Jump to content

రాఖీ (2006 సినిమా)


Jag@NTR

Recommended Posts

రాఖీ (2006)

దర్శకత్వం కృష్ణవంశీ

నిర్మాణం డా,కె.ఎల్.నారాయణ

కథ రాధాకృష్ణ

చిత్రానువాదం కృష్ణవంశీ

తారాగణం ఎన్.టి.ఆర్,ఇలియానా, చార్మి‌, చంద్రమోహన్, బ్రహ్మాజీ, షాయాజీ షిండే, తనికెళ్ళభరణి, సుహాసిని, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,కృష్ణ భగవాన్

సంగీతం దేవీశ్రీప్రసాద్

నృత్యాలు రాజుసుందరం

గీతరచన సిరివెన్నెల, సుద్దాల అశొక్తేజ, చంద్రబోస్

ఛాయాగ్రహణం ఎస్.గోపాలరెడ్డి

కూర్పు శంకర్, నవీన్

నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్

విడుదల తేదీ 22-12- 2006

భాష తెలుగు

----------------------------------------------------------------------------------------

ఉపోద్గాతం

రాఖీ కధ అందరికీ తెలిసినదే అయినా కధనం విభిన్నంగా తెరకెక్కించారు దర్శకుడు కృష్ణవంశీ. తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయం మాత్రమే కాక మరేవిధమైనటువంటి అన్యాయమూ మరే ఆడపిల్లకూ జరగకూడదని రామకృష్ణ అనే యువకుడు సమాజం మీద జరిపిన పోరాటమే చిత్రకధ.

కధాగమనం

ఒక స్టేషన్ మాస్టారికి {చంద్రమోహన్} ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంటారు. పెద్దకొడుకు బ్రహ్మాజీ ఉద్యోగస్తుడు. చిన్నకొడుకు రామకృష్ణ {జూ ఎన్.టి.ఆర్}కు తన చెల్లెలు{మంజూష} అంటే ఎంతో ప్రేమ. రామకృష్ణను అందరూ రాఖీ అని పిలుస్తారు. రాఖీ మరియు ఒక టీ.వీ చానల్లో పని చేసే రిపోర్టర్ {ఇలియానా} ప్రేమించుకొంటారు. కూతురు పెళ్ళి కోసం చంద్రమోహన్ తన ప్రావిడెంట్ ఫండ్ ఫెన్షన్ డబ్బులను దాస్తాడు. చెల్లెలికి అమెరికా సంభందం వస్తే డబ్బును బ్రహ్మాజీ తన స్వార్ధానికి వాడేసుకొంటాడు. దాంతో చంద్రమోహన్ చెల్లె తను తనకూతురు పెళ్ళి కోసం దాచిన డబ్బు సర్ధుతాననీ అయితే తన కూతురు గౌరిని{చార్మి}రాఖీ పెళ్ళి చేసుకోవాలనీ చెపుతుంది. సరేనని ఒప్పుకొని చెల్లె పెళ్ళి జరుపుతాడు రాఖీ. తరువాత బావ విదేశ ప్రయాణం కోసం తన ఉద్యోగాన్ని ఐదు లక్షలకు అమ్మేసి ఆ డబ్బు తెచ్చి బావకిస్తాడు రాఖీ. తన కొడుక్కి కోటి రూపాయల కట్నం వస్తుందని తెలుసుకొని గాయత్రి అత్తింటివారు మూడునెలల గర్భవతి అయిన గాయత్రిని కిరోసిన్ పోసి దారుణంగా చంపేస్తారు. పోలీస్ స్టేషన్ వద్దా కోర్టులోనూ రామకృష్ణ కుటుంభానికి న్యాయం దొరకదు. గర్భవతి అయిన తన చెల్లెను డబ్బుపిచ్చితో కాల్చి చంపినా కోర్టులో కేసుకొట్టేయడం చూసిన రాఖీ తన చెల్లి అత్తింటి వారందరినీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు. తన చెల్లె కేసుకు వ్యతిరేకంగా వాదించిన ప్లీడరునూ, దొగ సాక్ష్యం ఇచ్చిన డాక్టరునూ, పోలీసాపీసరులనూ కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. అక్కడనుండి మాయమయిపోయిన రాఖీ ఎక్కడ ఏ ఆడపిల్లను ఎవరు వేదించినా, భాదించినా వాళ్ళని పెట్రోల్ పోసి తగులబెడుతుంటాడు. ఆక్రమంలో రాష్ట్రమంత్రి షాయాజీ షిండే కొడుకునుకూడా తగులబెట్టేస్తాడు. రాఖీని పట్టుకోడానికి స్పెషల్ ఆఫీసరుగా వస్తుంది మీనాక్షీ అయ్యర్{సుహాసిని}. ఈ హత్యలు అన్నిటినీ ఏ టెర్రరిస్టో చేస్తున్నాడని స్టేటుమెంట్ ఇవ్వడం చూసిన రాఖీ తనే ఈ హత్యన్నీ చేస్తున్నానని టీ.వీ లో చెప్తాడు. ఆమె చెప్పిన దానికి ఒప్పుకొని ఆమెకు లొంగిపోతాడు రాఖీ. కాని రాఖీని తనకప్పగించమని అధికారులందరి ముందు ఆమెనుకొడతాడు మంత్రి షిండే. మరొక వైపు ఆడవాళ్ళంతా రాఖీని విడుదల చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటారు. జైల్లో ఉన్న రాఖీని అందరితో మాట్లాడేందుకు బయటకు తీసుకొస్తారు. బావను కలుసుకోవాలని గాయత్రి కూడా వస్తుంది స్వీట్స్ తీసుకొని. ఆమె టిఫిన్ క్యారిరర్ లో బాంబ్ పెడతారు షిండే మనుషులు రాఖీని చంపేందుకు. బాంబ్ పేలినపుడు రాఖీకేమవదు కాని గాయత్రితో సహా అక్కడికొచ్చిన అనేకమంది విధ్యార్ధినులు మరణిస్తారు. దానితో సుహాసిని రాఖీని వదిలేస్తుంది షిండేను చంపేందుకు. తరువాత అతడే పెట్రోల్ పోసి అందరినీ చంపాడని నిరూపించలేని కారణంగా రాఖీని వదిలేస్తారు.

 

చిత్రవిశేషాలు

కమర్షియల్ సినిమాలుగా కేవలం ప్రేమకధలు, కుటుంబ కధలు నడుస్తున్న కాలంలో సందేశాత్మక,సమస్యాత్మక కధ కలిగిన ఇలాంటి సినిమా తీయడం కత్తిమీద సాములాంటిది. అయినా వెరువక భారీ బడ్జెట్ సినిమాగా మలచారు డా'కె.ఎల్.నారాయణ.

చెల్లె చనిపోయిన సందర్భంలో స్మశానంలో చిత్ర్రీకరించిన దృశ్యాలు దర్శకుడి ప్రతిభకు మరియు ఎన్.టీ.అర్ నటనకు అద్దం పడతాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...