ఐపీఎల్: ఒక ఓవర్లో ఏడు బంతులు
హైదరాబాద్: ఐపీఎల్లో ఫీల్డ్ అంపైర్ల తప్పిదం మరోసారి బయటపడింది. టోర్నీలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఓవర్లో అంపైర్ ఆరుకి బదులు ఏడు బంతులు వేయించాడు. ఇప్పుడు దీని గురించి అభిమానుల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది.
అసలేం జరిగిందంటే.. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు చేసింది. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్కు దిగింది. ఆది నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడటంతో సన్రైజర్స్ 10 ఓవర్లకే 96 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్లింది. 12వ ఓవర్ వేసేందుకు లాలిన్ బంతిని అందుకున్నాడు. ఈ ఓవర్లో అంపైర్ బౌలర్ చేత ఏకంగా ఏడు బంతులు వేయించాడు. ఏడో బంతికి ధావన్ ఒక పరుగు తీశాడు. ఐపీఎల్లో ప్రతి బంతి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఒక బంతితో విజయాలు తారుమారైన మ్యాచ్లు ఎన్నో చూశాం.
ఈ మ్యాచ్లో 12వ ఓవర్కి దాదాపుగా సన్రైజర్స్ విజయం ఖరారు అయ్యింది కాబట్టి సరిపోయింది. అదే చివరి ఓవర్లో తేలే ఫలితంలో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకుంటే భారీ మూల్యామే చెల్లించుకోవల్సి ఉండేది అంటున్నారు అభిమానులు.