Jump to content

TDP Gelupupaina


Recommended Posts

etu vanti anumanam ledu

kani centre lo manaku anukulamaina govt. rakapothey CBN ni entha torture pedatharu

Ee vayasu lo aayana inkentha kastapadalo ani bhayamestondi

 

UPA win in 2019 is as imp. as TDP win in Andhra, may be more

5 years centre lo anukulamaina govt. vastey chudandi CBN ki, He will turn the state

He will put more efforts than what he did in Hyderabad

Idhi oohinchukuntey ne chala aanamdanga undi.

 

Link to comment
Share on other sites

14 minutes ago, swarnandhra said:

ikkada CBN, akkada non-modi government vaste best. akkada modi government vacchina, AP growth will continue under CBN. central lo favorable goverenment vaste growth rate perugutundi anthe.

Central lo rakapothey CBN entha chesina avi anni freebies ivvataniki jeethalu ivvataniki kuda saripovu.

Link to comment
Share on other sites

35 minutes ago, swarnandhra said:

ippudu icchina freebies ki center chesina help emi ledu. anni sontham ga gather chesina funds (appulu) e

kasta paddadu, income perigindhi kani avanni freebies ki saripoyayi

ayina inka 5th installment ivvaledu

employees jeethalaki money levu antunaru.

Link to comment
Share on other sites

District leaders meetings chuddam ఎలా vunnayo.. 

జిల్లాలో 17 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు తెదేపా కైవసం
 

పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు

13GT55A1.jpg 
యరపతినేనికి కేకు తినిపిస్తున్న జీవీ ఆంజనేయులు, చిత్రంలో ఇతర నేతలు
పట్టాభిపురం(గుంటూరు),న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌తో సహా నరేంద్ర మోదీ, కేసీఆర్‌, జగన్‌ కుట్రలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తిప్పికొట్టారని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఘోర వైఫల్యం, పక్షపాత ధోరణి కళ్లకు కట్టినట్లు కనిపించిందని ఆరోపించారు. ఇంతటి ఘోరంగా ఎన్నికలు ఇంతకుముందెన్నడూ జరగలేదన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా జిల్లాలో 17 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లను తెదేపా కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపి ప్రజల మన్ననలు పొందిందని గుర్తుచేశారు. టి.ఎన్‌ శేషన్‌ లాంటి ఎన్నికల కమిషనర్లు ఎన్నికల పట్ల ప్రజల్లో గౌరవభావాన్ని నమ్మకాన్ని పెంపొందించగా, ప్రస్తుత ఎన్నికల కమిషన్‌ ఆపేరు ప్రతిష్టలు మంటకలిపే విధంగా నడుచుకుందని ధ్వజమెత్తారు. తెదేపా అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పనిచేయని ఈవీఎంలను పంపి పోలింగ్‌ శాతాన్ని గణనీయంగా తగ్గించేందుకు కుట్ర పన్నారని దుయ్యబట్టారు. అయితే ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి పట్టంకట్టారన్నారు. రూ.200లు పింఛన్‌ను రూ.2000లు చేసినందుకు మా పెద్దకుమారుడు చంద్రబాబే మళ్లీ రావాలని వృద్ధులు, రూ.20,000లు పసుపు-కుంకుమ కింద వేసినందుకు మా చంద్రన్నే రావాలని ఆడపడచులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారన్నారు. దీనిని జీర్ణించుకోలేక వైకాపా నాయకులు తెదేపా నేతలపై దాడులకు తెగబడ్డారన్నారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, నరసరావుపేట అభ్యర్థి డాక్టర్‌ అరవింద్‌బాబుపై దాడి చేశారని తెలిపారు. మరోవైపు ఎంపీ గల్లా జయదేవ్‌పై ఐటీ దాడులు చేసి ఇబ్బందులు పెట్టారని వివరించారు. గంటల తరబడి ఓర్పుగా నిలువుకాళ్లపై నిలబడి కసిగా ఓట్లేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆ ముగ్గురి కుట్రలను పటాపంచలు చేసి తెదేపాకు విజయం చేకూర్చిపెడుతున్నందుకు ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నారు. చంద్రబాబును ఒక్కడ్ని చేసి దెబ్బకొట్టేందుకు ఇన్ని రాజ్యంగ సంస్థ.లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పనిచేయని ఈవీఎంలను పంపి ప్రజల సహనాన్ని పరీక్షింప చేసినా పట్టువదలని విక్రమార్కుల్లా నాలుగైదు గంటలు వేచిఉండి మరీ ప్రజలు ఓట్లేసి గెలిపించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో పావుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ మారిందని ధ్వజమెత్తారు. సొంత చిన్నాన్ననే హతమార్చిన ఘనుడు జగన్‌ అని విమర్శించారు. ఆయనతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తినే ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నియమించారని ఆరోపించారు. వైకాపా నాయకులు ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. తెదేపా శ్రేణులు తలచుకుంటే పారిపోయి తెలంగాణలో తలదాచుకోవాల్ని వస్తుందని వ్యాఖ్యానించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులను ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఈ జిల్లాలో రాజధాని ఏర్పాటు చేసిన చంద్రబాబుకు అన్ని సీట్లును గెలిచి కానుకగా ఇస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో మొదటి ముద్దాయి ఎన్నికల కమిషన్‌ అయితే రెండో ముద్దాయి జిల్లా యంత్రాంగమని విమర్శించారు. గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి. మద్దాళి గిరిధర్‌ మాట్లాడుతూ వైకాపా నాయకులు వారి ఆనందం కోసం 40 రోజులు పాటు కాకిలెక్కలు వేసుకుంటారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తామని కంటున్న పగటి కలలు ఎప్పటికీ నెరవేరవన్నారు. 130 స్థానాల్లో తెదేపా విజయం సాధించి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దాసరి రాజామాస్టర్‌ మాట్లాడుతూ జిల్లా రీపోలింగ్‌కు రెండు కేంద్రాలే ఉన్నాయని అధికారులు సిఫార్సు చేయడాన్ని తప్పుబట్టారు. రీపోలింగ్‌ నిర్వహించాల్సినవి జిల్లాలో ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు.
Link to comment
Share on other sites

కాయ్‌.. రాజా కాయ్‌
 

మంగళగిరిపై భారీగా అంచనాలు

చిలకలూరిపేట, గురజాలపైనా..

కుప్పం, పులివెందుల మెజారిటీలపై బెట్టింగ్‌లు

456_1.jpg

ఈనాడు, గుంటూరు: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? మంగళగిరిలో ఎవరు గెలుస్తారు? అనే దానిపై జిల్లాలో భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మంగళగిరి స్థానం నుంచి ముఖ్యంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్‌ పోటీ చేయటంతో ఇది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా తెదేపాకు చెందిన ఓ ముఖ్యనేత లోకేష్‌ గెలుస్తారని రూ.25 లక్షలు పందెం కాసినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో తిరిగి తెదేపా అధికారంలోకి వస్తుందని ఓ క్లబ్‌లో క్రియాశీలకంగా వ్యవహరించే తెదేపా నేత ఒకరు రూ.10 లక్షలు కాశారు. మంగళగిరిలో వైకాపా గెలుస్తుందని ఓ ట్రావెల్స్‌ నిర్వాహకుడు రూ.25 లక్షలు పందెం వేయటం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో అత్యధికంగా మంగళగిరిపై పందేలు జరుగుతున్నాయని నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోరు సాగినా విజయం ఒకవైపేనని మరికొందరు పందేలు వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టనుంది? అనే దానిపైన జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. అమరావతిరోడ్డుకు చెందిన ఓ కల్యాణమండపం నిర్వాహకుడు రాష్ట్రంలో తిరిగి తెదేపా వస్తుందని పందేం కాయగా, నగరానికి చెందిన ఓ మిర్చి ఎగుమతి వ్యాపారి వైకాపా అధికారంలోకి వస్తుందని రూ.5 లక్షలు పందేం వేసుకుని ఇప్పటికే మధ్యవర్తి వద్ద ఆమేరకు డబ్బులు డిపాజిట్‌ చేయటం గమనార్హం. పులివెందుల, కుప్పం స్ధానాల్లో వచ్చే మెజార్టీలపైనా జిల్లాలో పందేలు సాగుతున్నాయి. పులివెందుల నుంచి వై.ఎస్‌.జగన్‌ 50 వేలకు పైగా మెజార్టీ వస్తుందని వైకాపా నేత ఒకరు పందేం వేశారని వినికిడి. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ కుప్పంలో చంద్రబాబుకు సాధ్యపడుతుందని జిల్లాలో పందేలు వేస్తున్నారు. ఈ పందేలు వేసేవారిలో తెదేపా, వైకాపా నాయకులే కాదు.. వ్యాపార వర్గాలు ఉంటున్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. హోరాహోరీగా ఎన్నికలు జరిగినా ఏదైనా ఒక పార్టీకే పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందని ఎవరిమద్దతు తీసుకోకుండా పాలనాపగ్గాలు చేపడతారని తెదేపా, వైకాపా వర్గీయులు నరసరావుపేట, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్‌లు పెట్టుకుంటున్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. జిల్లాలో మంగళగిరి తర్వాత చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా తిరిగి మంత్రి పుల్లారావు గెలుస్తారని పందేలు కాస్తున్నారు. గుంటూరు నగరంలో ఓక్లబ్‌ కేంద్రంగా పుల్లారావు గెలుపు తథ్యమని సుమారు రూ.30 లక్షలు పందెం కాశారని చెబుతున్నారు. అదే స్థానం నుంచి వైకాపా అభ్యర్థిని రజని గెలుస్తారని నగరానికి చెందిన వైకాపా నేత ఒకరు చిలకలూరిపేటకు చెందిన ఓ జిన్నింగ్‌మిల్లు నిర్వాహకుడితో రూ.5 లక్షలు పందెం కాసినట్లు తెలిసింది. గురజాల నియోజకవర్గంపైన పల్నాడు కేంద్రంగా పోటీలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి తెదేపా సీనియర్‌ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావు హ్యాట్రిక్‌ విజయాన్ని సాధిస్తారని గుంటూరుకు చెందిన తెదేపా నేత ఒకరు రూ.3 లక్షలు కాశారు. ఈ స్ధానం నుంచి వైకాపా గెలుస్తుందని పిడుగురాళ్ల, నరసరావుపేటకు చెందిన వ్యాపారవర్గాలు ఎక్కువగా పందేలు వేస్తున్నారని వినికిడి. నరసరావుపేటకు చెందిన ఆయిల్‌ ట్రేడర్‌ ఒకరు వైకాపా తరపున కాసు మహేష్‌రెడ్డి గెలుస్తారని రూ.5 లక్షలు పందేం వేశారని తెలిసింది. గుంటూరు పశ్చిమంలో జనసేన గెలుస్తుందని మరికొందరు జనసేన నేతలు భారీగా బెట్టింగ్‌లకు సిద్ధపడుతున్నారు. ఇక్కడ జనసేన గెలుస్తుందని తెదేపా, వైకాపాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు పందేలు కాస్తున్నట్లు వినికిడి. శ్రీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ టీస్టాల్‌ నిర్వాహకుడు పశ్చిమం నుంచి జనసేన అభ్యర్థిగా తోట చంద్రశేఖర్‌ విజయం సాధిస్తారని వైకాపాకు చెందిన నగర ముఖ్య నేత ఒకరిపై రూ.2 లక్షలు పందేం కాశారు. జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్‌లు కాయటం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

Link to comment
Share on other sites

ఎన్నికల కమిషన్‌ తీరు అప్రజాస్వామికం

13RPD411.jpg

మాట్లాడుతున్న మంత్రి పరిటాల సునీత

రామగిరి, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. శనివారం రామగిరి మండలంలోని వెంకటాపురంలో ఆమె స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఏర్పాటు చేసిన ఈవీఎంలు సక్రమంగా పనిచేయక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని బద్దలాపురం, ఎలకుంట్ల గ్రామాల్లో ఈవీఎంలు పనిచేయక ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోలింగ్‌ కేంద్రాల చుట్టూ తిరిగారని తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు రాలేదని, ఇక్కడ మాత్రం తుప్పుపట్టిన ఈవీఎంలు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఈసీ భాజపా జేబు సంస్థలా మారిందని విమర్శించారు. కేసీఆర్‌, జగన్‌, మోదీ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు చంద్రబాబునాయుడుకు అండగా నిలిచారని.. మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాప్తాడుతోపాటు రాష్ట్రంలో వైకాపా శ్రేణులు గొడవలను సృష్టించి లబ్ధి పొందాలని చూశారని ఆరోపించారు. స్పీకర్‌పై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి వారికి ఓటు రూపంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, అది త్వరలోనే తెలుస్తుందన్నారు. రాష్ట్రంలోనూ, రాప్తాడులోనూ తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో పరిటాల శ్రీరామ్‌, ఎల్‌.నారాయణచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

భారీ ఆధిక్యంతో విజయం

 

13RDG1A.jpg
మాట్లాడుతున్న మంత్రి కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, న్యూస్‌టుడే : రాయదుర్గం నియోజకవర్గంలో తెదేపా భారీ ఆధిక్యంతో విజయ దుందుబి మోగిస్తుందని మంత్రి కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం రాయదుర్గంలోని తన నివాసంలో మంత్రి పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తెదేపా నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా నాయకులు, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, పసుపు - కుంకుమ పొందిన మహిళలు, ఎన్టీఆర్‌ భరోసా కింద లబ్ధి పొందిన వారు, కృతజ్ఞతలతో సీఎంకు సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు కాలవ తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా మహిళా ఓటర్లు బారులుదీరి గంటల తరబడి నిలబడి ఓటేసినట్లు చెప్పారు. 2014 ఎన్నికల్లో డి.హీరేహాళ్‌, రాయదుర్గం పట్టణంలో వచ్చిన మెజార్టీ తనకు విజయాన్నిచ్చిందన్నారు. ఐదు మండలాలు, పురపాలక సంఘంలో మెజార్టీ సాధిస్తామని స్పష్టంగా, సవివరంగా, సహేతుకంగా విశ్లేషించినట్లు మంత్రి వివరించారు.

కాపు, మెట్టుపై విమర్శలు

వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఐదేళ్లల్లో ప్రజలకు ఏమీ చేయలేని నిస్సహాయత, మూడున్నరేళ్లు బళ్లారిలో కాపురముండటంతో ఒరిగేదీ, జరిగేదీ ఏమీ లేదనే అభి ప్రాయంతో ప్రజలు తెదేపాను గెలిపించనున్నారని మంత్రి అన్నారు. మాజీ ఎమ్మెల్యే మెట్టుగోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలు కులం పేరుతో ఒకటి కావటం, కుల ప్రస్తావనతో సమావేశాన్ని నిర్వహించి రాయదుర్గం రహదారిపై గంతులు, చిందులు వేయటం ప్రజలకు అసహ్యం కలిగించిందన్నారు. తాను ఐదేళ్లల్లో కులాల ప్రస్తావన ఎప్పుడూ తేలేదన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్న పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి ఎప్పుడూ కుల ప్రస్తావన చేయలేదని హుందాగా వ్యవహరిస్తూ బలహీన వర్గాలకు అండగా ఉన్నారన్నారు.

Link to comment
Share on other sites

7 minutes ago, baggie said:

state by state veyando bro appudu clear pic vastadi.

 

19 minutes ago, TARAKNO1 said:

Asalu centre lo non-modi Ela expecting Andi..even in worst scenario lo kuda could not imagine..be practical Andi..

RAJ, MP, GUJ, Bihar BJP expecting clean sweep 120+ MP seats where they have done very badly just few months back. 2014 Congress/UPA ki ee states lo 5 seats kooda raaledu.

Ikkada BJP vaallu 100+ vesukuntunnaru in their puppet National media channels, reality lo 50 daatithe chaala great.

RAJ & MP State governments 3 months back ee form ayyayi Congress will bag Majority or at least half seats.

That it self is big big set back for BJP.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...