Jump to content

అనుకూల పరిస్థితులు ఎలాంటివో రానున్న రోజుల్లో అందరూ చూస్తారని బాబు selavicchaaru


Cyclist

Recommended Posts

 

</h1>

<h1>నా మౌనాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారు: బాబు

తన మౌనాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 'రాష్ట్ర విభజన వ్యవహారంలో నేను ఏ పక్షం అంటే ఏమని మాట్లాడగలను. మా పార్టీ ఈ రాష్ట్రంలో పదిహేడేళ్లు అధికారంలో ఉంది. నేను తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నాను. రెండు ప్రాంతాల వాళ్లు ఓట్లు వేస్తేనే మేం అధికారంలో ఉండగలిగాం. రెండు ప్రాంతాల ప్రజలూ మా పార్టీని ఆదరిస్తున్నారు. నా ఇబ్బందిని ప్రజలు అర్థం చేసుకున్నారు' అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

 

ఎన్టీఆర్ ట్రస్టు అవార్డుల ప్రదానం తర్వాత ఆయన కొద్దిసేపు విలేఖరులతో ముచ్చటించారు. తమ పార్టీ వర్గాలతోపాటు వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారం ద్వారా తనపై ప్రజల మనోగతం అర్థమైందని ఆయన చెప్పారు.

 

రాష్ట్రంలో టీడీపీని లహీనపర్చడం కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యమై ఉండవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిణామాల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ప్రజామోదం ఉంటుందా అన్న ప్రశ్నకు తమకుండే అనుకూల పరిస్థితులు ఎలాంటివో రానున్న రోజుల్లో అందరూ చూస్తారని బాబు బదులిచ్చారు.

 

రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తప్పదని మీ పార్టీ నేతలే గట్టిగా చెబుతున్నారు కదా అన్న ప్రశ్నకు ఆయన నవ్వి ఊరుకొన్నారు. ప్రస్తుత పరిణామాల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందా అన్న ప్రశ్నకు అది ఐదేళ్ల కిందటే దెబ్బ తిందని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...