Jump to content

ఎన్టీఆర్‌ వెన్నుపోటుకు వారసుల ప్రతీకారం...


sivakaza

Recommended Posts

గురువారం ఉదయం లక్ష్మీపార్వతి మీడియా సమావేశం ఏర్పాటుచేసి చంద్రబాబు చేసిన కుట్రలను వివరిస్తూ... ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుపై ఆయన వారసులు ప్రతీకారం తీర్చుకోవాలని, ఎన్టీఆర్‌ ఆశయాలను బతికించేందుకు టీడీపీని మీ చేతుల్లోకి తీసుకోవాలని లక్ష్మీపార్వతి కోరారు. 1944 ఎన్నికల ముందునుంచే చంద్రబాబు కుట్ర మొదలైందని, సమర్థులైన నేతలను పథకం ప్రకారం ఎన్టీఆర్‌కు దూరం చేసి పార్టీ నుంచి చంద్రబాబు సాగనంపాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు.

చంద్రబాబును ఎన్టీఆర్‌ కాదన్నా తానే ఇద్దరిని ఒక చోటుకు చేర్చా.. అదే నేను చేసిన పెద్ద తప్పు, చంద్రబాబే ఆయన పాలిట శాపంగా మారుతాడని ఊహించలేదని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంతో యనమల, జయప్రద, మరికొందరు అన్ని విధాలా చంద్రబాబుకు సహకరించారని, వారందరికీ చంద్రబాబు ఉన్నత పదవులు కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. నిండు సభలో ఎన్టీఆర్‌ తన వాదన వినిపించుకుంటానంటే మార్షల్స్‌తో బయటికి గెట్టించారు. ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ కుటుంబానికి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా.. చంద్రబాబు కుట్ర చేసి వారిని నాతో కలవకుండా చేశారని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...