raghup Posted January 13, 2015 Share Posted January 13, 2015 టాలీవుడ్లోకి బాలీవుడ్ కార్పోరేట్ సంస్థలు యుటీవీ, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఈరోస్ ఎంటర్ అయిన సంగతి తెల్సిందే. అయితే ఈ సంస్థల సహకారంతో టాలీవుడ్ నిర్మాతలు నిర్మించిన అత్తారింటికి దారేది, మనం వంటి కొన్ని సినిమాలు తప్ప ఖలేజా, 1 నేనొక్కడినే, ఆగడు, లింగ వంటి బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే ఎక్కువున్నాయి. అయినా లేటెస్ట్గా బాలీవుడ్ సంస్థ ఈరోస్ బాలకృష్ణ 99 వ సినిమాకు సహనిర్మాతగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. లౌక్యం ఫేం శ్రీవాస్ డైరెక్షన్లో కోన వెంకట్, గోపీ మోహన్ స్క్రిప్ట్తో తమన్ సంగీతంలో తెరకెక్కే ఈ భారీ సినిమాకు నిర్మాతగా ఆదిత్య 369 ఫేం కృష్ణప్రసాద్ ఉంటాడని తెలుస్తోంది. కృష్ణప్రసాద్కు ఆర్ధికంగా మరో నిర్మాతతో పార్టనర్షిప్లో చేయమన్న బాలకృష్ణ సలహాతో ఈరోస్ సంస్థ సౌత్ మేనేజ్మెంట్తో సంప్రదించిన ప్రసాద్ అందుకు గ్రీన్ సిగ్నల్ పొందినట్టుగా సమాచారం. Link to comment Share on other sites More sharing options...
Saadhu7 Posted January 13, 2015 Share Posted January 13, 2015 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.