Jump to content

నాకు కావాల్సింది పోలవరం!ప్రతీ ప్రాజెక్టూ పరీక్షలా మారింది.ఒక్కరి వల్లే అవి ఆగిపోతున్నాయి


Kiriti

Recommended Posts

  • కాంట్రాక్టర్‌, డిజైన్‌ ఏదన్నది కాదు
  • రేపో, ఎల్లుండో గడ్కరీతో మాట్లాడతా
  • ప్రతీ ప్రాజెక్టూ పరీక్షలా మారింది
  • ఒక్కరి వల్లే అవి ఆగిపోతున్నాయి
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశం
అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ‘‘నాకు కావాల్సింది పోలవరం ప్రాజెక్టు పూర్తికావడమే. కాంట్రాక్టరు ఎవరు? టెక్నికల్‌గా ఏంటి? అప్పర్‌ కాఫర్‌ డ్యాం ఉంటుందా? లేదా? ఇవన్నీ అనవసరం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రానికి చాలా ప్రాజెక్టులు ఉండొచ్చని... రాష్ట్రానికి జీవనాడి ఒక్క పోలవరం ప్రాజెక్టేనని చెప్పారు. దీనిపై రేపో, ఎల్లుండో కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడతానని చెప్పారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... పోలవరంలో అప్పర్‌ కాఫర్‌ డ్యాం వద్దని కేంద్ర నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందట కదా? అని ప్రశ్నించగా... ‘‘అప్పర్‌ కాఫర్‌ డ్యాం సగం కడితే సరిపోతుందని, లోయర్‌ కాఫర్‌ డ్యాం పూర్తిచేసి ప్రధాన డ్యామ్‌కు వెళ్తే చాలని... రెండు, మూడు ఆప్షన్లు సూచిస్తున్నారు. కాఫర్‌డ్యాం లేకుంటే నీళ్లను తోడేందుకు చాలా ఖర్చు అవుతుంది. టెక్నికల్‌ డిజైన్లు ఎలా ఉండాలన్నది కేంద్రం ఇష్టం. మాకు ప్రాజెక్టు పూర్తి కావడమే ముఖ్యం’’ అని చంద్రబాబు వివరించారు. గడ్కరీ కొత్తగా ఈ శాఖ బాధ్యతలు చేపట్టారని... ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పని పరిస్థితిని ఆయనకూడా బాగానే అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పూర్తి విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాజెక్టుకోసం 99.9శాతం మంది కలిసొస్తే ఒక్కరు వివాదాస్పదం చేస్తున్నారని, దీంతో మొత్తం ప్రాజెక్టు ఆగిపోతోందని ఆక్రోశించారు. ప్రతి ప్రాజెక్టు తమకు అగ్నిపరీక్షలాగే తయారైందన్నారు. ఇవన్నీ రాజకీయ కేసులేనా? అని ప్రశ్నించగా... ‘‘ఎక్కువ రాజకీయ కేసులే. కొందరు అత్యాశకు వెళ్లి కూడా కేసులు వేస్తారు. సమాజంలో అంతా బాగుంటే ఓర్వలేనివారు, అత్యాశపరులు కొందరుంటారు. కొత్త సంవత్సరంలోనైనా అందరికోసం కలిసి రావాలి’’ అని హితవు పలికారు.
 
ఒత్తిడితో పని చేయించలేం
అధికారులపై ఒత్తిడి చేసి పనిచేయించలేమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘అధికారులు హైదరాబాద్‌ నుంచి రావడం లేదని అంటున్నారు. అక్కడ మంచి సౌకర్యాలు, కుటుంబ అవసరాలు ఉండడంతో కొంతమంది రావడం లేదు. డిసెంబరు 31వ తేదీ రాత్రి భవానీ ఐల్యాండ్‌, ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర డిన్నర్‌ చేశాం. అంతకంటే బెస్ట్‌ ప్లేస్‌ ఎక్కడుంది?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు పెరిగితే అంతా అమరావతికి వస్తారని... ఆ రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...