యువగళం పాదయాత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో నారా లోకేశ్ మలివిడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 11నుంచి శంఖారావం పేరిట నారా లోకేష్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచే లోకేశ్ శంఖారావం యాత్ర ప్రారంభంకానుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈనెల 11వ తేదీన ఉదయం 9గంటలకు శంఖారావం తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రతిరోజూ 3నియోజకవర్గాల చొప్పున దాదాపు 50రోజులు లోకేశ్ పర్యటించనున్నారు. జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా శంఖారావం పర్యటన సాగనుందని తెలుగుదేశం నేతలు తెలిపారు.