Jump to content

తెరాసకు సీపీఐ మద్దతు ఉపసంహరణ


RamaSiddhu J

Recommended Posts

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో తెరాసకు సీపీఐ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. మగ్దూంభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో తెరాసకు మద్దతుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చాడ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘గత పది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం వైఖరి దుర్మారంగా ఉంది. సమ్మె కార్మికుల చట్టబద్ధమైన హక్కు. దాన్ని నిరాకరించడం కార్మికవర్గ వ్యతిరేక వైఖరి. చర్చలను నిరాకరిస్తూ దాదాపు 48వేల మంది కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ ప్రకటించడం ద్వారా కార్మికులను రెచ్చగొట్టింది. సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం యత్నించి విఫలమైంది. కొత్త నియామకాలను ప్రకటించి నిరుద్యోగ యువకులను ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చి ఘర్షణ వాతావరణం కలిగిస్తోంది. ఈ వైఖరి మార్చుకోమని సీపీఐ చేసిన విజ్ఞప్తిని తెరాస ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికులు ఆత్మాహుతి చేసుకుంటున్నారు. పరిష్కారం బదులు మరింత విద్వేష పూరితంగాప ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో కార్మిక, శ్రామిక వర్గ పార్టీగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో తెరాసకు ప్రకటించిన మద్దతును ఉపసంహరించుకుంటున్నాం’’ అని చాడ వెంకటరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...