Jump to content

Vizag metro


sonykongara

Recommended Posts

ముఖ్యాంశాలు
విశాఖ మెట్రోపై 5 సంస్థల ఆసక్తి
28-02-2018 04:10:33
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు 5 ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆసక్తి వ్యక్తపరిచాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని చేపట్టాలనే ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఈవోయూ(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రె్‌స్ట)లను కోరుతూ అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) గతేడాది నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీనికి స్పందనగా అదాని ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, టీఆర్‌ఐఎల్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(టాటా రియాల్టీ), షాపూర్జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ ప్రెవేట్‌ లిమిటెడ్‌, ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ రైల్‌ లిమిటెడ్‌ అనే కంపెనీలు ఆర్‌ఎ్‌ఫక్యూ-ఈవోఐ బిడ్లను సమర్పించాయి. వీటిని పరిశీలించి, డెవలపర్‌ను ఎంపిక చేసే ప్రక్రియను 5 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
విశాఖ మెట్రోకు 5 కంపెనీలకు అర్హత

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు బిడ్‌ వేసిన 5 ప్రధాన కంపెనీలు ప్రాథమికంగా అర్హత సాధించాయని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. అదానీ, టాటా రియాలిటీ, షాపూర్‌జీ పల్లోన్‌జీ, ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ రైల్‌ కంపెనీలు ఇందులో ఉన్నాయి. వీటి నుంచి ప్రతిపాదనల్ని ఆహ్వానించే ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆయా కంపెనీల ప్రతిపాదనల ప్రక్రియ అయ్యాక.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలకు ఎవరు అర్హులో నిర్ణయిస్తారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 months later...
  • 1 month later...
విశాఖ మెట్రోపై కొరియా సంస్థల ప్రతిపాదనలు

12525523BRK83A.JPG

అమరావతి: విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన దక్షిణ కొరియాకు చెందిన నిర్మాణ సంస్థలు తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురువారం వివరించాయి. పారిశ్రామిక, మౌలిక రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పెద్దయెత్తున అభివృద్ధి జరుగుతోందని సీఎం వారికి తెలిపారు. అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమ వేగవంతంగా నిర్మాణం జరుగుతోందన్నారు. మొదటి కారు జనవరిలో ఉత్పత్తి కానున్నట్లు చెప్పారు.

అమరావతిలో టీటీడీ నిర్మించ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నమూనా చిత్రాలను అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ప్రదర్శించారు. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే భవ్యమైన, నవ్యమైన నిర్మాణం జరగాలని సీఎం వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిర్మిస్తున్న ఆలయం కావున ప్రత్యేకంగా భావించి ప్రజలను కూడా దీనిలో భాగస్వాములను చేయాలని కోరారు. ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Link to comment
Share on other sites

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్
25-08-2018 11:46:35
 
636707943986877473.jpg
  • విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక
  • రూ.8 వేల కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ముందుకువచ్చిన దక్షిణ కొరియా సంస్థలు
  • నిధుల సమీకరణకు భూముల తనఖా
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు దక్షిణ కొరియా సంస్థలు కొన్ని ముందుకువచ్చాయి. అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. రూ.8 వేల కోట్లు అవసరమనే అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందించారు. ఈ వ్యయాన్ని ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలని అనుకున్నాయి. కేంద్రం నుంచి సానుకూలత రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ద్వారా 50 శాతం నిధులు పెట్టి, మిగిలిన 50 శాతం నిధులను పీపీపీ విధానంలో సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలవగా ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన టాటా, అదాని, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ తదితర ఐదు సంస్థలు అర్హత సాధించాయి. ఈ ప్రాజెక్టు పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-1లో సివిల్‌ పనులన్నీ వస్తాయి.
 
అలాగే రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించి అందజేయాలి. ఈ పనులన్నీ అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ చూసుకుంటుంది. ప్యాకేజీ-2లో రైలు ట్రాక్‌ నిర్మాణం, సిగ్నలింగ్‌ వ్యవస్థ, జీపీఎస్‌ ఏర్పాటు, ఇతర మెకానికల్‌ పనులు ప్రైవేటు సంస్థ చేపడతాయి. ఈ రెండో దశ పనులను చేపట్టేందుకు దక్షిణ కొరియా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4 వేల కోట్ల నిధుల కోసం విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద తనఖా పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు త్వరలో కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
మూడు కారిడార్లుగా విశాఖ మెట్రో..
07-11-2018 02:13:48
 
విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా కేంద్రం విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్రప్రభుత్వమే దాని బాధ్యత తీసుకోవాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టును 42.55 కి.మీ. మేర మూడు కారిడార్లుగా మెట్రో రైలు చేపట్టాలని నిర్ణయించింది. దీని అంచనా వ్యయం రూ. 8,300 కోట్లు. తక్కువ వడ్డీకి రుణాలిచ్చే ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమకూర్చుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. రూ.4,200 కోట్లకు మించకుండా రాష్ట్ర ప్రభుత్వమే వన్‌టైమ్‌ సావరిన్‌ గ్యారంటీతో అప్పుగా తీసుకోవాలని ఈ ప్రాజెక్టు వ్యవహారాలు చూస్తున్న అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ను ఆదేశించింది. రన్నింగ్‌ సెక్షన్‌, స్టేషన్లు, పార్కింగ్‌ ఏరియాలు, డిపోల ఏర్పాటుకు 83 ఎకరాల ప్రభుత్వ భూమిని అందించడమే కాకుండా మరో 12 ఎకరాల భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. మరిన్ని నిర్ణయాలివీ..
  • ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ నిర్మాణానికి 2395..98 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా ఏపీఐఐసీకి కేటాయింపు.
  •  ఫైబర్‌నెట్‌కు రూ.3283 కోట్లమేర ప్రభుత్వ గ్యారంటీ. ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలని నిర్ణయం. ప్రాజెక్టు విస్తరణ, అదనపు సీపీయూ బాక్సుల ఏర్పాటుకు రూ.3,283 కోట్ల రుణ సమీకరణ.
  •  బందరు పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ కోసం రూ.200 కోట్ల కేటాయింపు. మచిలీపట్నంలో డీప్‌ల్యాండ్‌పోర్ట్‌, పోర్టుల్యాండ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధికి 2159.25 ఎకరాల భూమి. సగటున ఒక్కో ఎకరానికి రూ.25 లక్షలు చెల్లించనున్నారు.
  • రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు రూ.22 వేల కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి సరఫరాకు ఆమోదం.
  •   పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ల అద్భుత నిర్వహణకు ప్రత్యేకంగా అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటుకు ఆమోదం. కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని క్యాంటీన్ల ఏర్పాటుకు అంగీకారం. కనీసం నియోజకవర్గానికి ఒకటయినా ఉండాలి.
  • అసైన్డ్‌ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పూర్తి హక్కులు వచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ చట్టం-1977కు సవరణలు చేయాలని నిర్ణయం. దీని ప్రకారం అసైన్డ్‌ ఇళ్ల స్థలాల్లో ఐదేళ్లుగా నివసిస్తున్న వారికి పూర్తి హక్కులు వస్తాయి. అంటే ఆ ఇంటి స్థలాన్ని రెగ్యులరైజ్‌ చేస్తారు. ఐదేళ్ల కాలపరిమితి తర్వాత పూర్తి యాజమాన్య హక్కులు వారికి వస్తాయి. ఆపై తమ సొంత అవసరాల కోసం ఆ ఇంటి స్థలాలను వారు అమ్ముకోవచ్చు.. ఇతరులెవరైనా వాటిని కొనుగోలు చేయవచ్చు. దీనిపై చట్టసవరణ జరగాలి.
  • ఆంధ్రప్రదేశ్‌ ఇనాం చట్టం-1956లో కీలక సవరణలు తీసుకొస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం. దీని ప్రకారం ఇనాం రైతులకు రైత్వారీ పట్టాలు జారీ చేయనున్నారు.
  •  విశాఖ జిల్లాలో భూముల సమీకరణ మార్గదర్శకాలను మార్చిన జీవో 268, 269లకు ఆమోదం.
  • రూ.6,000 కోట్లతో మున్సిపాలిటీలు, పట్టణాల్లో క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లాన్‌(సిప్‌) కింద పనులు చేపట్టే ప్రతిపాదనలకు ఆమోదం.
  • 2015 ఏప్రిల్‌ 29 నుంచి 2016 జూన్‌ 13 వరకు.. ఆ తర్వాత ఇచ్చిన 47 భూకేటాయింపులను లీజు ప్రాతిపదికన కాకుండా అమ్మకం లెక్కన భూమి కన్వర్షన్‌ చేయాలన్న ఏపీఐఐసీ ప్రతిపాదనకు ఆమోదం.
  •  విశాఖలో బ్రాండిక్స్‌ ఇండియా అప్పారెల్‌ సిటీకి కేటాయించిన 44.217 ఎకరాల భూమి డీ నోటిఫైకి పచ్చజెండా.
  •  2014 సెప్టెంబరు 26 నుంచి ఈ ఏడాది డిసెంబరు వరకు స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాలు, మెగా ప్రాజెక్టులకు ప్రోత్సాహకాల కొనసాగింపు.
  • ప్రకాశం జిల్లాలోని ఆరు గ్రామాల పరిధిలో నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటు నిమిత్తం 12,570 ఎకరాల మేర భూసేకరణకు వెళ్లేందుకు ఏపీఐఐసీకి అనుమతి.
Link to comment
Share on other sites

Just now, sonykongara said:

loan icchevadu lekunda work emi start chestharu,

FYI, Vizag metro discussions 6-7 years nunchi nadusthunnayi. Centre ni nammukuni 4 years delay chesindi TDP. Ippatikaina fast ga start chesthe better to show some progress. Too much traffic, Vizag city needs metro.

Vizag city lo TDP meeda negatives emanna vunnayi ante Metro & Railway Zone. Though center dependency is there 4 years BJP tho kalisi vundi kooda emi teledu antaru TDP meeda kooda veeti meeda janallo negativity vundi along with BJP. NAD flyover kooda too much slow pace lo nadusthundi.

Main roads, internal roads, swatch bharat lo Vizag & surrounding villages lo chaala improvement vundi last 4 years. Small & Medium scale industries picked up well in & around vizag last 4 years due to power availability. Pharama very good growth. 

IT companies slow ga vasthunnayi vizag ki, 2004 laaga malli break padithe IT development in Vizag ika lenatte. Jaffas mothham naakesthaaru vizag resources ni.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...