Jump to content

I am afraid of it


eshwarR

Recommended Posts

ఈనాడు, హైదరాబాద్‌ : రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉన్న రూ.లక్షల కోట్ల విలువైన భూములను దోచుకోవడానికే రైతు సమన్వయ సమితి (ఆర్‌ఎస్‌ఎస్‌) అనే పేరుతో సీఎం కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరతీశారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలు బీఎన్‌ రెడ్డి, సతీష్‌ మాదిగ, రాజారాం యాదవ్‌లతో కలసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమితుల్లో సభ్యులుగా తెరాస వారినే నియమిస్తున్నారని, ప్రతీ గ్రామంలో వివాద రహిత భూముల వివరాలన్నీ వారికి అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజలను పీడించి దోచుకోవడానికే ఈ కొత్త వ్యవస్థను తెచ్చారని ఆరోపించారు. కొందరికి వందల ఎకరాలు బినామీ పేర్లతో ఉన్నాయని వాటికి యాజమాన్యపు హక్కులు ఎవరి పేరిట రాస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు నిర్వహించిన సమగ్ర సర్వే దరఖాస్తును ఆయన విలేకరులకు చూపుతూ ఇందులో ప్రతిఒక్కరి భూముల వివరాలు తీసుకున్నారని, అవి ఉండగా మళ్లీ రైతు సర్వే ఎందుకు చేశారని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో దేవాదాయశాఖ భూములను కబ్జా చేస్తే ఆయన కొడుకు.. లేని భూములకు రికార్డులు సృష్టించి బ్యాంకుల నుంచి రూ.64 కోట్ల రుణాలను తీసుకున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ సొమ్ము రాబట్టుకోవడానికి సీబీఐకి ఫిర్యాదు చేయాలని ఎస్‌బీఐ ప్రయత్నించినా కేసీఆర్‌ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తాను చెబుతున్న వివరాలు తప్పయితే తనపై కేసు నమోదు చేయాలని ఆయన సవాల్‌ చేశారు. జూపల్లి దీనికి అభ్యంతరం చెబితే.. ఆధారాలను బయటపెడతానన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...