Cyclist Posted September 24, 2020 Share Posted September 24, 2020 ఆంధ్రా కమలానికి, మీకు చిలక్కు చెప్పినట్లు చెప్పి వెళ్లారు రాం మాధవ్ గారు. సమస్యల మీద పోరాడండి అని. మోడీ గారిని నానీ అన్నాడని మీరు నానీ కోసం పోరాటం మొదలెట్టే స్థాయికి పతనం అయ్యారు. నిన్న అన్ని పార్టీలు ప్రజలు & పండగ చేశారు నానీ మాటలతో. ఒక్క అమరావతి విషయానికి వస్తే… మూడు రాజధానులు అనంగానే.. మోడీ బొమ్మలు పెట్టుకొని పోరాటం చేశారు ఆ అన్నదాతలు. కొన్ని రోజులకు ముందు మోడీ పుట్టిన రోజున కూడా ఆయన మాస్కులు వేసుకొన్నారు అమరావతిలో అన్నదాతలు. జనం అలా ఎదురు చూస్తుంటే… వైకాపా తోకలా జివిఎల్.. మూడు రాజధానులకు అనుకూలం లెక్కన గ్రామర్ ట్యూషన్లతో కోర్టులలో అఫిడవిట్లు ఇస్తూ మీ కేంద్ర పార్టీ.. మరింత వేడుక చూస్తోంది. జనం ఎందుకు పండగ చేస్తున్నారో.. అర్థం చేసుకోండి. పోరాటం ఎక్కడ చెయ్యాలో అనే ఆరాటం అదే వస్తుంది. ఛలో అంతర్వేధి అని మీరు పోరాటం చేస్తే, చెట్టు క్రింద కుర్చీ వేసుకొని, కమండలానికి తక్కవైన రాగి చెంబు ప్రక్కన బెట్టుకొని, మోడీకి మించి బండెడు పుస్తకాలు వేసుకొన్న, మీ మెడలో ఢోలు పార్టీ జన సేన అధ్యక్షుడి ఫోటోలు వైరల్ అయ్యాయి. మీ యాషాలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. ఇప్పుడు మోడీని అన్నారని ఆవేశ పడుతున్నారు. నిన్న మధ్యాహం మీ మోడీ గారు జగన్ ని ప్రశంసించారు, సాయంత్రం యడ్యూరప్ప వచ్చి జగన్ ని కలిశారు. తిరుమల కొండమీద మంతనాలు, సుందరకాండ పారాయణం వరకు అన్నీ జరిగాయి. మీరేమో ఇక్కడ రాష్ట్ర స్థాయి రాద్దాంతం అంటే నోటాకి మించిన రాజకీయ అమాయకత్వం నుండి ఎదగడం లేదని జనం నవ్వుతున్నారు. #చాకిరేవు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.