Jump to content

వడోదరలో ఆరు క్రూడ్ బాంబులను నిర్వీర్యం చేసిన పోలీసులు


Sravanlokesh

Recommended Posts

వడోదర, సెప్టెంబర్ 24 : గుజరాత్‌లోని వడోదరలో ఆరు క్రూడ్ బాంబులను శుక్రవారం ఉదయం పోలీసులు కనుగొని, వాటిని నిర్వీర్యం చేశారు. ఒక్కొక్క బాంబు బరువు 1.1 కేజీలు ఉన్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థన పేర్కొన్నారు. యాకుత్‌పుర ప్రాంతంలోని మత సంబంధమైన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపారు. ఈ బాంబులు గనక పేలి ఉంటే 5 నుంచి 10 మీటర్ల పరిసర ప్రాంతాల్లో విధ్వంసం జరిగేదని ఆయనన్నారు.

 

దీంతో నగరమంతటా అప్రమత్తం చేసి, ఆయోధ్యలో గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయోధ్య విదాదంపై అహ్మదాబాద్ కోర్టు తీర్పు ఈరోజు వచ్చి ఇచ్చి ఉంటే విధ్వంసం జరిగేదని కమిషనర్ పేర్కొన్నారు. క్రూడ్ బాంబులకు సంబంధించిన గన్ పౌడర్, అమోనియం నైట్రైట్, గాజు ముక్కలు తదితర వాటిని పరీక్ష నిమిత్తం ఫారెన్సిక్ లాబ్‌కు పంపించినట్లు చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...