రాజధాని అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ నిర్మాణ పనులకు అవసరమైన కంకరను ఎల్‌ అండ్‌ టీ సంస్థ కృష్ణా నదిలో భారీ పంటుపై ఇలా టిప్పర్ల  ద్వారా తరలిస్తోంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఫెర్రీ ఘాట్‌ నుంచి బయలుదేరే ఈ పంటు రాజధాని ప్రాంత సమీపంలోని ఉండవల్లికి  చేరుకుంటుంది. అనంతరం వాహనాలు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటాయి. సాధారణంగా ఈ వాహనాలు పూర్తిగా రహదారిపై ప్రయాణించి ఇక్కడికి చేరుకోవాలంటే.. విజయవాడ నగరం మీదుగా కృష్ణా నది చుట్టూ సుమారు 60 కి.మీ.ల దూరం తి