భూసేకరణ చట్టాన్ని ఆమోదించండి’ 12-04-2018 18:46:19
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టాన్ని త్వరగా ఆమోదించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ అధికారులు.. 15 రోజుల్లోగా దీన్ని తేలుస్తామని చెప్పారు. గురువారం ఏపీ భూసేకరణ చట్టంపై కేంద్ర హోంశాఖ అధికారులతో ఏపీ రెవెన్యూ ల్యాండ్ రికార్డ్స్ ఓఎస్డీ శ్రీరామ్ ప్రసాద్ సమావేశమయ్యారు. ఈ భేటీలో హోం శాఖ అదనపు కార్యదర్శి సత్యపాల్ చౌహాన్ పాల్గొన్నారు.