Jump to content

బెయిలివ్వండి


Dictator

Recommended Posts

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జగన్ తరఫు న్యాయవాదులు సుప్రీంలో శుక్రవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శనివారం లేదా సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నాలుగు రోజుల క్రితమే ఐదో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో జగన్‌తో పాటు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని నాలుగో నిందితురాలిగా పేర్కొన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరు వాన్ పిక్ ఛార్జీషీటులో నిందితుడిగా పేర్కొన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే జైలులో ఉన్నారు. జగన్‌ను గతేడాది మే 27న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి జగన్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. గతేడాది జగన్ బెయిల్ కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు సుప్రీం కోర్టు 2013 మార్చి నెలాఖరు వరకు దర్యాఫ్తు పూర్తి చేసి తుది ఛార్జీషీటు దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఆ తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని జగన్‌కు సుప్రీం సూచించింది. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాఫ్తును పూర్తి చేయనందున తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు సుప్రీం కోర్టు తమకు ఎలాంటి డెడ్ లైన విధించలేదని సిబిఐ చెబుతోంది

Link to comment
Share on other sites

అజాత శత్రువు అందరి బంధువు మా బాలయ్య

కల్మషం లేని మనస్తత్వం, కరుణ కలిగిన హృదయం మా బాలయ్య కి ఆ పైనున్న రామయ్య ఇచ్చిన వారసత్వపు ఆస్తి

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...