Kiriti Posted January 13, 2018 Share Posted January 13, 2018 ఓ కంపెనీకి 4.67కోట్ల ఐటీసీ రిటర్న్స్ చెల్లించడానికి రూ. 25 లక్షల లంచం వాణిజ్యశాఖ రాష్ట్ర కార్యాలయమే వేదిక డీల్ చేసుకొన్న అడిషనల్ కమిషనర్ వ్యవహారం నడిపిన కంపెనీ అడ్వైజర్ హైదరాబాద్నుంచి డబ్బుతో ప్రతినిధులు కార్యాలయంలో నగదు అందిస్తుండగా..నలుగురిని అరెస్టు చేసిన ఏసీబీ ఏసీబీ చరిత్రలోనే తొలిసారి 23.20 లక్షల లంచం స్వాధీనం చేసుకొన్న అధికారులు గోపాల్శర్మే కీలకం: ఠాకూర్ ‘‘తాము చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించి, తమకు రావాల్సిన ఐటీసీ రిటర్న్స్ కోసం ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ప్రతినిధులు, వాణిజ్యశాఖ అధికారులు డిమాండ్ చేసిన లంచం అందిస్తుండగా అరెస్టు చేశాం. ఈ వ్యవహారంలో ఈ కంపెనీ లీగల్ అడ్వయిజర్ గోపాల్ శర్మ కీలకంగా వ్యవహరించారు. ఆయన ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. వాణిజ్య అధికారి ఏడుకొండలుతో నేరుగా గోపాల్ శర్మే వ్యవహారం నడిపారు. ఈ సమాచారమంతా ముందే మాకు చేరిపోవడంతో, సకాలంలో రంగంలోకి దిగాం. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నవారిని పట్టుకున్నాం... అవినీతి ఏ రూపంలో ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తిలేదు’’ అని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ హెచ్చరించారు. ప్రజలను లంచాల కోసం పీడించే వారిని ట్రాప్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోన్న సొమ్మును మింగేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ‘‘అవినీతి విషయంలో మాకు ఎన్నో మార్గాల్లో సమాచారం వస్తుంది. అది ఇంటర్నర్ విజిల్ బ్లోయర్ సమాచారం కావొచ్చు, ప్రైవేటు వ్యక్తి కావచ్చు, లేక కంపెనీ ప్రతినిధి కావచ్చు. అక్కడ జరిగిందా లేదా అన్నదే ముఖ్యం’’ అని ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎవరికి వారు ఇలా దోచుకుంటే ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. http://www.andhrajyothy.com/artical?SID=519909 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.