నాగాయలంకలో చమురు వెలికితీతకు కేంద్రం అనుమతి ఓఎన్‌జీసీ ఈడీ వెల్లడి బంటుమిల్లి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా నాగాయలంకలోని ఓఎన్‌జీసీ బావుల నుంచి పెట్రో ఉత్పత్తుల వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు (ఈడీ) దిబాసిస్‌ సన్యాల్‌ వెల్లడించారు. ఆగస్టు నుంచి చమురు వెలికితీత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలోని బంటుమిల్లి మండలం చినపాండ్రక గ్రామాన్ని ఓఎన్‌జీసీ దత్తత తీసుకుంది. ఈ గ్రామంలో బుధవారం 370 కుటుంబాలకు వంటగ్యాస్‌ సిలెండర్లను సన్యాల్‌ పంపిణీ చేసి పొగ రహిత గ