Ramesh39 Posted February 8, 2018 Share Posted February 8, 2018 మనది ధర్మ పోరాటం: ఎంపీలతో చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ధర్మపోరాటమనే విషయాన్ని కేంద్రానికి తెలిసేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పెట్టారని ప్రధాని మోదీ చెప్పినందున... దాని కోసమే మన పోరాటమన్న స్పష్టతతో ముందుకు సాగాలని సూచించారు. దుబాయ్లో దిగిన వెంటనే ఆయన ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటులో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేనితనంగా ఉన్నప్పుడు పోరాడాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రసంగంలో రాష్ట్రానికి ఉపయోగపడిదేం లేదని అభిప్రాయపడ్డారు. విభజనకు లేని ఫార్మూలా.. లోటు బడ్జెట్ భర్తీకి కావాలా..? అని ప్రశ్నించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీలకు వివరించాలని ఎంపీలకు సూచించారు. ఏపీకి ఏ విధంగా అన్యాయం జరిగిందో ఎంపీలందరికీ బుక్లెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. మన ఆందోళనల్లో న్యాయం ఉందనే విషయం అన్ని పార్టీలకు అర్ధమవ్వాలన్న చంద్రబాబు... పార్లమెంట్లో మన పోరాట పంథా కొనసాగాల్సిందేనన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఖచ్చితంగా 2-3గంటలు చర్చ జరగాలని... చేసే న్యాయంపై నిర్ణయం ప్రకటించే వరకూ పోరాటం ఆపవద్దని తెలిపారు. రేపు మధ్యాహ్నంతో సభ అయిపోతే పోరాటం ముగిసిపోయిందని భావించవద్దని... మార్చి 5నుంచి తిరిగి పార్లమెంట్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అప్పుడు కూడా సభ ప్రారంభం నుంచే ఉభయసభల్లో చర్చకు పట్టుబట్టాలని పిలుపునిచ్చారు. ఈ లోగా కేంద్ర పెద్దలను కలుస్తూ న్యాయం చేయాలని కోరాలని ఎంపీలకు సీఎం సూచించారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.