Jump to content

PEOPLE FIRST 1100 AP's “Parishkara Vedika”


sonykongara

Recommended Posts

Inko 350 Employees ni teesukuntunnaru for 24*7 operation of 1100 call center.

 

2000 Mandiki employment.

 

Veeriki salary entha vuntundi? Training isthaara? Qualification?

Karvy vaallu recruit chesukuntaremo..karvy vaallu mottam assist chestunnatunnaru e process ni..
Link to comment
Share on other sites

అవినీతిపరుల గుండెల్లో సిసలైన అంకుశం
 
 
636418191935257846.jpg
  • 1100 కాల్‌ సెంటర్‌తో దడ దడ
  • ప్రతి రోజూ 15 వేల ఫోన్‌ కాల్స్‌
  • బాధితుల లంచం సొమ్ము వాపస్‌
  • నేతల వసూళ్ల దందాలకు తెర
  • అధికారుల అలసత్వానికి అడ్డుకట్ట
  • విధినిర్వహణలో 1700 ఉద్యోగులు
  • బాధితుల పాలిట ఆపద్బంధువుగా
  • సీఎం చంద్రబాబు మానస పుత్రిక
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): నాలుగు అంకెలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. లంచావతారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికార మత్తగజాలను కదిలించే అంకుశంగా మారుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 1100 ప్రజల చేతిలో పాశుపతాస్త్రంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటుతో సతమతవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని భావించారు. పాలనపై 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నప్పుడే ప్రభుత్వం సరిగా పనిచేస్తున్నట్లు లెక్క అని, దీన్ని సాధించాలంటే ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేయాలని నిర్ణయించారు.
 
‘ప్రజలే ముందు’ నినాదంతో ‘పరిష్కార వేదిక- 1100’ కాల్‌ సెంటర్‌కు ఈ ఏడాది మేలో శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడమే తొలి నాళ్లలో ‘పరిష్కార వేదిక’ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పరిష్కార వేదికగా చురుగ్గా వ్యవహరించింది. పరిష్కార వేదికకు వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగానే జనావాసాల నడుమ మద్యం దుకాణాలు.. ఉచిత ఇసుక తదితర విధానాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన విధానాలను సవరించుకుంటూ ముందుకు వెళ్లింది. అయితే పరిష్కార వేదిక నుంచి ప్రజలకు ఫోన్లు చేసినప్పుడు అధికశాతం మంది అవినీతిపై ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు.
 
దీంతో పరిష్కార వేదిక తన దిశను మార్చుకోవాల్సి వచ్చింది. అవినీతి నిర్మూలనే పరిష్కార వేదిక ప్రధాన బాధ్యతగా ఉండాలని సీఎం భావించారు. ఈ దిశగా టోల్‌ఫ్రీ నంబరుకు విస్తృత ప్రచారం కల్పించడం ప్రారంభించారు. 1100కు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. రాష్ట్రంలో ఏ ఉద్యోగి లంచం అడిగినా.. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా 1100కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఫిర్యాదులపై సత్వర స్పందన ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పిలుపునకు ప్రజలు అనూహ్యంగా స్పందించారు.
 
ఊరు గొంతు తడిచింది
కర్నూలు జిల్లా ఆదోని మండలం బైతిగేరి గ్రామమానికి చెందిన రాజు ఊర్లో తాగునీటి సమస్యపై 1100కు ఫోన్‌ చేశారు. 3,500 జనాభా ఉన్న గ్రామానికి సమీపంలోని పెసరబండ తాగునీటి పథకం నుంచి నీరు రావాల్సి ఉందని, కానీ రావడం లేదని, బోర్లు కూడా చెడిపోయాయని, గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య ఉందని ఫిర్యాదు చేశారు. 24 గంటల తర్వాత 1100 కాల్‌ సెంటర్‌ నుంచి రాజుకు ఫోన్‌ వచ్చింది. మీ సమస్యను పరిష్కారించామని అధికారులు చెబుతున్నారు. సరిచూసుకోండి అని సమాచారం ఇచ్చారు. సమస్య పరిష్కారం కావడంతో రాజుతోపాటు గ్రామస్థులందరిలో ఆనందం వెల్లివిరిసింది.
 
ప్రజాప్రతినిధి వసూళ్లకు తెర
పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 24 మందికి ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలను వివిధ దశల్లో అందిస్తారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి, కింది స్థాయి అధికారులు కలిసి ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.5,500 చొప్పున వసూలు చేశారు. దీనిపై 1100కు ఫిర్యాదు వెళ్లింది. అక్కడి నుంచి సదరు ప్రజాప్రతినిధికి ఫోన్‌ వెళ్లింది. ఆగమేఘాలపై ప్రజాప్రతినిధి స్పందించారు. మారుమాట్లాడకుండా లబ్ధిదారులకు డబ్బులు తిరిగి ఇచ్చేశారు.
 
మానవీయకోణంలో స్పందిస్తారు
పరిష్కార వేదిక 1100కు వచ్చే కాల్స్‌పై ఉద్యోగులు మానవీయ కోణంలో స్పందిస్తారు. సమస్య ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సమస్య తీవ్రమైనదైతే వెంట వెంటనే సంబంధిత అధికారులతో సంప్రదిస్తూ తక్షణం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారు. దీనికి ఉదాహరణే ఇది. ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాలలో లక్ష్మి అనే 9 ఏళ్ల అమ్మాయికి ప్రమాదంలో కాలువిరిగింది. ప్రభుత్వ డాక్టర్లు స్పందించ లేదు. లక్ష్మి తండ్రి కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేశారు. కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు స్పందించి జిల్లా వైద్యాధికారితోను.. సంబంధిత వైద్యులతోనూ మాట్లాడి లక్ష్మికి వైద్యం అందే వరకు ఫాలో అప్‌ చేశారు. సమస్య పరిష్కారం కావడంతో లక్ష్మి తండ్రి కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారు.
 
లంచం సొమ్ము వెనక్కి
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు అనే రైతు 1100కి ఫిర్యాదు చేయడంతో వీఆర్వోకి లంచంగా ఇచ్చిన సొమ్ము వెనక్కి వచ్చింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. శ్రీనివాసులునాయుడికి చెందిన పట్టాదారు పాసుపుస్తకంలో పేరు తప్పుగా వచ్చింది. తప్పును సరిదిద్దాలని గత వారం ఆయన వీఆర్వోకు విన్నవించుకున్నారు. సదరు వీఆర్వో రూ.500 లంచంగా అడిగటంతో ఆ మొత్తాన్ని ఇచ్చారు. వీఆర్వో ఆన్‌లైన్‌లో రైతు పేరుకు బదులు అతని తండ్రి పేరును మార్చాడు. మూడు రోజుల తర్వాత రైతు ఆన్‌లైన్‌లో చూడగా మళ్లీ పేరు తప్పుగా వచ్చినట్లు గుర్తించారు. రెండోసారి వీఆర్వోను కలిసి జరిగిన పొరబాటును చెప్పగా మరో రూ.500 ఇవ్వాలని డిమాండు చేశారు. దీంతో రైతు 1100కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రభుత్వం లంచంగా ఇచ్చిన సొమ్మును రైతుకు తిరిగి ఇప్పించి పేరును కూడా సరిదిద్దేలా చూసింది. 1100తో తనకు న్యాయం జరిగిందని రైతు శ్రీనివాసులునాయుడు సంతోషం వ్యక్తం చేశారు.
 
అవినీతికి ‘పరిష్కారం’ ఇలా
అవినీతిపై 1100 నంబరుకు ఫోన్‌ చేసిన వెంటనే ‘టాస్క్‌’ మొదలవుతుంది. ఫోన్‌ చేసిన వ్యక్తి సమగ్ర సమాచారం ఫొటోతో సహా కాల్‌ సెంటర్‌లోని మానిటర్‌పై కనిపిస్తుంది. వీటిని సరిచూసుకోవడం ద్వారా ఫోన్‌ చేసింది సరైన వ్యక్తా కాదా అని నిర్థారించుకుంటారు. ఆ వ్యక్తి చేసిన ఫిర్యాదును కంప్యూటర్‌లో నమోదు చేయగానే సంబంధిత శాఖ.. ఉప శాఖ.. క్షేత్రస్థాయి ఉద్యోగికి సంబంధించిన వివరాలు మానిటర్‌పై వచ్చేస్తాయి. ముందుగా క్షేత్రస్థాయి ఉద్యోగికి సంబంధిత ఫిర్యాదుపై కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు సమాచారం ఇస్తారు. పనిచేసేందుకు ఒక వేళ ప్రభుత్వోద్యోగి లంచం అడినట్లయితే.. ఆ సమాచారం గురించి కూడా కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు ప్రశ్నిస్తారు. దీనిని ఆ ఉద్యోగి తిరస్కరించినట్లయితే ఆ ఉద్యోగి పైస్థాయి అధికారి దృష్టికి తీసుకువెళతారు.
 
అప్పటికీ ఫలితం లేకుంటే జిల్లా కలెక్టర్‌కు తెలియజేస్తారు. దీంతో లంచం వసూలు చేసిన ఉద్యోగి నుంచి ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారునికి ఇప్పించే బాధ్యతను కలెక్టర్‌ తీసుకుంటారు. దీనివల్ల.. ఎవరైనా ఉద్యోగి లంచం తీసుకుంటే అది నాలుగు గోడలకే పరిమితం కాకుండా బాహాటం అవుతుంది. శాఖాపరంగా చర్యలూ ఉంటాయి. కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులూ లంచాలకు దూరంగా ఉంటారు.
 
సహజంగా ఫిర్యాదుల విషయంలో అధికారుల స్పందన రకరకాలుగా ఉంటుంది. వాటిని పరిష్కరించేశామని చెప్పేందుకు ప్రయత్నిస్తారు. లేదా విచారణ దశలో ఉన్నాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ లబ్ధికి సంబంధించి ఎవరి నుంచైనా ఫిర్యాదు వస్తే వాటిని పరిష్కరించేశామంటూ అధికారులు చెప్పినా, ఆ మాటను పరిష్కార వేదిక విశ్వసించదు. మళ్లీ ఫిర్యాదుదారుడిని సంప్రదించి, సమస్య పరిష్కారమైందో లేదో తెలుసుకుంటారు. సమస్య పరిష్కారమైతేనే ఆ అంశాన్ని విడిచిపెడతారు. లేకపోతే.. మళ్లీ మొదటి నుంచి ‘టాస్క్‌’ రిపీట్‌ అవుతుంది.
 
లంచగొండి సీటు మారింది
నాగార్జున యూనివర్సిటీలో పరీక్షా భవన్‌లో పనిచేసే ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు లంచాలు తీసుకుంటున్నారు. ఈయన తీరుతో విసిగిపోయిన విద్యార్థులు 1100కి ఫిర్యాదు చేశారు. దెబ్బకు కదిలిన ఉన్నతాధికారులు సదరు సీనియర్‌ అసిస్టెంటు సీటు మార్చేసి ఓ అనామక పోస్టుకి మార్చేశారు.
 
రెండేళ్ల నాటి లంచం తిరిగిచ్చేశారు
గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ మొయినుద్దీన్‌ ఎంపీడీవోగా పనిచేసి పదవీవిరమణ చేశారు. 2008లో తెనాలిలో 60 గజాల స్థలం కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఆ సమయంలో కార్యాలయ సిబ్బంది నిర్వాకం మూలంగా రిజిస్ట్రేషన్‌లో కొన్ని తప్పులు దొర్లాయి. అప్పుడు వాటిని ఆయన గమనించలేదు. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుందామన్న ఆలోచనతో ప్లాన్‌ అప్రూవల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా తప్పులు ఉన్నట్లు తేలింది. వాటిని సరి చేయిస్తే కానీ ప్లాన్‌ అప్రూవల్‌ ఇవ్వలేమని మున్సిపల్‌ అధికారులు స్పష్టం చేశారు. దీంతో మొయినుద్దీన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి, తప్పులను సరిచేయమని కోరారు.
 
దీనికి కార్యాలయ ఉద్యోగులు రూ.12 వేలు డిమాండ్‌ చేశారు. చివరికి రూ.7వేలు ఇచ్చి మొయినుద్దీన్‌ పనిచేయించుకున్నారు. ఇది జరిగి రెండేళ్లయింది. ఇటీవల 1100పై సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన మొయినుద్దీన్‌లో చైతన్యం తెచ్చింది. వెంటనే తనకు జరిగిన అన్యాయాన్ని 1100కు ఫోన్‌ చేసి చెప్పారు. రెండేళ్ల నాటి సంఘటన కావడంతో తన ఫిర్యాదుకు స్పందన ఉంటుందని ఆయన ఏమాత్రం ఊహించలేదు. అయితే 1100కు ఫోన్‌ చేసిన కొద్దిరోజులకే ఓ స్టాంపు రైటర్‌ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చారు. తప్పు తన వల్లే జరిగిందని చెబుతూ అప్పట్లో లంచంగా తీసుకున్న రూ.7 వేలును తిరిగి ఇచ్చేశారు. ఈ పరిణామంతో మొయినుద్దీన్‌ సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు.
 
చిన్నారి ప్రాణం నిలిపింది..
రోజుల బిడ్డ...పరిస్థితి విషమంగా ఉంది...చికిత్స అందించాల్సిన వైద్యులు పట్టించుకోవడం లేదు..దిక్కుతోచనిస్థితిలో ఆ తండ్రి 1100కు ఫోన్‌ చేశారు. మరునిమిషంలో స్పందన కనిపించింది. అప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులే ఆ తండ్రి వద్దకు వచ్చారు. పాపకు అవసరమైన చికిత్సను ఆగమేఘాలపై అందించారు. విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన పైడిరాజు ఈనెల 12న గర్భవతిగా ఉన్న తన భార్యను ప్రసవం నిమిత్తం నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవానంతరం ఐదు రోజుల వరకు బిడ్డ బాగానే ఉంది.
 
ఆరో రోజు రక్త పరీక్షలు నిర్వహిస్తే సమస్య ఉన్నట్టు తేలింది. సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేసిన తర్వాత బిడ్డ పరిస్థితి సీరియ్‌సగా ఉందని, చిన్న పేగులో రంధ్రం ఏర్పడిందని, చికిత్సకు మొత్తం రూ.3 లక్షలు అవుతుందని చెప్పారు. అప్పటికే బిడ్డను కాపాడుకునేందుకు అప్పులపాలైన ఆ తండ్రిని ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. చేసేది లేక ఈనెల 18నబిడ్డను కేజీహెచ్‌లోని పిల్లల వార్డులో చేర్పించారు. చిన్నారికి చికిత్స అందించడంలో అక్కడి వైద్యుల నిర్లక్ష్యం ఆ తండ్రిని ఆవేదనకు గురి చేసింది.
 
తన బిడ్డ ప్రాణాలను ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఆఖరి ప్రయత్నంగా 1100కు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. ఫోన్‌ చేసిన కొద్దిక్షణాల్లోనే కేజీహెచ్‌లోని ఉన్నతాధికారుల్లో కదలిక మొదలైంది. ఉరుకులు, పరుగుల మీద సదరు చిన్నారి చికిత్స పొందుతున్న పిల్లల వార్డుకు చేరుకున్నారు. కొన్నిగంటల్లోనే బిడ్డకు వైద్య నిపుణుల బృందం ఆధ్వర్యంలో చిన్న పేగుకు శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉంది.
 
నా ఫిర్యాదుపై స్పందనేదీ..?
అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరుకు చెందిన రవీంద్రచౌదరి 2 నెలల క్రితం తన తోటలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మృతుడి బావమరిది నాగేంద్రప్రసాద్‌ పరిహారం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారి నుంచి కనీస స్పందన లేకపోవడంతో నెల క్రితం 1100కు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచీ ఎలాంటి స్పందన లేదని నాగేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
 
నిర్లక్ష్యం వహిస్తే వేటే
పరిష్కార వేదిక నుంచి అధికారులకు ఫోన్‌ వెళ్లినా కొందరు వెంటనే స్పందించరు. మరికొందరు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. కొందరు ఆర్డీవోలు తమ కంప్యూటర్‌ ఆపరేటర్‌తో మాట్లాడాలంటూ అతని నంబరు ఇచ్చి చేతులు దులిపేసుకున్న ఉదంతంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో వారందరికీ ప్రభుత్వం సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చింది. తీరు మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. స్వయంగా సీఎం సీరియస్‌గా స్పందిస్తుండటంతో జిల్లా కలెక్టర్ల నుంచి గ్రామ స్థాయి ఉద్యోగి వరకు కాల్‌ సెంటర్‌ కాల్స్‌పై తక్షణం స్పందిస్తున్నారు.
 
రోజుకి 15వేల కాల్స్‌
ప్రస్తుతం పరిష్కార వేదికకు రోజుకి 15 వేల కాల్స్‌ వస్తున్నాయి. ఉదయం పూట కాల్స్‌ బాగానే కలుస్తున్నా రాత్రిపూట కాల్స్‌ సరిగా కలవడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే సమస్య పరిష్కారం అయిందని ఆనందంగా చెప్పేవారితోపాటు స్పందన లేదని చెప్పేవారూ ఉన్నారు. అయితే ఇలాంటి ఉదంతాలు ఒకటి రెండు మాత్రమే ఉంటున్నాయి. వీటిని కూడా సరిదిద్ది మరింత ప్రజోపయోగంగా పరిష్కార వేదికను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
 
పరిష్కార వేదిక పనితీరును రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌(ఆర్టీజీఎస్‌) సీఈవో అహ్మద్‌ బాబు పర్యవేక్షిస్తున్నారు. పరిష్కార వేదికను ఓ వ్యవస్థగా రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ బాలాజీ అభివర్ణించారు. దాదాపు 1700 మంది ఉద్యోగులు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. పరిష్కార వేదికలో 24 గంటలూ ఉద్యోగులు పనిచేస్తారని పరిష్కార వేదిక ముఖ్య పాలనాధికారి చిదానందం తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 దాకా రెండు షిఫ్టుల్లో 750 మంది చొప్పున పనిచేస్తారని చెప్పారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 దాకా 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు.
Link to comment
Share on other sites

చంద్రబాబు ఆలోచనకు రూపం పీపుల్స్ ఫస్ట్
24-09-2017 12:28:26
 
636418529271166196.jpg
విజయవాడ: ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు గానీ, ఆ ఫోన్ కాల్ మాత్రం సమస్యను పరిష్కరిస్తుంది. ప్రభుత్వ పరంగా ఎలంటి సమస్యకైనా పీపుల్స్ ఫర్ కాల్ సెంటర్ పరిష్కారం చూపుతుంది. 1700 మంది ఉద్యోగులతో 24 గంటలూ అందుబాటులో ఉండే పరిష్కార వేదిక ఫోన్ నెంబర్ 1100. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న చిన్న పనుల కోసం ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక ప్రభుత్వ పథకాలు, అందితే అందినట్టూ, లేకపోతే లేదు. ప్రజలు ఎవరినైనా అడిగే వ్యవస్థ కూడా లేదు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించి సామాన్య ప్రజలకు సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన నుంచి పుట్టిందే పీపుల్స్ ఫర్ పరిష్కార వేదిక కాల్ సెంటర్. కేవలం ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవడమే కాదు. వాటిని పరిష్కరించే బాధ్యత కూడా ఈ కాల్ సెంటర్ తీసుకోవడమే ప్రత్యేకత.
 
ఇబ్రహింపట్నం మండలం గుంటుపల్లిలో అయిదు అంతస్ధుల్లో ఉన్న పరిష్కార వేదిక ఓ ప్రపంచాన్ని తలపిస్తోంది. రోజుకు 8 వేల 500 నుంచి 12 వేల కాల్స్ ఈ పరిష్కార వేదికకు వివిధ సమస్యల పై వస్తుంటాయి. ఈ ఏడాది మే 25వ తేదీన 1100 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ కాల్ సెంటర్ ప్రస్తుతం 1750 మంది ఉద్యోగులతో నడుస్తోంది. మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పనిచేసేందుకు మరో 400 మంది ఉద్యోగులను తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఫోన్ చేసి, తాము ఎదుర్కొంటున్న సమస్యలను కాల్ సెంటర్ ఉద్యోగులకు చెబుతారు. ఉద్యోగులు ఈ సమస్యలను సంబంధిత శాఖ అధికారికి వెంటనే తెలియజేయటమే కాకుండా, పరిష్కరించేందుకు సమయం కూడా కేటాయిస్తారు. ఆ సమయంలో సమస్య పరిష్కరించని పక్షంలో లాస్ట్ మెయిన్ ఫంక్షనరీ దృష్టికి సమస్యను తీసుకువెళతారు. ఆయన పరిష్కరించే వరకు ఫోన్ కాల్స్ పరిష్కార వేదిక నుంచి వెళుతూనే ఉంటాయి. సమస్య పరిష్కరించినట్టు అధికారి సమాధానం ఇస్తే, ఫోన్ చేసిన ఫిర్యాదుదారుడితో మాట్లాడి మీ సమస్య పరిష్కారం అయిందా లేదా అని అడిగి తెలుసుకుంటారు. ఒకవేళ పరిష్కారం కాని పక్షంలో మరల రీ ఓపెన్ చేసి అధికారుల వెంట పడతారు. ఈ విధంగా సమస్య పరిష్కారమయ్యేవరకు కాల్ సెంటర్ ఫిర్యాదు దారుడు అధికారి మధ్య అనుసంధాన కర్తగా పనిచేసి, సమస్యను పరిష్కరిస్తారు.
 
ఉదాహరణకు విశాఖపట్టణంలోని గాజువాకకు చెందిన పైడిరాజు తన తొమ్మిదేళ్ల కుమార్తెకు చిన్నపేగుల్లో రంధ్రం పడటంతో విశాఖపట్టణం కింగ్ జార్జ్ హాస్పటల్ కు తీసుకువచ్చారు. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో వెంటనే డాక్టర్లను వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. కానీ అక్కడ డాక్టర్లు ఎవరూ పట్టించుకోలేదు. వెంటనే అతను పరిష్కార వేదిక 1100కు ఫోన్ చేసి, తన సమస్యను వివరించారు. తన కుమార్తె ప్రాణం నిలబెట్టాలని వేడుకున్నారు. దీంతో పరిష్కార వేదిక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి విశాఖపట్టణం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి ఫోన్ చేశారు. ఆయన వెంటనే కేజీహెచ్ సూపరిండెంట్ అర్జున్ కు ఫోన్ చేసి, సమస్యను వివరించి సీఎం కాల్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పటంతో సూపరిండెంట్ వెంటనే రోగి వద్దకు సమస్యను తెలుసుకుని వెంటిలేటర్ ను ఏర్పాటు చేశారు. ఆ చిన్నారి కేజీహెచ్ లో శస్ర్తచికత్స పూర్తయి ఐసియూలో కోలుకుంటోంది.
 
ఇక అవినీతిపై వచ్చే ఫోన్ కాల్స్‌కు లెక్కే ఉండదు. అలా వచ్చేవాటిని ఎప్పటికప్పుడు నిజనిజాలను నిర్ధారించి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. లంఛం సొమ్మును తిరిగి వెనక్కి వచ్చేలా చేస్తున్నారు. ఇలా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి లంఛంగా ఇచ్చిన సొమ్మును వెనక్కి పొందిన ప్రజలు దీన్ని నమ్మలేకపోయారు. ముఖ్యమంత్రి ఆలోచనను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు. ఇలా పరిష్కార వేదిక ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాల పై ప్రజల స్పందనను తెలుసుకునేందుకు రోజుకు 3 లక్షల కాల్స్ బయటకు చేసే సౌకర్యం ఉంది. ముఖ్యమంత్రి వాయిస్ తో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పై ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఐవిఆర్ఎస్ సర్వేను కూడా ఈ కాల్ సెంటర్ నుంచి చేస్తున్నారు. ప్రజల్లో సంతృప్తి స్ధాయిని 80 శాతం వరకు తీసుకువచ్చే వరకు ఈ ప్రక్రియను కొనసాగిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వివరించారు. మరో ప్రపంచంలా ఉన్న ఈ పరిష్కార వేదికలో ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఫోన్ చేసిన ప్రజలకు ఎంతో మర్యాదగా సమాధానం ఇవ్వటంతో పాటు సమస్య పరిష్కారం అయ్యే వరకు నిత్యం టచ్ లో ఉంటున్నారు. అధికారులతో ఇదే మర్యాదతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.
Link to comment
Share on other sites

 

 

Ilantivi chuste vache immense satisfaction antha intha kaadhu..cbn :adore:

First ramesh hospital vallu 8 lakhs adigaru. Tharuvatha 1100 ki call chesthe vallu 2 hours lo medical officer ni pamparu report 12 hrs lo prepare chesi pamparu hospital vallu oppukola government maaku eppudu appude dabbulu evvaru meere personal ga arrange chesulukovali ani lekapothe operation cheyyalemu patient condition patti dabbulaki baaga try chesaru. Appude call vachindhi collector nunchi appudu ma mamagaru antha chepparu vallu hospital ki vachi oka round vesukonnaru staff ni 5 laks ki cheque esthamu operation cheyyandi ani 2 days lo operation date fix chesaru reports anni valle thesukoni velli malli operation appudu vacharu hospital vallu malli emi ayna chiraku chestharo emo ani valle chusukonnaru . Operation ayyaka unexpected ga CBN nunchi call patient condition gurinchi adigi thelusukonnaru now he is all set and fine. From 0% hope he is 100% fine now. Apollo vallu mathram baga pundesaru ethani family ni ongole applo lo 3 laks chennai Apollo lo 2 laks operation ki 12 laks ready chesukomannaru anta but only 50% chance annaru overall ga 20 laks avthundhi ante appudu Vijayawada Ramesh hospital ki thesukoni vachi 1100 ki call chesthe edhi antha jarigindhi
Link to comment
Share on other sites

First ramesh hospital vallu 8 lakhs adigaru. Tharuvatha 1100 ki call chesthe vallu 2 hours lo medical officer ni pamparu report 12 hrs lo prepare chesi pamparu hospital vallu oppukola government maaku eppudu appude dabbulu evvaru meere personal ga arrange chesulukovali ani lekapothe operation cheyyalemu patient condition patti dabbulaki baaga try chesaru. Appude call vachindhi collector nunchi appudu ma mamagaru antha chepparu vallu hospital ki vachi oka round vesukonnaru staff ni 5 laks ki cheque esthamu operation cheyyandi ani 2 days lo operation date fix chesaru reports anni valle thesukoni velli malli operation appudu vacharu hospital vallu malli emi ayna chiraku chestharo emo ani valle chusukonnaru . Operation ayyaka unexpected ga CBN nunchi call patient condition gurinchi adigi thelusukonnaru now he is all set and fine. From 0% hope he is 100% fine now. Apollo vallu mathram baga pundesaru ethani family ni ongole applo lo 3 laks chennai Apollo lo 2 laks operation ki 12 laks ready chesukomannaru anta but only 50% chance annaru overall ga 20 laks avthundhi ante appudu Vijayawada Ramesh hospital ki thesukoni vachi 1100 ki call chesthe edhi antha jarigindhi

Super
Link to comment
Share on other sites

First ramesh hospital vallu 8 lakhs adigaru. Tharuvatha 1100 ki call chesthe vallu 2 hours lo medical officer ni pamparu report 12 hrs lo prepare chesi pamparu hospital vallu oppukola government maaku eppudu appude dabbulu evvaru meere personal ga arrange chesulukovali ani lekapothe operation cheyyalemu patient condition patti dabbulaki baaga try chesaru. Appude call vachindhi collector nunchi appudu ma mamagaru antha chepparu vallu hospital ki vachi oka round vesukonnaru staff ni 5 laks ki cheque esthamu operation cheyyandi ani 2 days lo operation date fix chesaru reports anni valle thesukoni velli malli operation appudu vacharu hospital vallu malli emi ayna chiraku chestharo emo ani valle chusukonnaru . Operation ayyaka unexpected ga CBN nunchi call patient condition gurinchi adigi thelusukonnaru now he is all set and fine. From 0% hope he is 100% fine now. Apollo vallu mathram baga pundesaru ethani family ni ongole applo lo 3 laks chennai Apollo lo 2 laks operation ki 12 laks ready chesukomannaru anta but only 50% chance annaru overall ga 20 laks avthundhi ante appudu Vijayawada Ramesh hospital ki thesukoni vachi 1100 ki call chesthe edhi antha jarigindhi

:super:

:

Link to comment
Share on other sites

First ramesh hospital vallu 8 lakhs adigaru. Tharuvatha 1100 ki call chesthe vallu 2 hours lo medical officer ni pamparu report 12 hrs lo prepare chesi pamparu hospital vallu oppukola government maaku eppudu appude dabbulu evvaru meere personal ga arrange chesulukovali ani lekapothe operation cheyyalemu patient condition patti dabbulaki baaga try chesaru. Appude call vachindhi collector nunchi appudu ma mamagaru antha chepparu vallu hospital ki vachi oka round vesukonnaru staff ni 5 laks ki cheque esthamu operation cheyyandi ani 2 days lo operation date fix chesaru reports anni valle thesukoni velli malli operation appudu vacharu hospital vallu malli emi ayna chiraku chestharo emo ani valle chusukonnaru . Operation ayyaka unexpected ga CBN nunchi call patient condition gurinchi adigi thelusukonnaru now he is all set and fine. From 0% hope he is 100% fine now. Apollo vallu mathram baga pundesaru ethani family ni ongole applo lo 3 laks chennai Apollo lo 2 laks operation ki 12 laks ready chesukomannaru anta but only 50% chance annaru overall ga 20 laks avthundhi ante appudu Vijayawada Ramesh hospital ki thesukoni vachi 1100 ki call chesthe edhi antha jarigindhi

:super:

Link to comment
Share on other sites

First ramesh hospital vallu 8 lakhs adigaru. Tharuvatha 1100 ki call chesthe vallu 2 hours lo medical officer ni pamparu report 12 hrs lo prepare chesi pamparu hospital vallu oppukola government maaku eppudu appude dabbulu evvaru meere personal ga arrange chesulukovali ani lekapothe operation cheyyalemu patient condition patti dabbulaki baaga try chesaru. Appude call vachindhi collector nunchi appudu ma mamagaru antha chepparu vallu hospital ki vachi oka round vesukonnaru staff ni 5 laks ki cheque esthamu operation cheyyandi ani 2 days lo operation date fix chesaru reports anni valle thesukoni velli malli operation appudu vacharu hospital vallu malli emi ayna chiraku chestharo emo ani valle chusukonnaru . Operation ayyaka unexpected ga CBN nunchi call patient condition gurinchi adigi thelusukonnaru now he is all set and fine. From 0% hope he is 100% fine now. Apollo vallu mathram baga pundesaru ethani family ni ongole applo lo 3 laks chennai Apollo lo 2 laks operation ki 12 laks ready chesukomannaru anta but only 50% chance annaru overall ga 20 laks avthundhi ante appudu Vijayawada Ramesh hospital ki thesukoni vachi 1100 ki call chesthe edhi antha jarigindhi

 

:super:

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...