Raaz@NBK Posted January 4, 2022 Share Posted January 4, 2022 జగన్ ప్రతిపక్షంలో ఉండగా మరియు సీఎం అయిన తర్వాత చేసిన కొన్ని ఫేక్ ఆరోపణలు ఆధారాలతో సహా మీ ముందు .. 1) చంద్రబాబు ప్రభుత్వం డేటా చోరీ చేసి ఓటు తొలగిస్తుందని ప్రచారం చేశారు 2) కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు ఎటువంటి డేటా చోరీ జరగలేదని కేంద్రం తేల్చి చెప్పింది 3) తిరుమలలో పింక్ డైమండ్ పోయిందని అది చంద్రబాబు ఇంట్లో ఉందని రమణ దీక్షితులు విజయసాయి రెడ్డి ఆరోపించాడు దానికి పవన్ కూడా వంత పాడాడు 4) YCP అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ లేదని టీటీడీ ఈవో ప్రకటించాడు హైకోర్టు కూడా పింక్ డైమండ్ పై విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది 5) 37 మందిలో 35 మంది కమ్మ వారికి సీఐ నుంచి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చాడు అని నాడు జగన్ రెడ్డి విష ప్రచారం చేశాడు 6) కానీ అది పచ్చి అబద్ధం అందులో కమ్మ వారు - 2 బీసీలు - 9, రెడ్డిలు - 7, దళితులు - 7 కాపులు - 4 ముస్లింలు - 2 మిగిలిన వారు ఇతర కులాల వారు 7) పోలవరంలో భారీ అవినీతి జరిగిందని అది చంద్రబాబు దోచుకున్నాడు అన్నారు 😎 కొంతమంది మేధావి ముసుగులో ఉన్న వారితో కూడా ఇదే ప్రచారం చేయించాడు 9) పెంటపాటి పుల్లారావు రాసిన లేఖకు పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని విచారణ అవసరం లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు 10) ప్రతిపక్షంలో పోలవరానికి పునాదులు పడలేదు అన్నారు తరువాత 20% పనులు కూడా జరగలేదని విమర్శించారు 11) కానీ పోలవరంలో 71% పనులు జరిగాయని జగన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశాడు 12) కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి 70% పనులు పూర్తి అయినట్టు సమాధానం ఇచ్చారు 13) చంద్రబాబు 30 వేల కోట్లు అంచనాలు పెంచింది దోచుకోవడానికే అని జగన్ రెడ్డి విమర్శించాడు 14) దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడమే కాకుండా సాక్షి పత్రికల్లో విషపు రాతలు రాశాడు 15) కానీ జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు ప్రతిపాదించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరాడు 17) రివర్స్ టెండర్ ద్వారా తక్కువ ధరకే పోలవరం పనులు ఇచ్చామని దీనివల్ల 780 కోట్లు మిగులు వచ్చిందని ప్రచారం చేశారు 18) కానీ గతం కంటే ప్రధాన డ్యామ్ 1,656 కోట్లు కుడి కాలువ ఎత్తిపోతలకు 912 కోట్లు ఇసుకకు 500 కోట్లు అంచనాలు పెంచారు ఒక్క రోజులో హెడ్ వర్క్ 2569 కోట్లు పెరిగింది 19) మొదట 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తానని జగన్ రెడ్డి చెప్పారు 20) మాట తప్పి 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి అనిల్ చెప్పాడు 21) జగన్ రెడ్డి పై జరిగిన కోడి కత్తి దాడిలో చంద్రబాబు డీజీపీ పాత్ర ఉందని సొంత మీడియాలో విష ప్రచారం చేశాడు 22) జగన్ కి వైద్యం చేసిన డాక్టర్ వైద్య మండలి చైర్మన్ అయ్యాడు 2019 ఎన్నిక ఫలితాల రోజు శీనుకి బెయిల్ వచ్చింది 23) జగన్ సీఎం 3 ఏళ్ళు అవుతున్నా నేటికి ఆ కేసు ఊసేలేదు 24) పోలవరానికి కేంద్రం సాయం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా అని ప్రతిపక్షంలో ప్రశ్నించిన జగన్ రెడ్డి 25) సీఎం అయిన తరువాత సవరించిన అంచనాలు అలాగే గత బకాయిలను చెల్లించాలని కేంద్రాన్ని అడగనే లేదు అనే పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పారు 26) పట్టిసీమ ప్రాజెక్టులో 400 కోట్ల అవినీతి జరిగిందని నాడు జగన్ రెడ్డి విమర్శించాడు 27) కానీ పట్టిసీమ ప్రాజెక్టులో 400 కోట్ల అవినీతి కేవలం ఆరోపణలు అని దానికి ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది 28) చంద్రబాబు 30కి పైగా స్టేలు తెచ్చుకుని బయట తిరుగుతున్నాడు అని అవి తేలితే జైలుకు వెళతాడని విమర్శించారు 29) కానీ చంద్రబాబు పై ఈరోజు ఒక్క స్టే కూడా లేదు కేవలం బాబ్లీ ప్రాజెక్టు సంబంధించిన కేసు మాత్రం నడుస్తుంది 30) కియా ప్రాజెక్టు ఉత్తి బోగస్ అని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదని అక్కడ యువత ఉద్యమం చేస్తున్నారని ధర్నాకు దిగాడు 31) సీఎం అయిన తర్వాత అదే కియా ప్రాజెక్టును మరొకసారి ఓపెన్ చేసి కియా వల్ల యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అన్నాడు 32) ESI కొనుగోళ్లలో 151 కోట్ల కుంభకోణం జరిగిందని దానికి నాడు మంత్రిగా ఉన్న అచ్చం నాయుడు కారణమంటూ కక్షగట్టి అరెస్టు చేశారు 33) కానీ అచ్చం నాయుడుకి ఈ స్కామ్ కి సంబంధం లేదని దానికి ఆధారాలు లేవని కేవలం ఒప్పందానికి అనుమతి ఇచ్చారని ఏసీబీ తేల్చి చెప్పింది 34) ఏపీ ఫైబర్ నెట్లో 1500 కోట్ల స్కామ్ జరిగిందని దానికి లోకేష్ సంతకమే రుజువు అని అరెస్టు చేయటం ఖాయం అన్నారు 35) ఫైబర్ నెట్ స్కాంలో FIR నమోదు చేసిన 19 మందిలో అసలు లోకేష్ పేరు లేదు 36) 750 కోట్ల ప్రాజెక్టులో 1500 కోట్ల అవినీతి ఎలా జరిగిందో వైసీపీ నేటికీ చెప్పలేదు (14/n) 37) నేను సీఎం అయిన తర్వాత అమరావతి రాజధానిగా కొనసాగిస్తాను నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అన్నాడు 38) 6 నెలలు గడవక ముందే అమరావతిని కాదని 3 రాజధానులు తెరపైకి తెచ్చాడు 39) అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చంద్రబాబు బినామీలు అక్కడ భూములు కొన్నారు అన్నాడు 40) అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదని అక్కడ బినామీలు భూములు కొన్నట్లు ఆధారం లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు రెండు తేల్చి చెప్పాయి 41) అమరావతిలో మొత్తం కమ్మ సామాజిక వర్గం వారే ఉన్నారని కమ్మరావతి అంటూ విష ప్రచారం చేశాడు 42) కానీ అమరావతి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అక్కడ SC,ST - 34%, రెడ్డి - 23%, కమ్మ - 18%, BC - 14% ఉన్నారు 43) అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని అదంతా బాహుబలి గ్రాఫిక్స్ అన్నాడు 44) కానీ జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిలో భవనాలు 70% పైగా పూర్తయినట్టు పురపాలక శాఖ నివేదిక ఇచ్చింది 45) అమరావతి స్మశానం అన్న బొత్స కూడా అమరావతి వెళ్లి బిల్డింగ్స్ అన్ని చూసి వచ్చాడు 46) తెలంగాణ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని విష ప్రచారం చేశారు 47) కానీ ఓటుకు నోటు కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లో ఎక్కడ చంద్రబాబు పేరు లేదు 48) టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని వందల కోట్ల అవినీతి సొమ్ముతో సిబిఐకి దొరికి పోయాడని విమర్శించాడు 49) జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే శేఖర్ రెడ్డిని తిరిగి టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించాడు 50) లోకేష్ కు శేఖర్ రెడ్డి 100 కోట్లు ఇచ్చాడని ఆరోపణలు చేశారు పచ్చపుట్టలో నల్లత్రాచు అంటూ విష పత్రిక సాక్షిలో కథనాలు రాశాడు 51) తరువాత అదే సాక్షిలో అపనిందను అధికమించి శ్రీవారికి చెంతకు చేరాడు అని జగన్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చినప్పుడు రాశాడు 52) చంద్రబాబు ఉచితంగా ఇస్తున్న ఇసుక లో అవినీతి అక్రమాలు ఉన్నాయని ప్రతిపక్షంలో విమర్శించాడు 53) జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత యూటర్న్ తీసుకుని గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరగలేదని NGT కి లేఖ ఇచ్చాడు 54) ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు 6 లక్షల కోట్లకు పైగా అవినీతి చేశాడని ఆధారాలు కూడా ఉన్నాయని పుస్తకం విడుదల చేశాడు 55) జగన్ సీఎం అయ్యి 3 ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వం ఆయన చేతుల్లోనే ఉన్న చంద్రబాబుపై కానీ కుటుంబ సభ్యులపై కానీ ఒక్క అవినీతి కేసు నమోదు చేయలేదు ఆరోపణలు నిరూపించలేదు Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted January 4, 2022 Share Posted January 4, 2022 👌 consolidated with good explanation Link to comment Share on other sites More sharing options...
skilaru Posted January 4, 2022 Share Posted January 4, 2022 Okkokka point ki okkokka video bite ...ye department minister aa department points ni cheptu .... teesi vadilithe better.. hope TDP media committee is doing it Link to comment Share on other sites More sharing options...
Vishal_Ntr Posted January 5, 2022 Share Posted January 5, 2022 55 points aa 😀😀 Link to comment Share on other sites More sharing options...
kalyan babu Posted January 5, 2022 Share Posted January 5, 2022 Fake gala fake pracharam and e AP goats avi namai. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.