Jump to content

జస్టిస్‌ కనగరాజ్‌ నియామకాన్ని సస్పెండ్‌ చేసిన హైకోర్టు


rajanani

Recommended Posts

అమరావతి: రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథార్టీ ఛైర్మన్‌గా మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నియామకంపై రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది జూన్‌ 20న జారీచేసిన జీవో 57ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది పారా కిశోర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్‌ అథార్టీ (ఏపీఎస్‌పీసీఏ) ఛైర్మన్‌, వ్యక్తిగత హోదాలో జస్టిస్‌ కనగరాజ్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుండా నియమించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఇంద్రనీల్‌ బాబు వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం జస్టిస్‌ కనగరాజ్‌ నియామక జీవోను 6 వారాల పాటు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.

వాజ్యంలోని ముఖ్యాంశాలు..

* ఏపీ రాష్ట్రస్థాయి పోలీసు ఫిర్యాదుల అథార్టీ నిబంధన 4(ఏ)కు విరుద్ధంగా జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించారు. ఈ అథార్టీ రాజకీయ, కార్యనిర్వాహక జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన వయసు 78 ఏళ్లు. ఛైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి చట్టప్రకారం 65 ఏళ్లు నిండే వరకే ఆ పదవిలో కొనసాగుతారు. వయసు రీత్యా అర్హత లేని వారిని ఛైర్మన్‌గా నియమించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...