Jump to content

తెలంగాణ వచ్చినా సమస్యలు పోవు - goud


Cyclist

Recommended Posts

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఇప్పుడున్న సమస్యలు ఎక్కడికీ పోవని మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం జూబ్లీహాల్‌లో తెలంగాణా నిర్మాణం- సామాజిక, ఆర్ధిక, రాజకీయ సమానత్వం’ అన్న అంశంపై తెలంగాణా నిర్మాణ సారధ్య కమిటీ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో పాల్గొన్న దేవేందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ 53 ఏళ్ల తెలంగాణా ఉద్యమం ఇప్పుడే ఒక దశకు చేరుకుందన్నారు. చాలా మందికి ఉద్యమమంటే ఏమిటో తెలియదని అందుకే అడ్డంగా నరికేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.

 

ఉద్యమ ఫలితాలు, రాష్ట్రం వచ్చాక పరిణామాలు ఎలా ఉంటాయన్నది చర్చించేందుకు సదస్సు పెట్టిన వారిని ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరన్నారు. మేనేజ్‌మెంట్‌ తెలిసిన వారే రాజకీయాలలో బాగా రాణిస్తారన్నారు. తెలంగాణా రాష్ట్రంతోనే జీవితం, అదే లక్ష్యం అని సమస్యలేమీ ఉండవని అనుకోరాదన్నారు. తెలంగాణా సమాజంలో ప్రజాస్వామ్యం రావాలన్నారు. నిధులు, వనరులు పరిమితమని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వనరులు దోపిడీదారుల చేతుల్లోకి పోతే సమస్యలు మరింత జఠిలమవుతాయన్నారు. ప్రజారాజ్యం ఎమ్మెల్యే అనిల్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఏజెన్సీ ప్రాంతాలలో తాగు నీరు, విద్యా, వైద్యం వంటి మౌళిక సదుపాయాలు లేవన్నారు. తెలంగాణా కోసం జెండా పట్టిందెవరో తెలంగాణా జేఏసీ ఎవరి చేతుల్లో ఉందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జేఏసీ కో కన్వీనర్‌ శ్రీనివాసరావు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...