-
Posts
66,776 -
Joined
-
Last visited
-
Days Won
90
Everything posted by sonykongara
-
-
4 lane road ga polavaram kalava katta
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
కోహినూర్ వజ్రం ఆకారంలో అసెంబ్లీని నిర్మిస్తాం: బాబు అమరావతి: కోహినూర్ వజ్రం ఆకారంలో అసెంబ్లీని నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ... కొండవీటివాగు దగ్గర 250 కోట్లతో నిర్మించే అతిపెద్ద పార్క్కు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు పేరు పెడతామన్నారు. అలాగే అమరావతిని స్మార్ట్సిటీగా ప్రకటించిన వెంకయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. భారత్లో ఉండే అన్ని విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఏపీకి రావాలని, కృష్ణానది పక్కన ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలు పెడతామని, దసరా రోజున పరిపాలన నగరం పనులు ప్రారంభిస్తామని, విలువలతో కూడిన విద్యకు అమరావతి కేంద్రంగా మారుతుందని, చదువుతో పాటు సంపాదన అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. విభజన చేసినవారు అసూయపడేలా అమరావతి నిర్మాణం: బాబు 15-07-2017 13:01:01 అమరావతి: రాష్ట్ర విభజన చేసినవారు అసూయపడేలా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని కేంద్రమంత్రి వెంక్యనాయుడితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని, రైతులు చూపిన చొరవ జీవితంలో మరచిపోలేనన్నారు. అలాగే అమరావతిలో మొదట ప్రారంభమైన పెద్ద సంస్థ ఎస్ఆర్ఎందేనన్నారు. మూడు విడతల్లో రూ.3,400కోట్ల పెట్టుబడితో 50వేల మంది విద్యార్థులు లక్ష్యంగా ఎస్ఆర్ఎం నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే ఎస్ఆర్ఎంలో కొత్త రకం కోర్సులు అందుబాటులో ఉంటాయని, ఐటీలో తెలుగువారే ఎక్కువగా ఉన్నారని, అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చడమే లక్ష్యం అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఎక్కువమంది యువకులు ఉన్న దేశం భారతేనని, ఎక్కువ అభివృద్ధి జరగబోయే దేశం కూడా భారతేనన్నారు.
-
Purushothapatnam lift irrigation project
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
http://www.nandamurifans.com/forum/index.php?/topic/405520-cm-relief-fund-today/
-
-
రైతు రథాలు పదివేలు సబ్సిడీపై పంపిణీ చేసే ట్రాక్టర్ల సంఖ్య పెంపు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి ప్రకటన అనంతపురం, జూలై 14(ఆంధ్రజ్యోతి): రైతు రథం పథకం కింద గ్రామీణ నియోజకవర్గాల రైతులకు సబ్సిడీపై ఇచ్చే ట్రాక్టర్ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ను ప్రభుత్వం మన్నించింది. పది వేల ట్రాక్టర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. గతంలో ఆరు వేల ట్రాక్టర్లను సబ్సిడీ కింద ఇవ్వాలని నిశ్చయించారు. వీటి కోసం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. నియోజకవర్గానికి కేటాయించిన ట్రాక్టర్ల కంటే అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతోపాటు సిఫారసుల కోసం వచ్చేవారి సంఖ్యా భారీగా ఉండడంతో ఎమ్మెల్యేలు విలవిలలాడారు. ట్రాక్టర్ల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిలను అభ్యర్థించారు. దీంతో సబ్సిడీపై ఇచ్చే ట్రాక్టర్ల సంఖ్యను పది వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సోమిరెడ్డి శుక్రవారం అనంతపురంలో ప్రకటించారు. రెయిన్ గన్స్ ప్రయోగాలపై నిర్వహించిన వర్క్షాపులో ఆయన, జలవనరుల మంత్రి దేవినేని ఉమ సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలతో సమీక్ష జరిపారు. గత ఏడాది అనుభవాలు, ఈ ఏడాది అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ బెట్టపరిస్థితుల్లో వేరుశనగ పంటను కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
-
floating hotel ga INS Viraat ship ?
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
డిసెంబరుకల్లా కాకినాడకు ఐఎన్ఎస్ విరాట్! అక్టోబరులో యుద్ధనౌకను ప్రభుత్వానికి అప్పగించనున్న రక్షణ శాఖ ఈనాడు, అమరావతి: ప్రతిష్ఠాత్మక ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను రాష్ట్రానికి తీసుకువచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఈ నౌకను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ టెండర్లు ఆహ్వానించింది. వచ్చే వారంలో ఈ టెండర్లను ఖరారు చేయనున్నారు. నౌక ఇంజిన్ పనిచేసే పరిస్థితిలో లేనందున అక్కడినుంచి కాకినాడ వరకు నీటిలో లాక్కుని రావాల్సి ఉంటుంది. ఈ పని కోసం ఒక సంస్థను ఎంపిక చేసేందుకే టెండర్లు ఆహ్వానించారు. నౌకను కాకినాడకు తీసుకువచ్చేందుకు రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. కాకినాడకు తీసుకువచ్చాక అక్కడే నౌకకు అవసరమైన మెరుగులు దిద్దడంతోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులను చేపట్టనున్నారు. చివరగా విశాఖ తీరానికి తరలించి పర్యాటక కేంద్రంగా రూపొందించనున్నారు. విరాట్ను పరిశీలించి తీసుకురానున్న నిపుణుడు: వచ్చే అక్టోబరులో విరాట్ను రక్షణశాఖ ఆంధ్రప్రదేశ్కు అప్పగించనుంది. యుద్ధనౌకలో చరిత్రాత్మక ఇతర ప్రధాన, సాంకేతిక పరికరాలు, అవశేషాలు ఏం ఉన్నాయో పరిశీలించడంతో పాటు నౌకను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కపిల్గుప్తా అనే నిపుణుడిని సలహాదారుగా నియమించుకుంది. ఆయన్ని ముంబయికి పంపింది. కేంద్రం అప్పగింత, రాష్ట్రం స్వీకరణ ప్రక్రియను ఆయనే పర్యవేక్షించనున్నారు. లీడ్స్ కన్సల్టెంట్స్ అధిపతి అయిన గుప్తా గతంలో ఇదే విరాట్లో వైస్కెప్టెన్గా పనిచేశారని పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాడార్, మిసైల్స్ వంటి వాటితో విరాట్లో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. విరాట్కు వెనుకభాగంలో ఉన్న ఖాళీ స్థలంలో యుద్ధాల్లో వినియోగించిన పాత హెలికాప్టర్లాంటివి ఉంచి పర్యాటకులకు కనువిందు కలిగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ హిమాన్షు శుక్లా తెలిపారు. -
Krishna Godavari Pavitra sangamam
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
దసరా ముహూర్తం అదే రోజు అమరావతి నిర్మాణానికి శ్రీకారం పరిపాలన, న్యాయ నగరాలకు సీఎం ఓకే 1350 ఎకరాల్లో ప్రారంభంకానున్న పనులు రెండేళ్లలోగా నిర్మాణాల పూర్తికి ఆదేశం ఆంధ్రులకు గర్వకారణంగా అమరావతి పది అంతస్థుల్లో సచివాలయ సముదాయం ఒకే అంతస్థులో మంత్రులు, కార్యదర్శులు రాజధాని మొత్తం కనిపించేలా వాచ్టవర్ ఓవైపు ఎన్టీఆర్.. మరోవైపు అంబేడ్కర్ విగ్రహాలు డిజైన్లను రాష్ట్రపతి, ప్రధానికి చూపనున్న సీఎం అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ప్రజారాజధాని అమరావతి నిర్మాణ పనులను విజయదశమి(సెప్టెంబరు30న) రోజున ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ, మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్, చంద్రశేఖర్ అండ్ కన్సల్టెంట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో.. 1350 ఎకరాల్లో నిర్మించనున్న పరిపాలన, న్యాయ నగరాలకు సంబంధించిన మాస్టర్ప్లాన్కు సీఎం తుది ఆమోదం తెలిపారు. వాటిల్లో వివిధ నిర్మాణాలను ప్రారంభించేందుకు, పూర్తి చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిని విధించారు. అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం (సింబల్ ఆఫ్ ప్రైడ్)గా, పోలవరం ప్రాజెక్టును ప్రగతి చిహ్నం (సింబల్ ఆఫ్ ప్రోగ్రె్స)గా సీఎం అభివర్ణించారు. అమరావతి పరిపాలన, న్యాయ నగరాలకు సంబంధించిన మాస్టర్ప్లాన్ను, వాటిల్లో ఐకానిక్ బిల్డింగులైన అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ డిజైన్లను సీఎం త్వరలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు చూపుతారని మంత్రి నారాయణ తెలిపారు. ఈ రెండు నగరాల నిర్మాణ పనులను ఈ ఏడాది సెప్టెంబరు 30 - అక్టోబరు 31 మధ్య ప్రారంభించి ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణ విశేషాలు కృష్ణా నదీ తీరం నుంచి ప్రారంభమై శాఖమూరు రీజనల్ పార్కు వరకూ ఉండనున్న పరిపాలన, న్యాయ నగరాలు మొత్తం 1350 ఎకరాల్లో నిర్మితమవుతాయి. 900 ఎకరాల్లో నిర్మించనున్న పరిపాలన నగరంలో శాసనసభ, సచివాలయం, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఇతర సిబ్బంది నివాస భవనాలు రానున్నాయి. 450 ఎకరాల్లో నిర్మితమవనున్న జస్టిస్ సిటీలో హైకో ర్టు, న్యాయమూర్తులు, నివాస భవనాలు ఉంటాయి. 250 ఎకరాలు ఒక బ్లాక్ చొప్పున నిర్మితమయ్యే ఈ రెండు నగరాల్లో ప్రతి బ్లాక్లోనూ అధికారిక కార్యాలయాలు, నివాస సముదాయాలు, పార్కులు, బహుళ ప్రయోజన భవన నిర్మాణాలను ఏర్పాటు చేస్తారు. మొత్తం విస్తీర్ణంలో 50 శాతాన్ని జల వనరులు, పచ్చదనానికి కేటాయించారు. శాసనసభ కోహినూర్ డైమండ్ ఆకృతిలో, హైకోర్టు స్థూపాకారంలో ఉంటాయి. నదీ తీరాన దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహం, శాఖమూరు పార్కులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. నదీ తీరాన అటూ ఇటూ రాజ్భవన్, ముఖ్యమంత్రి అధికార నివాసాలు నిర్మిస్తారు. వీటికి చేరువలోనే 2 ఐకానిక్ టవర్లను నిర్మించనున్నారు. ఈ రెండు నగరాల పొడవునా ఆహ్లాదాన్ని పంచే కాల్వలు, కొలనులు, పార్కులు, మల్టీప్లెక్స్లు, మాల్స్, రెస్టారెంట్లు, మైదానాలు, క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తారు. సచివాలయం 10 అంతస్థుల భవన సముదాయంగా రూపుదిద్దుకుంటుంది. అధికారిక కార్యకలాపాలు వేగంగా సాగడంతోపాటు వివిధ పనులపై వచ్చే ప్రజల సౌకర్యార్ధం సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, సెక్రటరీల చాంబర్లు, హెచ్వోడీల కార్యాలయాలన్నీ ఒకే అంతస్థులో వచ్చేలా నిర్మిస్తారు. పరిపాలనా నగరం మధ్యలో 500 అడుగుల ఎత్తున వాచ్టవర్ను నిర్మిస్తారు. 217 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండే రాజధాని నగర మొత్తాన్ని దీనిపై నుంచి వీక్షించవచ్చు. దీనిని అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారు. కృష్ణానది పక్కన ప్రజోపయోగకర కార్యకలాపాల కోసం కొంత స్థలం వదిలారు. ఇందులో ప్రజల మనోల్లాసానికి, అమరావతికి వచ్చే సందర్శకులను ఆకర్షించేందుకు పలు ప్రత్యేకతలను ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనుల షెడ్యూల్ ఇదీ.. అసెంబ్లీ కాన్సెప్ట్ డిజైన్ ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీకల్లా స్ట్రక్చరల్ డిజైన్లను సిద్ధం చేస్తారు. సెప్టెంబరు 23- 25 తేదీల మధ్య టెండర్లను ఖరారు చేసి, 30న దసరా రోజుల్లో ప్రారంభిస్తారు. హైకోర్టు కాన్సెప్ట్ డిజైన్ ఈ ఏడాది ఆగస్టు 30 కల్లా అందుతుంది. సెప్టెంబరు 15కి దాని స్ట్రక్చరల్ డిజైన్లు సిద్ధమవుతాయి. అక్టోబరు 15కి టెండర్లను ఖరారు చేసి, ఆ వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. సెక్రటేరియట్ కాన్సెప్ట్ డిజైన్ సెప్టెంబరు 15కి సిద్ధమవుతుంది. 30 కల్లా స్ట్రక్చరల్ డిజైన్లు వస్తాయి. అక్టోబరు నెలాఖరుకల్లా నిర్మాణం ప్రారంభిస్తారు. అన్ని నిర్మాణాలూ ప్రారంభించిన తర్వాత ఏడాదిన్నర నుంచి రెండు సంవత్సరాల్లో పూర్తవుతాయి.
-
ఏడాదిన్నరలో నిర్మాణాలు పరిపాలన నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందన్న అంచనాలు ఇంకా రూపొందించలేదని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ విలేకరుల సమావేశంలో తెలిపారు. స్ట్రక్చరల్ డిజైన్లు సిద్ధమైన తర్వాతే అంచనాలు రూపొందించగలమని, ఆ తర్వాతే నిర్మాణ వ్యయంపై ఒక స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏడాదిన్నరలో నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. హైకోర్టు భవనంలో కోర్టు హాళ్లు చుట్టూ పెట్టి, మధ్యలో జడ్జిల ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు సూచించారని, దానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నామని తెలిపారు.
-
దసరాకు శుభారంభం సెప్టెంబరు 30 నుంచి శాసనసభ భవన నిర్మాణం అక్టోబరు 15న హైకోర్టు పనులకు శ్రీకారం పరిపాలన, న్యాయ నగరాల ప్రణాళిక ఖరారు తుది ప్రణాళికలు వచ్చాక రాష్ట్రపతి, ప్రధానికి ప్రదర్శన అమరావతి ‘గర్వకారణ చిహ్నం’ పోలవరం ‘పురోగతికి చిహ్నం’ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనాడు - అమరావతి రాజధాని పరిపాలన నగర ప్రణాళికలు, వివిధ భవనాల ఆకృతులు ప్రజలకు తెలిసేలా, వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించేలా ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేయండి. వివిధ భవనాల నమూనాలు ప్రజలు తిలకించేలా ప్రత్యేక ప్రదర్శన కేంద్రం (గ్యాలరీ) నెలకొల్పండి - అధికారులకు చంద్రబాబు ఆదేశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శాసనసభ భవన నిర్మాణాన్ని వచ్చే విజయదశమి రోజున (సెప్టెంబరు 30) ప్రారంభించనున్నారు. దీంతో పరిపాలన నగర నిర్మాణ పనులు మొదలవుతాయి. హైకోర్టు నిర్మాణ పనుల్ని అక్టోబరు 15న ప్రారంభిస్తారు. ఈ రెండు భవనాలను మకుటాయమానంగా (ఐకానిక్) నిర్మిస్తారు. అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలన నగరం, దానికి కొనసాగింపుగా మరో 465 ఎకరాల్లో నిర్మించే న్యాయ నగరాల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఖరారు చేసింది. శాసనసభ, హైకోర్టు ఆకృతులపైనా స్పష్టత వచ్చింది. వీటి ఆకృతులు రూపొందించిన లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మరో దఫా సమావేశమయ్యారు. తుది ఆకృతులు, స్ట్రక్చరల్ డిజైన్లు ఎప్పటికి పూర్తి చేయాలో, నిర్మాణ పనులు ఎప్పుడు మొదలు పెట్టాలో స్పష్టంగా నిర్దేశించారు. అమరావతిని రాష్ట్రానికి గర్వకారణ చిహ్నం (సింబల్ ఆఫ్ ప్రైడ్)గా, పోలవరం ప్రాజెక్టుని ‘పురోగతికి చిహ్నం (సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్)’గా సీఎం చంద్రబాబునాయుడు అభివర్ణించారు. నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ శాసనసభ, హైకోర్టు తుది ఆకృతులు అందజేసిన తర్వాత, వాటిని రాష్ట్రపతికి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవీ...! * శాసనసభ భవనం కోహినూర్ వజ్రం ఆకృతిలో ఉంటుంది. ఆగస్టు 15కి నార్మన్ ఫోస్టర్ సంస్థ తుది ఆకృతులు అందజేస్తుంది. ఆగస్టు 30 నాటికి స్ట్రక్చరల్ డిజైన్లు ఇస్తుంది. సెప్టెంబరు 23, 24 తేదీల నాటికి టెండర్లు ఖరారు చేస్తారు. సెప్టెంబరు 30న నిర్మాణ పనులు మొదలవుతాయి. * హైకోర్టు భవనం స్థూపాకృతిలో ఉంటుంది. ఆగస్టు నెలాఖరుకి తుది ఆకృతి అందజేస్తుంది. సెప్టెంబరు 15కి స్ట్రక్చరల్ డిజైన్లు ఇస్తుంది. అక్టోబరు 15న నిర్మాణం మొదలవుతుంది. * సచివాలయం భవనం ఆకృతి సెప్టెంబరు 15కి సిద్ధమవుతుంది. ఆ నెలాఖరుకి స్ట్రక్చరల్ డిజైన్లు ఇస్తారు. నెల రోజుల్లో టెండరు ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభిస్తారు. * సచివాలయ భవనాలు 10 అంతస్తుల్లో ఉంటాయి. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు కలిసే ఉంటాయి. ఒక శాఖకు సంబంధించిన మంత్రి, కార్యదర్శులు, విభాగాధిపతులతో పాటు, మొత్తం ఉద్యోగులంతా ఒకే చోట ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్ని భవనాలు వస్తాయన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. మొత్తం మీద 40-50 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుంది. * పరిపాలన నగరం మధ్యలో 500 అడుగుల ఎత్తులో ఐకానిక్ టవర్ నిర్మిస్తారు. దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. ఇది వ్యూయింగ్ టవర్. దీనిపై నుంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. పరిపాలన, న్యాయ నగరాల ప్రణాళిక ఇలా...! * పరిపాలన, న్యాయ నగరాలు ఉత్తర దిక్కున కృష్ణా నదీ తీరం నుంచి మొదలై దక్షిణం వైపునకు విస్తరించి ఉంటాయి. దీని వెడల్పు కిలో మీటరు, పొడవు 7-8 కి.మీ.లు ఉంటుంది. దీన్ని ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి, హెచ్ అని 8 బ్లాకులుగా విభజించారు. నదికి, కరకట్టకు మధ్యనున్న బ్లాకు (ఎ) విస్తీర్ణం 24 ఎకరాలు. దీనిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేస్తారు. * రెండో బ్లాకు (బి) విస్తీర్ణం సుమారు 125 ఎకరాలు. ముఖ్యమంత్రి, గవర్నర్ అధికారిక నివాసాలు ఉంటాయి. తూర్పు దిశలో గవర్నర్ బంగళా, పడమర దిక్కున సీఎం నివాస గృహాలు ఉంటాయి. సిటీస్క్వేర్ ఉంటుంది. రెండు ఐకానిక్ టవర్లు, స్పోర్ట్స్ ఎరీనా, సంప్రదాయ నృత్యశాల, ఒపేరా హౌస్, కన్వెన్షన్ సెంటర్లు, ఆర్ట్ గ్యాలరీ, పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సెంటర్ వంటివన్నీ దీనిలో ప్రతిపాదించారు. * సి నుంచి హెచ్ వరకు ఉన్న బ్లాకుల్లో... ఒక్కో బ్లాకు విస్తీర్ణం 240-250 ఎకరాలు ఉంటుంది. * సి బ్లాకులో బహుళ ప్రయోజనకర భవనాలు ఉంటాయి. మధ్యలో పెద్ద పార్కు వస్తుంది. తూర్పు, పడమర దిక్కుల్లో నివాస, వాణిజ్య భవనాలు వస్తాయి. హోటళ్లు, వినోద కేంద్రాలు, పబ్లిక్ స్క్వేర్లు వంటివన్నీ దీనిలో ఉంటాయి. * డి బ్లాకులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు వంటి ప్రముఖుల నివాస గృహాలు ఉంటాయి. మంత్రులకు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు వ్యక్తిగత గృహాలు నిర్మిస్తారు. ఎమ్మెల్యేలు, జూనియర్ ఐఏఎస్ అధికారులకు అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. * ఇ బ్లాకులో దక్షిణం వైపు మధ్య భాగంలో శాసనసభ భవనం నిర్మిస్తారు. దానికెదురుగా సెరిమోనియల్ స్క్వేర్ వంటివి వస్తాయి. శాసనసభ భవనానికి, సెరిమోనియల్ స్క్వేర్కి మధ్యలో కల్చరల్ సెంటర్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఈ బ్లాకులో పడమర వైపు సచివాలయ భవనాలు వస్తాయి. ఉత్తరం పక్క కన్వెన్షన్ సెంటర్లు, శాసన సభాపతి, శాసన మండలి ఛైర్మన్ల నివాస గృహాలు ఉంటాయి. సచివాలయం పక్కనే 8 అంతస్తుల మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. * ఎఫ్ బ్లాక్లో వాయవ్యంలో హైకోర్టు భవనం వస్తుంది. అదే బ్లాకులో ట్రైబ్యునళ్లు, ఇతర కోర్టుల సముదాయం, న్యాయమూర్తులు, సిబ్బంది నివాస గృహాలు వంటివి వస్తాయి. * జి, హెచ్ బ్లాకుల్లో బహుళ ప్రయోజనకర భవనాలు, ఇతర కార్యకలాపాల కోసం కేటాయించారు. * హెచ్ బ్లాక్ తర్వాత 250 ఎకరాల్లో శాకమూరు పార్కుని అభివృద్ధి చేస్తారు. ఇక్కడే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తారు. * పరిపాలన, న్యాయ నగరాలకు ఒక పక్కన ఎన్టీఆర్, మరో పక్కన అంబేద్కర్ విగ్రహలు, మధ్యలో 500 అడుగుల ఎత్తైన ఐకానిక్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. * 1365 ఎకరాల్లో 50 శాతం విస్తీర్ణంలో పార్కులు, జలాశయాలు, కాలువలు ఉంటాయి. * కాలువల్లో నిత్యం నీరు ప్రవహించేలా ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో వాటర్ ట్యాక్సీలు వంటివి నడుపుతారు
-
Krishna Godavari Pavitra sangamam
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
రూ.250 కోట్లతో పవిత్ర సంగమానికి హంగులు! కూచిపూడి నాట్యారామ నిర్మాణం అమలుపై ప్రత్యేక దృష్టి రూ.116 కోట్లతో హేవలాక్ వంతెన అభివృద్ధి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ కమిటీ భేటీలో తీర్మానం ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి తలమానికంగా నిలుస్తున్న పవిత్ర సంగమ(కృష్ణా, గోదావరి నదుల సంగమం) ప్రాంతాన్ని సుమారు రూ.250కోట్లతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. 10వేల మంది సామర్థ్యంతో బహుళార్థ ప్రయోజక మందిరం, గ్రాండ్ థియేటర్/ఆడిటోరియం, హోటల్ తదితర సౌకర్యాలనూ కల్పించాలని శుక్రవారం జరిగిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ కమిటీ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ అధ్యక్షతన వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో జరిగిన ఈ కమిటీ భేటీలో ఇతర పర్యాటక ప్రాజెక్టుల పురోగతి, నూతన ప్రాజెక్టుల ప్రతిపాదనలను సమీక్షించారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో నాట్యారామం నిర్మాణం పురోగతిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. నాట్యారామాన్ని ప్రకటించి ఏడాది అవుతున్నా పురోగతి లేకపోవడంపై చర్చ జరిగింది. అక్కడ కూచిపూడి అంతర్జాతీయ శిక్షణ కేంద్రం, మ్యూజియం, కళా ప్రదర్శన కేంద్రం, కూచిపూడి నాట్యపితామహుడు సిద్ధేంద్రయోగి విగ్రహం, డిజిటల్, భౌతిక గ్రంథాలయం, ఆరుబయలు వేదిక తదితర సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. కొండపల్లి కోట అభివృద్ధిపైనా చర్చించారు. విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో వేయి మంది కూర్చునేలా రూ.10కోట్లతో మరో కళాక్షేత్రాన్ని నిర్మించేందుకు సిద్ధంచేసిన ప్రతిపాదనలను కమిటీ పరిశీలించింది. రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై వినియోగంలో లేని హేవలాక్ వంతెనను రూ.116కోట్ల అంచనా వ్యయంతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్కుమార్ మీనా కమిటీకి వివరించారు. వంతెనకు ఉన్న 57 స్తంభాల్లో తొలిదశలో రాజమహేంద్రవరం వైపు 14, కొవ్వూరు వైపు మరో 14 స్తంభాల వరకు పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. వాణిజ్య, వినోద, ఆహార, పానీయ జోన్ల వంటివి అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఇతర నూతన పర్యాటక ప్రాజెక్టుల ప్రతిపాదనలను పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని పర్యాటక సౌకర్యాలకు అద్దంపట్టేలా ప్రత్యేక మ్యాగజైన్ను తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మీనా తెలిపారు. సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ కన్సెల్టెన్సీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
floating hotel ga INS Viraat ship ?
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-