KING007 Posted February 15, 2018 Share Posted February 15, 2018 నీరవ్ మోదీ ఎక్కడ..? దిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో రూ. 11,400కోట్ల కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మరో ఆభరణాల కంపెనీ మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు తేలడంతో బ్యాంకు వర్గాలు ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నీవర్మోదీపై కేసు నమోదు చేశారు. నీరవ్కు చెందిన 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ముంబయిలోని కాలా ఘోడా ప్రాంతంలో నీరవ్కు చెందిన షోరూంలో తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ కుంభకోణం తర్వాత నుంచి నీరవ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా.. నీరవ్ ఇప్పటికే భారత్ వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం లేదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్ను్ల్లో ఒకడైన నీరవ్..రూ. 280కోట్ల మేర పీఎన్బీ బ్యాంక్ను మోసగించి.. తప్పుడు సంతకాలు చేశారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నీరవ్తో పాటు ఆయన భార్య, సోదరుడు, గీతాంజలి ఆభరణాల దుకాణాలు నడిపే నీరవ్ మామ, ఇద్దరు పీఎన్బీ బ్యాంక్ ఉద్యోగులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. తాజాగా పీఎన్బీ కుంభకోణం వెలుగుచూడటంతో ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైంది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.