Cyclist Posted December 6, 2013 Share Posted December 6, 2013 పాటను సవరించి గొంతు సవరిద్దాం http://chaakirevu.wordpress.com/2013/07/31/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B8%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%97%E0%B1%8A%E0%B0%82%E0%B0%A4%E0%B1%81-%E0%B0%B8%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF/ Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted December 6, 2013 Author Share Posted December 6, 2013 తాంబోలాలిచ్చేశాను ఇహ…… ఈ మాట గురజాడ వారు అగ్నిహోత్రావధానులు చేతనిపించి చిరస్థాయికి చేర్చేశారు. మొన్న రాత్రి నుంచి ఆరోగ్యం బాగోకపోతే పడుకున్నా, ఉదయం ఈ వేళ లేచేటప్పటికి మంత్రివర్గం రాష్ట్ర విభజనకి తీర్మానించిందని తెలిసి ఓపిక చేసుకున్నా.హార్తాళ్ళు, బంద్ లు, నిరశన వ్రతాలు, రాస్తారోకోలు, ఏవీ విభజను ఆపలేకపోయాయి. ఇంకా ప్రజలను పిచ్చి వాళ్ళను చెయ్యలనే రాజకీయ నాయకులు సంకల్పించినట్టు ఉంది, బిల్లు పాస్ అవదు, అసెంబ్లీ లో అడ్డుకుంటాము, వగైరా వగైరా చెప్పి.ఆ క్షణానికి వీరే ఓటూ వేయచ్చు, లేదా గైర్ హాజర్ కావచ్చు, ‘అవ్వ పేరే ముసలమ్మ’, వీరింతకు మించి గొప్పపని చేయగలుగుతారనుకోను, ‘నక్క ఒక చోట గౌరి కల్యాణం చేయద’ని నానుడి, వీరెప్పుడూ ఇంతే, ఇక ముందూ అంతే. విభజనకి దారి తీయడానికి నీవు కారకుడవంటే నీవని వాదులాడుకోవచ్చు ఇక ముందు కూడా. ‘ఎంచుకుంటే మంచమంతా కంతలే’నని నానుడి. ఈ పరిస్థితికి రాజకీయ నాయకులంతా బాధ్యులే. ‘తమలపాకుతో నీవొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా’ అని వీరూ వారూ రువ్వుకున్న మాటల ఈటెలకు సామాన్యులు కూడా విడిపోయే స్థితి తీసుకొచ్చారు. ఏ ఒక్కరికి సంయమనం లేకపోయింది. అందరూ అధికారం, డబ్బు సంపాదన గురించి ఆలోచించినవారే కాని ప్రజగురించి, అభివృద్ధి గురించి ఆలో చించిన నాయకుడే లేకపోయాడు. తమరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్థుల రక్షణ గురించి ఆలోచిఉంచారు తప్పించి రాష్ట్రం గురించి ఆలో చించలేకపోయారు. చిత్రం అప్పుడే ఒక ఛానల్ విడిపోయిన రాష్ట్రం లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో సర్వే చేసిందిట, ప్రసారం చేస్తోంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో. దొంగలు ఊళ్ళు ఏలతారని మార్కండేయుడు చెబుతాడు, తాను చూసిన పద్నాలుగు కలియుగాల్లోనూ, ఇప్పుడు అదే జరుగుతోంది. కాంగ్రెస్ వారి మహా నాటకం లో ఒక అంతత్భాగం పూర్తయి, మరొక దానికి తెర తీసింది.రాజీనామాలు మరో కొత్త నాటకమా? ఇంతకీ తెలంగాణాలో నెగ్గుతారు, ఎలాగా తప్పదు. విడిపోయిన రాష్ట్రం లో చిరంజీవి తన పార్టిని ఎన్నికల తరవాత కాంగ్రెస్ లో విలీనం చేసినట్టు, మరొకరు లేకపోతారా?తెనుగు ప్రజలకి ఇప్పటికైనా ఆలోచన వస్తుందా? మా అధికారానికి ఢోకా లేదు, ‘తాంబూలాలిచ్చేశా ఇహ తన్నుకు చావండి’,అన్నట్టులేదా?. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.