Jump to content

sonykongara

Members
  • Posts

    75,409
  • Joined

  • Last visited

  • Days Won

    113

Everything posted by sonykongara

  1. Quantum Valley: సిలికాన్‌ వ్యాలీని తలపించేలా క్వాంటం వ్యాలీ! కెనడాలోని వాటర్లూ క్వాంటం వ్యాలీ విద్యా పరిశోధన, స్టార్టప్‌లపై దృష్టి పెట్టింది. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ ప్రధాన క్వాంటమ్‌ కంపెనీలకు నిలయం. కానీ, కేంద్రీకృత హబ్‌ కాదు. By Andhra Pradesh News DeskUpdated : 25 Jun 2025 06:41 IST Ee Font size 4 min read అమరావతిలో రూ.4,000 కోట్లతో ఏర్పాటు వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం 15 లక్షల ఉపాధి అవకాశాలు అంకురాల నుంచి వేగవంతమైన క్వాంటం కంప్యూటర్‌ వరకు.. కెనడాలోని వాటర్లూ క్వాంటం వ్యాలీ విద్యా పరిశోధన, స్టార్టప్‌లపై దృష్టి పెట్టింది. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ ప్రధాన క్వాంటమ్‌ కంపెనీలకు నిలయం. కానీ, కేంద్రీకృత హబ్‌ కాదు. చైనా జాతీయ హెఫీ ల్యాబ్స్‌ పెద్ద ఎత్తున ఉన్నా.. అవి రక్షణ ఆధారితమైనవి. ఇతర రంగాలకు సంబంధించి ప్రాధాన్యత లేదు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటం వ్యాలీ డీప్‌టెక్‌ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్‌ ఏఐ, సెమీకండక్టర్స్, రక్షణ సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దబోతోంది. బహుళజాతి సంస్థలు, స్టార్టప్‌లు, ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేయనుంది. పాలనలోనూ క్వాంటం టెక్నాలజీ అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ఐటీ సాఫ్ట్‌వేర్‌ సేవలకు భిన్నంగా.. కటింగ్‌-ఎడ్జ్‌ పరిశోధన, హార్డ్‌వేర్‌ తయారీ, వినూత్న సాంకేతికతల ఆవిష్కరణలకు అమరావతిలోని క్వాంటం వ్యాలీ కేంద్రం కానుందని ప్రభుత్వం చెబుతోంది. 15 లక్షల ఉద్యోగాలు డీప్‌టెడ్‌ వ్యాలీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 లక్షల ఉన్నతస్థాయి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ అంచనా. ఉపాధి అవకాశాలు ఉండే రంగాలు.. క్వాంటం సైంటిస్టులు/రీసెర్చర్లు క్వాంటం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు క్వాంటం హార్డ్‌వేర్‌ ఇంజినీర్లు క్వాంటం-అవేర్‌ డేటా సైంటిస్టులు/ఎంఎల్‌ ఇంజినీర్లు సైబర్‌సెక్యూరిటీ నిపుణులు డొమైన్‌ నిపుణులు సిస్టమ్‌ ఇంజినీర్లు, కమర్షియలైజేషన్‌ ప్రొఫెషనల్స్‌ ఏరోస్పేస్, రక్షణ రంగాల పెట్టుబడులకు కేంద్రం ఏరోస్పేస్, రక్షణరంగ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక జోన్‌లుగా వ్యాలీని అభివృద్ధి చేయడంపై సీఎం దృష్టిపెట్టారు. తద్వారా ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీలో దిగ్గజ సంస్థలైన హెచ్‌ఏఎల్‌ వంటివాటి పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉంటుంది. ఇస్రో టెస్టింగ్‌ ల్యాబ్‌.. డీఆర్‌డీవో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. గ్లోబల్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకునేలా.. క్వాంటం కంప్యూటింగ్‌ మార్కెట్‌ 2024లో 71.4 మిలియన్‌ డాలర్ల నుంచి 2035 నాటికి 500 మిలియన్‌ డాలర్లకు చేరనుందని అంచనా. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని.. దేశాన్ని గ్లోబల్‌ క్వాంటం లీడర్‌గా తీర్చిదిద్దడం ద్వారా గ్లోబల్‌ మార్కెట్‌లో అధిక వాటాను పొందే అవకాశం ఉంటుందన్నది ఆలోచన. దీర్ఘకాలిక లక్ష్యాలు అమరావతిలో ఏర్పాటుచేసే పార్కు జాతీయ క్వాంటం మిషన్‌లో భాగం కానుంది. 2023-24 నుంచి 2030-31 మధ్య (8 ఏళ్లలో) రూ.6,003.65 కోట్లను జాతీయ క్వాంటం మిషన్‌ ఖర్చు చేయనుంది. అందులో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్వాంటం వ్యాలీ.. ముఖ్య విభాగాలు క్వాంటం వ్యాలీ టెక్‌ పార్క్‌: ఐబీఎం, టీసీఎస్, ఎల్‌ అండ్‌ టీ సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దేశంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం కంప్యూటర్‌ 156-క్యూబిట్‌ క్వాంటం సిస్టమ్‌-2ను ఐబీఎం ఇక్కడ ఏర్పాటుచేస్తుంది. ఎల్‌ అండ్‌ టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే.. క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు, హైబ్రీడ్‌ కంప్యూటింగ్‌ సొల్యూషన్‌లను టీసీఎస్‌ అందించనుంది. హెల్త్‌కేర్, ఫైనాన్స్, తయారీ రంగాలలో క్వాంటం సామర్థ్యాలను టీసీఎస్‌ అనుసంధానం చేస్తుంది. ఎకడమిక్‌ ఇంటిగ్రేషన్‌: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్ల్లో క్వాంటం కంప్యూటింగ్‌ కోర్సులు ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం క్వాంటం కంప్యూటింగ్‌లో మేజర్, మైనర్‌ డిగ్రీ ప్రోగ్రాంలను అందిచనుంది. దీనివల్ల క్వాంటం ఇండస్ట్రీకి నైపుణ్యం ఉన్న మానవవనరులను అందించేందుకు చర్యలు దోహదపడనున్నాయి. ప్రభుత్వ రంగ అప్లికేషన్లు: ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు పాలనలో క్వాంటం సాంకేతికతను ప్రభుత్వం వినియోగించనుంది. దేశంలోనే మొదటి క్వాంటం గవర్నెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ మన నుంచే అందబోతోంది. అంతర్జాతీయ వర్సిటీల సహకారం అమరావతిలో ఏర్పాటు కానున్న డీప్‌టెక్‌ రీసెర్చ్‌ పార్క్‌కు ఎకడమిక్‌గా సహకరించేందుకు అమెరికాకు చెందిన పర్డ్యూ విశ్వవిద్యాలయం, జపాన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యోలు అంగీకరించాయి. ఆస్ట్రేలియాకు చెందిన విశ్వవిద్యాలయాల సహకారం కోసం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. స్మార్ట్‌ సిటీ ఫీచర్లు అమరావతి స్మార్ట్‌ సిటీ ప్రణాళికలో భాగంగా క్వాంటం వ్యాలీ రూపొందుతోంది. ఇందులో స్మార్ట్‌ సిటీ ఫీచర్లు ఉన్నాయి. ఏఐ-ఆధారిత ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్, గ్రీన్‌ ఎనర్జీ గ్రిడ్స్, కాలుష్య నియంత్రణ కోసం క్యాంపస్‌లో విద్యుత్‌ వాహనాలను వినియోగించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా వ్యాలీని హై-టెక్, ఎకో ఫ్రెండ్లీ ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన. అమరావతి పరిధిలో గ్రీన్‌ ఎనర్జీ వినియోగించేలా ప్రణాళిక రూపొందించింది. ఈనాడు-అమరావతి
  2. సిలికాన్‌ వ్యాలీని తలపించేలా క్వాంటం వ్యాలీ! సాంకేతికతలకు ప్రత్యేకంగా అమరావతిలోని క్వాంటం వ్యాలీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. రాష్ట్ర సాంకేతిక రంగంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. By Andhra Pradesh News DeskPublished : 25 Jun 2025 04:47 IST Ee Font size 1 min read నేడు విజయవాడలో వర్క్‌షాప్‌ సాంకేతికతలకు ప్రత్యేకంగా అమరావతిలోని క్వాంటం వ్యాలీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. రాష్ట్ర సాంకేతిక రంగంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అమెరికాలోని ‘సిలికాన్‌ వ్యాలీ’ని మించి.. దేశంలోనే మొదటి సాంకేతిక వ్యాలీగా దీన్ని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. 1990లలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లే.. ఇప్పుడు క్వాంటం ఇన్నోవేషన్‌ గ్లోబల్‌ హబ్‌ ఏర్పాటు ద్వారా ‘ఫస్ట్‌-మూవర్‌’ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలన్నది ఆయన ఆలోచన. రాజధాని అమరావతిలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా భవిష్యత్తులో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వ అంచనా. దీని ఏర్పాటు కోసం అమరావతిలో 50 ఎకరాలు కేటాయించింది. బుధవారం ‘క్వాంటం మిషన్‌’ పేరిట విజయవాడలో నిపుణులతో వర్క్‌షాప్‌ నిర్వహించనుంది. రూ.4,000 కోట్లతో సాంకేతికతల ప్రత్యేకతగా టవర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2026 జనవరి 1న వ్యాలీని ప్రారంభించనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ దార్శనికపత్రాన్ని ‘ఈనాడు’ సంపాదించింది.
  3. ఇదేం వరస ABN , Publish Date - Jun 24 , 2025 | 01:03 AM హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65 విస్తరణను 6 వరసలకే కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో గందరగోళం Pause Mute Loaded: 38.69% Remaining Time -7:23 Close Player 8 లేన్లు అవసరం ఉండగా, 6 లేన్లకే కేంద్రం ఆమోదం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65 విస్తరణను 6 వరసలకే కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ విస్తరణకు డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న కన్సల్టెన్సీ సంస్థ 8 వరసలకు ప్రతిపాదించగా, 6 వరసలకే కేంద్రం అనుమతినివ్వడం గమనార్హం. హైదరాబాద్‌-విజయవాడ సెక్షన్‌లో ట్రాఫిక్‌ స్టడీ వివరాలను కూడా సదరు సంస్థ కేంద్రానికి తెలియజేసింది. నిబంధనల ప్రకారం.. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వరకు రోజుకు సగటున 55 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని పేర్కొంది. అలాగే, సూర్యాపేట నుంచి గొల్లపూడి వరకు సగటున రోజుకు 35 వేల వాహనాలు నడుస్తున్నాయని తెలిపింది. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌, ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు ఎన్‌హెచ్‌-65కు అనుసంధానమైతే ఆ ట్రాఫిక్‌ కూడా ఈ జాతీయ రహదారికే అనుసంధానమవుతుందని పేర్కొంది. అన్ని ప్రాంతాల ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 8 వరసలు తప్పనిసరి అని ప్రతిపాదించింది. తెలంగాణాలోని మందొళ్లగూడెం నుంచి నార్కట్‌పల్లి వరకు ఎన్‌హెచ్‌-65పై 47.50 కిలోమీటర్ల మేర సగటున రోజుకు 61 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపింది. అలాగే, నార్కట్‌పల్లి నుంచి సూర్యాపేట బైపాస్‌ వరకు 41 కిలోమీటర్ల మేర సగటున రోజుకు 51 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, సూర్యాపేట బైపాస్‌ నుంచి కోదాడ వరకు 51 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌-65పై రోజుకు 33 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, కోదాడ నుంచి నందిగామ వరకు 42 కిలోమీటర్ల మేర రోజుకు 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, నందిగామ నుంచి గొల్లపూడి వరకు 44.5 కిలోమీటర్ల మేర రోజుకు 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపింది. కేంద్రానికి నివేదించిన ట్రాఫిక్‌ గణాంకాల ప్రకారం 8 వరసలుగా విస్తరించాలని కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించింది. అయితే, కేంద్రం ఆరు వరసలకు ప్రతిపాదించటం తగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి? ఒక జాతీయ రహదారిపై ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తే, ఎన్ని లేన్లను అనుమతులు ఇవ్వాలన్న దానిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తు) కొన్ని నిబంధనలను నిర్దేశించింది. వీటి ప్రకారం 20 వేల నుంచి 30 వేల వాహనాలు రాకపోకలు సాగించే మార్గాన్ని 8 లేన్ల స్ట్రక్చర్‌తో 6 లేన్ల రహదారిని అభివృద్ధి చేయాలి. అలాగే, 30 వేల నుంచి 40 వేల వాహనాలు కనుక రాకపోకలు సాగిస్తే కచ్చితంగా 8 లేన్ల హైవేను అభివృద్ధి పరచాలి. 40 వేల వాహనాలు, ఆ పైన రాకపోకలు సాగిస్తూ.. ఆ హైవే ప్రస్తుతం 2 లేన్లుగా ఉంటే, 12 లేన్ల విస్తరణకు కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ 65.. 4 లేన్లుగా ఉంది కాబట్టి, 8 లేన్లకు తగ్గకుండా విస్తరించాలి. అలాగే, 40 వేల పైబడి వాహనాలు రాకపోకలు సాగిస్తూ, ఆ హైవే ప్రస్తుతం 4 లేన్లుగా ఉంటే, 8 లేన్లుగా విస్తరించాల్సి ఉంటుంది. మోర్తు నిబంధనల ప్రకారం హైదరాబాద్‌-విజయవాడ మార్గాన్ని 8 వరసలుగా విస్తరించటానికే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం 6 లేన్లుగా ప్రతిపాదించటం గమనార్హం.
  4. అమరావతిలో మరోసారి భూ సమీకరణ: మంత్రి పార్థసారథి అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం భూ సమీకరణ చేయాలని కేబినెట్‌ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు.
  5. vallu baga sound party anta ah village lo ekkdo business chesukuntaru anta, vallu cbn ki ammi vacchina dabbu tho amaravati lo vere chota land konnnkunnaru anta, rate matram evaru cheppatam ledu , appaudu intha rate ayithe undadu, cbn konnaka baga rate pencharu.
×
×
  • Create New...