Sravanlokesh Posted November 11, 2010 Share Posted November 11, 2010 ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతి విషయంలోనూ మౌనంగా ఉండటం ఈ దేశానికి శాపంగా మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా అక్కడ అవినీతి చోటు చేసుకోవడం సర్వసాధారణమై పోయిందన్నారు. ఆయన గురువారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఒకసారి చరిత్రను తిరగేస్తే ఏ పార్టీ చరిత్రలో లేని కుంభకోణాలు కాంగ్రెస్ చరిత్రలో ఉన్నాయన్నారు. ఈ అవినీతికి అడ్డుకట్ట వేయకుంటే ప్రపంచంలో భారత్ పరువు పోతుందన్నారు. 2జి స్పెక్ట్రమ్ లైసెన్స్ల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజా 1.75 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్టు కాగ్ తేల్చినా ఆయనను ఇంకా మంత్రిపదవిలో కొనసాగించడం సిగ్గుచేటన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రాజా విషయంలో ఆమె ఇప్పటికైనా కలుగజేసుకుని తక్షణం తొలగించాలని బాబు డిమాండ్ చేశారు. తనకు అనుకూలమైన వ్యక్తులకు అధికార పగ్గాలు అప్పగించే సోనియా.. రిమోట్ కంట్రోల్ తన చేతిలో పెట్టుకుని నేతలను ఆటాడిస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కూడా సోనియా చేతిలో రిమోట్గా మారారన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ మౌనం, అసమర్థత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తూ ఒక శాపంగా మారిందన్నారు. Link to comment Share on other sites More sharing options...
Disco King Posted November 12, 2010 Share Posted November 12, 2010 Link to comment Share on other sites More sharing options...
chukkapallis Posted November 12, 2010 Share Posted November 12, 2010 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.