న్యూఢిల్లీ: సుబ్రహ్మణ్యస్వామి.. ఈపేరు చెబితేనే రాజకీయనాయకుల గుండెల్లో గుబులు పుడుతుంది. అనేక కుంభకోణాలను బయటపెట్టి జాతీయ నాయకులకే ముచ్చెమటలు పట్టించిన సుబ్రహ్మణ్యస్వామి తాజాగా తిరుమల వెంకన్నపై కన్నేశారు. టీటీడీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెత్తనమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆలయాలను ఏ ప్రభుత్వం కూడా మూడేళ్లకు మించి తమ ఆధీనంలో ఉంచుకోకూడదని స్వామి తెలియచెప్పారు. దేశంలోని ఆలయాలకు ప్రభుత్వాల గుత్తాధిపత్యం నుంచి విముక్తి కల్పించాలని స్వామి అభిప్రాయపడ్డారు. ఆలయాల నిర్వహణకు ధార్మిక సంస్థలు ముందుకు రావాలని స్వా