Jump to content

వివేకా హత్య కేసు: ఆ ఇద్దరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!


Recommended Posts

వివేకా హత్య కేసు: ఆ ఇద్దరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
19-03-2019 09:52:22
 
636885860062078821.jpg
కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ అనుమానిస్తున్న ఆయన అనుచరులపై దృష్టిపెట్టింది. వివేకా అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గంగిరెడ్డితో పరమేశ్వర్‌రెడ్డి చేతులు కలిపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులోని ఓ భూవివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రూ.125 కోట్ల సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ డీల్‌లో రూ.1.5 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తోంది. గత నాలుగు రోజులుగా గంగిరెడ్డిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు 15 రోజుల ముందే రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
 
 
ఇదిలా ఉంటే వివేకా హత్యకు ముందు పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లుగా పోలీసులు గుర్తించారు. హత్యకు వారం ముందు కూడా ‘బీ కేర్‌ఫుల్‌’ అంటూ వివేకాకు అజ్ఞాతవ్యక్తి మెసేజ్‌ పంపారు. ఆ మెసేజ్ పంపింది ఎవరు? ఎందుకు పంపారు? అన్న విషయంపై కూడా సిట్ కూపీ లాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న పరమేశ్వర్‌రెడ్డిని రాత్రి తిరుపతి ఆస్పత్రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరమేశ్వర్‌రెడ్డి భార్య, కుమారుడు అడ్డుకునేందుకు యత్నించగా సిట్‌ అధికారులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వివేకా హత్య తర్వాత పరమేశ్వర్‌రెడ్డి పులివెందుల నుంచి అదృశ్యమయ్యారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...