Jump to content

sonykongara

Members
  • Posts

    75,547
  • Joined

  • Last visited

  • Days Won

    113

Everything posted by sonykongara

  1. ఒంగోలు, నాగార్జునసాగర్‌లో విమానాశ్రయాలు By Andhra Pradesh News DeskPublished : 10 Jul 2025 05:16 IST Ee Font size 1 min read ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఒంగోలు, నాగార్జునసాగర్‌లో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి సాంకేతిక, ఆర్థిక సాధ్యత నివేదిక (టీఈఎఫ్‌ఆర్‌) తయారు చేసేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ఓ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 29 వరకు ఆన్‌లైన్‌లో బిడ్‌ల దాఖలుకు గడువు నిర్దేశించింది. మరుసటి రోజు టెక్నికల్‌ బిడ్‌లను తెరచి, అందులో అర్హత పొందిన సంస్థల ఫైనాన్షియల్‌ బిడ్‌లను ఆగస్టు 4న తెరవనుంది. బిడ్‌ దక్కించుకున్న సంస్థకు 30 రోజుల్లో ఎల్‌వోఏ జారీ చేయనున్నట్లు ఏపీఏడీసీఎల్‌ తెలిపింది. ఒంగోలులో ప్రతిపాదించిన విమానాశ్రయానికి నగరానికి 7 కి.మీల దూరంలో అవసరమైన భూములను ప్రభుత్వం గుర్తించింది. నాగార్జునసాగర్‌లో ప్రతిపాదించిన విమానాశ్రయానికి విజయపురి సౌత్‌ దగ్గర నిర్మించనుంది.
  2. మద్యం కేసులో YCP విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు అందించింది. ఈనెల 12న విచారణకు రావాలని ఆదేశించింది.
  3. తీర ప్రాంతానికి ప్రగతి మార్గం By Andhra Pradesh Dist. DeskPublished : 10 Jul 2025 04:00 IST Ee Font size 2 min read నాలుగు వరుసలుగా వాడరేవు - చిలకలూరిపేట రహదారి బాపట్ల జిల్లా పర్చూరు వద్ద నాలుగు వరుసల రహదారి పనుల్లో భాగంగా వంతెన నిర్మాణం ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - చిలకలూరిపేట గ్రామీణ: బాపట్ల జిల్లా వాడరేవు నుంచి పల్నాడు జిల్లా చిలకలూరిపేట వరకు జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి ప్యాకేజీలో రూ.1064.24 కోట్లతో చేపట్టిన పనులు 78 శాతం పూర్తయ్యాయి. ఫిబ్రవరి 2024లో మొదలైన పనులు ఏప్రిల్‌ 2026 నాటికి పూర్తి కావాల్సి ఉంది. రహదారి నిర్మాణం కొలిక్కి రాగా పైవంతెన, వంతెనల పనులు జరుగుతున్నాయి. వంతెనల నిర్మాణం పూర్తయ్యాక ఒక లేయరు తారు వేసే పనులు చేయాల్సి ఉంది. నిర్ణీత గడువు కంటే ముందుగా పనులు పూర్తిచేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నందున.. ఆ మేరకు పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశారు. నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటంతో పాటు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా కానుంది. తీరప్రాంతంతో అనుసంధానం కావడం, తెలంగాణ రాష్ట్ర వాసులకు వాడరేవు దగ్గరి బీచ్‌ కావడంతో పర్యాటకంగా ఈ మార్గం అత్యంత కీలకం కానుంది. ప్రయోజనాలెన్నో.. ్ర ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్న అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి నుంచి పల్నాడు జిల్లా నకరికల్లు వద్ద విడిపోయి బాపట్ల జిల్లా వాడరేవు వరకు జాతీయ రహదారి 167ఏ వెళ్తుంది. ్ర మార్గం మధ్యలో చీరాల సమీపంలో ఒంగోలు-దిగమర్రు, చిలకలూరిపేట వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారులతో ఇది అనుసంధానమవుతుంది. హైదరాబాద్‌ నుంచి సముద్రతీర ప్రాంతానికి అనుసంధానం చేయడంలో ఈ మార్గం అత్యంత కీలకం. తెలంగాణ నుంచి వారాంతాల్లో చీరాల, వాడరేవు, బాపట్లలోని సూర్యలంక తీరాలకు వచ్చే పర్యాటకులకు ఈ దారి అత్యంత అనుకూలం. ఒంగోలు- దిగమర్రు మార్గంలో చెన్నై నుంచి వచ్చిన భారీ వాహనాలు ఈ దారిలో హైదరాబాద్‌కు వెళ్లవచ్చు. చెన్నై నుంచి తెలంగాణ వైపు వెళ్లేవారికి ఇది దగ్గరి దారి అవుతుంది. చెన్నై నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సరకు రవాణాలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది. రెండో ప్యాకేజీ కింద చిలకలూరిపేట నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వరకు పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. ఇక్కడి భూములకు విలువ పెరగడంతోపాటు రాకపోకలు అత్యంత సులభమవుతాయి. పల్నాడు వాసులు అమరావతి, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లడానికి ఇది అనుసంధాన మార్గంగా ఉపయోగపడుతుంది.
  4. డిసెంబర్‌ నాటికి అమరావతి క్వార్టర్స్‌లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు: అయ్యన్నపాత్రుడు By Andhra Pradesh News TeamPublished : 09 Jul 2025 16:18 IST Ee Font size 1 min read అమరావతి: ఈ డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజధాని అమరావతి క్వార్టర్స్‌లోనే ఉంటారని ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అన్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను ఆయన బుధవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలోని ఛాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని నివాస సముదాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్‌ పూల్‌, ఆస్పత్రి, క్లబ్‌ హౌస్‌ ఉండేలా చూడాలని ఆదేశించారు. సోలార్‌, గ్రౌండ్‌ వాటర్‌ రీఛార్జ్‌, వేస్ట్‌ వాటర్‌ వినియోగం ఉండాలని దిశానిర్దేశం చేశారు. చట్టసభ సభ్యుల కోసం మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 35మంది మంత్రులు, 36 మంది న్యాయమూర్తుల క్వార్టర్స్ వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. కృష్ణా నది వెంబడి సీఎం అధికారిక నివాసం, రాజ్‌భవన్‌ ఉంటాయని తెలిపారు.
×
×
  • Create New...