SneakFreak Posted July 15, 2013 Share Posted July 15, 2013 హైదరాబాద్ : తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్పై ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు. షాద్ నగర్లో బండ్ల గణేష్కు చెందిన పౌల్ట్రీ ఫాంలో 9 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసారు. ఆ పౌల్ట్రీలో పని చేసే 40 ఏళ్ల వ్యక్తి అదే పౌల్ట్రీలో పనిచేస్తున్న 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 9 ఏళ్ల బాలికను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం అయిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం - మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం తిమ్మాజిపల్లి తండా సమీపంలోని పరమేశ్వర పౌల్ట్లీలో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. వీరు మూడు రోజుల క్రితం పని మీద సొంత ఊరికి వెళ్లారు. వారి చిన్న కూతురు ఇక్కడే ఉంది. ఆ బాలిక ఈ నెల 9వ తేదీన పౌల్ట్లీలో గుడ్లు తీస్తుండగా అక్కడే పనిచేసే ఉద్యోగి శ్రీను ఆ బాలికను మరో షెడ్లో గుడ్లు తీయాలని తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.