SREE_123 Posted July 23, 2020 Share Posted July 23, 2020 అవి ప్రజలవి.. ప్రభుత్వానివి కావు! రెండింటి మధ్య తేడా తెలుసుకోండి ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా! సర్కారును నిలదీసిన హైకోర్టు విక్రయం కొత్త కాదు.. సర్కారు కౌంటర్ విధాన నిర్ణయాల్లో జోక్యంపై నిగ్రహం పాటించాలని వినతి అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరికీ చెందిన ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని రాష్ట్ర సర్కారును హైకోర్టు నిలదీసింది. ‘పబ్లిక్ ల్యాండ్స్’ (ప్రజా భూములు)కు, ప్రభుత్వ భూములకు మధ్య తేడా తెలుసుకోవాలని సూచించింది. ‘‘అయినా, ఆ భూముల్ని విక్రయించాల్సిన అవసరమేంటి? అమ్మితే తప్ప ప్రభుత్వం నడవలేని పరిస్థితి ఉందా? ప్రభుత్వమేమైనా దివాలా తీసిందా?’’ అని ప్రశ్నించింది. ‘మిషన్ బిల్డ్ ఏపీ’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు, విశాఖ తదితర జిల్లాల్లోని భూముల్ని ఈ-వేలం ద్వారా విక్రయించడానికి చేపట్టిన చర్యలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్లతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజా భూములు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించే బాధ్యత ప్రభుత్వానిది. కానీ... ప్రభుత్వమే వాటిని ఇష్టానుసారంగా విక్రయిస్తామంటే ఎలా? ప్రజా భూముల్ని ప్రభుత్వం ఎలా విక్రయిస్తుంది?’’ అని ధర్మాసనం నిలదీసింది. ఆ భూముల్ని అమ్మే హక్కు మీకెక్కడిదని సూటిగా ప్రశ్నించింది. ‘‘ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ... ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది’’ అని ధర్మాసనం పేర్కొంది. అవి ప్రభుత్వ భూములు కాదని, ప్రజా భూములు మాత్రమేనని తేల్చిచెప్పింది. ‘నవ రత్నాలు’ కింద ఇళ్లస్థలాల పంపిణీ కోసం రూ.కోట్ల వ్యయంతో భూముల్ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు ప్రజా ఆస్తులను విక్రయిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన డీఎ్సఎన్వీ ప్రసాద్ బాబు వాదించారు. ప్రభుత్వ న్యాయవాది గడువు కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వం ఆస్తుల వేలం వేయడం గతంలోనూ అనేక రాష్ట్రాల్లో జరిగిందని ‘మిషన్ బిల్డ్ ఏపీ’ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ హైకోర్టుకు వివరించారు. కేంద్రప్రభుత్వం కూడా వృథాగా ఉన్న ఆస్తులను అమ్మజూపుతోందన్నారు. ‘‘ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే విషయంలో న్యాయస్థానాలు నిగ్రహం పాటించాలి. ఆస్తుల వేలంపై ఎలాంటి నిషేధాలు లేవు. దాని ద్వారా వచ్చే నిధులను ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తాం’’ అని తెలిపారు. గుంటూరులో ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని పీవీకే నాయుడు అనే వ్యక్తి విరాళం ఇచ్చారనే దానికి రికార్డులు లేవన్నారు. అమరావతిలో అసెండస్ సింగ్బ్రిడ్జ్ కార్పొరేషన్కు కేటాయించిన 1600 ఎకరాలను కూడా విక్రయించాలని నిర్ణయించామన్నారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.