Jump to content

King Of licking the politicians in Power


srinivas_sntr

Recommended Posts

బిగ్ బాస్ లో టీఆర్ఎస్ ఎంపీ - నాగార్జున కీలక నిర్ణయం 

బిగ్ బాస్ షో లో టీఆర్ఎస్ ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ తో పాటుగా ఆడియన్స్ కు ఒక మంచి సందేశం ఇచ్చారు. ఆయన స్పూర్తిగా కింగ్ నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు.
 ఆ ఎంపీ రావటంతో..బిగ్ బాస్ షో లో ఆసక్తి కర చర్చ సాగింది. మొక్కలు నాటడమే ఒక కార్యక్రమంగా పెట్టుకుని కోట్లాది మొక్కలు నాటించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,
 రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను బిగ్‌బాస్ స్టేజీపైకి నాగార్జున ఆహ్వానించారు. బిగ్ బాస్ హౌస్‌లో 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' నినాదం మార్మోగింది.


షో లోకి వస్తూనే ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లో నాటమని హోస్ట్‌ నాగార్జునకు ఒక మొక్కను బహుకరించారు. పచ్చదనమే రేపటి ప్రగతి పథమని బిగ్‌బాస్‌ షో వేదికగా చాటిచెప్పారు. 
ఈ చాలెంజ్‌ ప్రారంభమై 3 సంవత్సరాలు పూర్తైందని చెప్పారు. గడిచిన మూడేళ్లలో 16 కోట్ల మొక్కలు నాటానన్న ఎంపీ సంతోష్‌కుమార్‌ ఈ చాలెంజ్‌లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి 
అడవులను దత్త తీసుకున్నారని తెలిపారు.


నిర్ణయం ప్రకటించిన నాగార్జున ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని ముందుకు వచ్చారు. 
ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఎక్కడ చూపిస్తే అక్కడ వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుని మొక్కలు పెంచడానికి నాగ్‌ సిద్ధమయ్యారు

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...