srinivas_sntr Posted November 6, 2017 Share Posted November 6, 2017 దిల్లీ: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. మీరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకు ‘సూపర్ఫాస్ట్’ బాదుడు తప్పదు.. అదేంటీ అని ఆలోచిస్తున్నారా.. ఇటీవల కొన్ని రైళ్లను అప్గ్రేడ్ చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా అప్గ్రేడ్ చేస్తున్నామని.. ప్రయాణ వేగాన్ని కూడా పెంచుతున్నట్లు చెప్పింది. అయితే ఆ 48 రైళ్ల టికెట్ ధరలను పెంచింది రైల్వేశాఖ. రైళ్లను అప్గ్రేడ్ చేసినందుకుగానూ.. ఈ ధరలను పెంచినట్లు పేర్కొంది. ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్ట్గా అప్గ్రేడ్ చేయడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి అదనపు సౌకర్యాలు ఉండవు. అయితే 48రైళ్ల టికెట్ ధరలు మాత్రం పెరిగాయి. ఇకపై ఆయా రైళ్లలో ప్రయాణించేవారు స్లీపర్ కోచ్కు రూ.30, సెకండ్, థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లకు రూ.45, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్కు రూ.75 చొప్పున సూపర్ఫాస్ట్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల రూ.70కోట్ల అదనపు ఆదాయం లభించే అవకాశముందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. ఈ 48 రైళ్లను అప్గ్రేడ్ చేయడంతో దేశంలో మొత్తం సూపర్ఫాస్ట్ రైళ్ల సంఖ్య 1,072కు పెరిగింది. పుణె-అమరవాతి ఏసీ ఎక్స్ప్రెస్, పాటలిపుత్ర-చండీగఢ్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం-నాందేడ్ ఎక్స్ప్రెస్, దిల్లీ-పఠాన్కోట్ ఎక్స్ప్రెస్, టాటా-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ తదితర 48 రైళ్లను సూపర్ఫాస్ట్ రైళ్లుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
sagar_tdp Posted November 6, 2017 Share Posted November 6, 2017 Chance unna kada dochukontunnaru central vallu ela antha dhachi petti Congress ki gift kindha evvandi Link to comment Share on other sites More sharing options...
pavan s Posted November 6, 2017 Share Posted November 6, 2017 ee railway XXXXXXX north lo ticket less journeys ki yem peekaleru knai.. ikkada matram rates tega penchutaru.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.