Sravanlokesh Posted October 17, 2010 Share Posted October 17, 2010 సోనియాగాంధీ ర్యాలీ నిర్వహించాలంటే పదికోట్లు ఖర్చవుతుందా.. ? ఇందులో ఎవరి వాటా ఎంతుంటుంది.. ? ముఖ్యమంత్రి కనీసం రెండు కోట్లైనా ఖర్చుపెట్టాలా ? ఇవన్నీ మన గాంధీభవన్ లెక్కలు కావు. మహారాష్ట్ర కాంగ్రెస్కు ఎదురైన చిక్కులు. కెమెరాల ముందే జమాఖర్చులు చూసుకున్న మరాఠీ కాంగీయులు.. పబ్లిగ్గా దొరికిపోయి.. తర్వాత నాలిక్కర్చుకుంటున్నారు. ఇప్పుడక్కడ సోనియా పర్యటన కంటే.. ఇదే హాట్ టాపిక్. మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని సేవాగ్రంలో ఇవాళ ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ పర్యటించాల్సి వుంది. పార్టీ తరఫున ఓ భారీ ర్యాలీ కూడా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ముంబైలో నిన్న ఏర్పాటైన మీడియా సమావేశం ఇది. చెప్పాల్సిందంతా చెప్పేశాక.. మహారారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మానిక్రావ్ థాకరే, మరో నేత సతీశ్ చతుర్వేది పిచ్చాపాటీలో మునిగిపోయారు. కెమెరాలు ఆన్లో వున్నాయన్న విషయం మర్చిపోయి.. పార్టీ అంతర్గత రహస్యాలను బైట పెట్టుకున్నారు. జనసమీకరణతో మొదలెట్టి.. ధన సేకరణ వరకూ యధేచ్ఛగా సాగింది వారి చర్చ. ఎవరినుంచో పదిలక్షలు దండుకుని.. జెండాల తయారీకి ఖర్చుపెట్టామని చతుర్వేది అంటే.. సీఎం డిపాజిట్ చేసిన రెండుకోట్ల సంగతేమైందని థాకరే అడుగుతున్నారు. ఆ సొమ్ముతో ర్యాలీ కోసం రెండువేల బస్సులు బుక్ చేశామని చతుర్వేది చెబుతున్నారు. ఏ పార్టీలోనైనా మామూలుగా జరిగే ఈ అంతరంగ మంతనాలు.. బహిరంగంగా టీవీల్లో కనిపించీ వినిపించేసరికి జనం కాసింత కొత్తగా ఫీలయ్యారు. సోనియా టూరంటే మాటలా మరి.. అనుకున్నారు. ఎపిసోడంతా వీళ్లిద్దరి అమాయకత్వం వల్లేనని సరిపెట్టుకున్నప్పటికీ.. తన పేరు బైటికి రావడాన్ని సీఎం అశోక్ చవాన్ సీరియస్గా తీసుకున్నారు. ఏమిటిదంతా అని హైకమాండ్ను కదిలిస్తే.. పూర్తి వివరాలు తెలుసుకుని స్పందిస్తానంటున్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ. ప్రస్తుతానికైతే.. మేడమ్ పర్యటనపైనే దృష్టి పెట్టి.. మిగతాదంతా లైట్ తీస్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారాయన. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.