ఏపీ సచివాలయం.. సీఎం చంద్రబాబు పనిలో తలమునకలై ఉన్నారు. ఇంతలో ఓ చిన్నారి ఆయన దగ్గరకు వచ్చాడు. నా ప్రాణాలు మీరే కాపాడారు సార్‌ అంటూ కృతజ్ఞతాపూర్వక స్వరంతో చెప్పాడు. ఆ మాట విని చలించిపోయిన చంద్రబాబు ఆ బాలుడిని అక్కున చేర్చుకున్నారు. ఆత్మీయంగా పలకరించి, ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యశ్వంత్ కు ఇటీవలే గుండెమార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా చిన్నారికి జరిగిన గుండె మార్పిడి శస్త్రచికిత్సకు చంద్రబాబు.. ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద ర