Saichandra Posted October 21, 2018 Share Posted October 21, 2018 నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవితపై టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్. రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. కవిత మాదిరిగా తనకు బినామీలు లేరని, అవినీతి చేసి కోట్లకు కోట్లు సంపాదించలేదని స్పష్టం చేశారు. సారా అమ్మినా, వ్యాపారాలు చేసినా తాను నిజాయితీగా చేశానన్నారు. తన నిజాయితీ గురించి కవితకు తెలియాలంటే కేసీఆర్ను అడిగి తెలుసుకోమని సలహా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలకు దిగినా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్పై స్పందిస్తూ.. ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా బెదిరేది లేదని, తన ఫోన్ను ట్యాపింగ్ చేసినా భయపడనని తెలియజేశారు. Link to comment Share on other sites More sharing options...
baggie Posted October 21, 2018 Share Posted October 21, 2018 ? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.