Jump to content

రైలు కూతలు వినిపిస్తుందని వెర్రి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?


Cyclist

Recommended Posts

నీళ్ళ ప్రాజెక్టులు పేరు చెప్పి

ప్రజాధనాన్ని, పనిగా పాత్రల్లో పట్టి నింపు కొనడమే నేర్చి

కామెడీ లాలూ ను సైతం

కాస్త కూడా కనికరించేలా చేయలేక

విఫలమైన మన గత పాపపు పాలకులను,

ఎం పీ లను చేష్టలుడిగి చూసాం.

గతేడాది కూడా గతంలోలా నోరెళ్ళబెట్టి చూసుకోండని

మమతమ్మ కూడా మనకు మొండి చెయ్యి చూపుతూ

రైలు రయ్యిన దాటించింది.

ఈ ఏడాది ఇల్లు సక్కదిద్దుకోలేని పాలకుల ఆధ్వర్యాన

సెలైన్ దీక్షలతో పోటీ పడే కామెడీ ఎంపీలు

ఎం పి కి ఎక్కువ సి ఎం కు తక్కువైన ఎం పీ లు

సి ఎం చెయ్యలేదని ఉన్న సి ఎం గురించి

సొంత మీడియా లో చీప్ గా రాసే సిన్నోల్లు

బాకా కాకా, కుప్పి గంతుల హనుమన్న లాంటి వాళ్లకు

జడిసి, మమతమ్మ మనకు రైలు కూతలు వినిపిస్తుందని

వెర్రి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?

ఉంటే తుడుచుకొని

ఉదయాన్నే మీడియా లో

కారుకూతలు కూసే

నాయకులను నయనాందకరంగా చూస్తూ

ఆనందించడం నేర్చుకోండి

Link to comment
Share on other sites

తూరుగోదావరి జిల్లా ఐనవెల్లిలో కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైను సాధన ర్యాలీని ఎంపీ హర్షకుమార్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే బడ్జెట్‌లో ఈ రైల్వేలైన్‌కు నిధులు కేటాయించకుంటే రాజమండ్రి నుంచి వెళ్లే రైళ్లను నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...