకు సంసిద్ధం నేటి నుంచి పీసెట్ అమరావతి: నవ్యాంధ్రలో క్రీడల నిర్వహణ, వ్యాయామ విద్యలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ముందంజలో ఉంది. ఎన్నో జాతీయ క్రీడలను సమర్ధంగా జరుపుతూ.. ఏపీ పీసెట్కు 15వసారి నిర్వహిస్తూ, క్రీడల హబ్గా నిలుస్తోంది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు వర్సిటీ క్రీడా ప్రాంగణం సన్నద్దమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతి సదుపాయాలు కల్పించడానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రూ.27.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం రూ.10 కోట్లతో 200 పడకల వసతి గృహ నిర్మాణం జరుగుతోంది. మల్టీ జిమ్ అండ్ ఫిట్నెస్ సెంటర్ను రూ.కోటితో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వర్సిటీలో రూ.2.40 కోట్లతో ఫిట్నెస్ సెంటర్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. గ తంలో రూ.5 కోట్లతో క్రీడా వసతి గృహం నిర్మించారు. ఇండోర్ గేమ్ల నిర్వహణకు అనువుగా లంకపల్లి బుల్లయ్య ఇండోర్ స్టేడియం, జిమ్ సెంటర్, శాండ్ ట్రాక్, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ వెయిట్ లిఫ్టింగ్తో పాటు సువిశాలమైన, దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా మైదానం వర్సిటీలో ఉన్నాయి. అద్భుతంగా సింథటిక్ ట్రాక్ కేంద్ర యువజనుల, క్రీడల వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.5.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల నిర్వహణకు వీలుగా ఉన్నత ప్రమాణాలతో క్రీడా మైదానంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ట్రాక్ ఇరువైపులా, అంతర్జాతీయ స్థాయిలో ఫ్లడ్ లైట్ల నిర్మాణానికి రూ.8.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 4 టవర్లను ఏర్పాటు చేసి, ఒక్కో టవర్కు 102 ఫ్లడ్ లైట్లు, అమర్చనున్నారు. వార్మ్ ఆఫ్ సింథటిక్ ట్రాక్కు రూ.8 కోట్లతో చేపట్టనున్నారు. రూ.40 మీటర్లతో 6 లైన్ల నిర్మాణం జరుగనుంది. నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) సంస్థ నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. 400 మీటర్ల పరిధిలో ట్రాక్ ఏర్పాటు, దానికి అనుగుణంగా మురుగు, నిల్వ నీరు లేకుండా వుండేందుకు ప్రత్యేకంగా డ్రెయిన్ సదుపాయం కల్పించారు. ట్రాక్ నిర్మాణంలో రెండు రకాలైన మెటీరియల్ను వినియోగించారు. ఫుల్ పియుఆర్, శాండ్విచ్ వంటి మెటీరియల్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. 400 మీటర్ల పరిధి.... సింథటిక్ ట్రాక్ నిర్మాణ పరిధిని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. ట్రాక్పై ఒకేసారి 8 మంది పరుగెత్తేలా నిర్మిస్తున్నారు. ట్రాక్ మధ్యలో 22 క్రీడల నిర్వహణకు అనువుగా ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పచ్చని గడ్డి, లాన్తో ఏర్పాటు జరుగుతోంది. షాట్పుట్, ఫుడ్బాల్, హాకీ, లాంగ్జంప్ వంటి క్రీడలు నిర్వహించవచ్చు. 400 మీటర్ల ట్రాక్ తోపాటు అదనంగా 100 మీటర్ల లైను, ట్రాక్ ఇరువైపులా హైజంప్, పోల్వాలెట్, జావలిన్త్రో, రెండు లాంగ్ జంప్ రన్వే, తదితర క్రీడా సదుపాయాలకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీసెట్ - 2017) జరగనుంది. 17వ తేదీ వరకు దేహదారుఢ్య, క్రీడల నైపుణ్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీ సెట్ కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు. పరీక్షలకు 4,649 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఈనెల 8 నుంచి 15 వరకు పురుష అభ్యర్థులకు 16, 17ల్లో మహిళా అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. బీపీఈడీ కోర్సుకు 2,400, యూజీడీ పీఈడీకి 2,249 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తొలిరోజు హాల్టికెట్ నంబరు 1701 నుంచి 17,456 వరకు మొత్తం 456 మంది పురుష అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. విజయవంతంగా క్రీడా పోటీలు ఏఎనయూలో ఆలిండియా ఇంటర్ వర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలను 2004, 2011 సంవత్సరాల్లో నిర్వహించారు. మరోసారి ఈ ఏడాది డిసెంబర్లో పోటీలు నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మించిన సింథటిక్ ట్రాక్పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏడాది జూన్ 12 నుంచి 15 వరకు జాతీయ, అంతరాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్, నవంబర్ 1 నుంచి 5 వరకు జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను వర్సిటీలో జరగనున్నాయి.
-
-
-
-