Jump to content

హాట్..హాట్‌గా ముగిసిన రాష్ట్ర కేబినేట్ సమావేశం


Sravanlokesh

Recommended Posts

హైదరాబాద్, సెప్టెంబర్ 20 : ముఖ్యమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం హాట్ హాట్‌గా ముగిసింది. మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డిల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో రోశయ్య జోక్యం చేసుకుంటూ ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఆ శాఖపైనే మాట్లాడాలని సూచించారు. అలాగే రోశయ్య ఐదు అంశాలపై ప్రధానంగా మాట్లాడారు.

 

ఎరువులు సకాలంలో రైతులకు అందేటట్లు చూడాలని, మున్సిపల్ ఎన్నికలు ప్రస్తుతం జరగకుండా స్పెషల్ ఆఫీసర్స్‌ను నియమించడం, అద్వాన్నంగా ఉన్న రోడ్ల మరమ్మత్తుపనులు, రాష్ట్రంలో విజృంభిస్తున్న విషజ్వరాలు, డెంగ్యూ వ్యాధుల నివారణకు చర్యలు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అందరూ కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

కాగా మంత్రులంతా ఎంపీలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర మంత్రులపై పెత్తనం చెలాయించడానికి వీరెవరంటూ.. ముఖ్యమంగా మదుయాష్కీ, మంద జగన్నాధంలను విమర్శించారు. వీరు కాంగ్రెస్ పార్టీకి చేసేది ఏమీలేకపోగా కేసీఆర్‌ను వెనకేసుకు వస్తున్నారని దుయ్యబట్టారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...