రామాయపట్నమే  ప్రత్యామ్నాయం  ప్రకాశం జిల్లాకు వరమే  లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి  ఈనాడు - అమరావతి  నెల్లూరు జిల్లా దుగరాజపట్నం నౌకాశ్రయానికి ప్రత్యామ్నాయంగా మరోటి సూచించాలని కేంద్రం కోరిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా రామాయపట్నం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతం పూర్తి అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలోచించి నివేదికలను తయారు చేయించింది. యూపీఏ హయాంలో దేశంలో రెండు భారీ నౌకాశ్రయాల నిర్మాణానికి సంకల్పించారు. పశ్చిమబెంగాల్‌కు ఒకటి కేటాయించగా ఆంధ్రప్రదేశ్‌లో మరోటి