Jump to content

Mukyamanthri Yuva Nestham (Nirudyoga Bruthi)


Recommended Posts

యువనేస్తం’ పథకాన్ని విజయవంతం చేయాలి: చంద్రబాబు
01-10-2018 11:06:11
 
636739888161104545.jpg
అమరావతి: రేపటి నుంచి ప్రారంభంకాబోయే ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని విజయవంతం చేయాలని, ఎల్లుండికల్లా ఆయా ఖాతాలలో రూ.1,000 చొప్పున జమ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచం మొత్తం మన ప్రకృతి సేద్యం వైపు చూస్తోందని, ఏపీ ప్రకృతి సేద్యం ప్రపంచానికే నమూనా కావాలని సీఎం ఆకాంక్షించారు. ఐక్యరాజ్యసమితిలో రాష్ట్రానికి మంచి గుర్తింపు లభించిందన్నారు. అటు ప్రకృతి, ఇటు సాంకేతికత అద్భుతమైన జోడి అని, రెండింటినీ సమర్ధంగా వినియోగించుకోవడమే ఏపీ ఘనతని అని చెప్పుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ముందున్నామని పేర్కొన్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 19% వర్షపాతంలోటు ఉందని, సమర్ధ నీటి వినియోగమే అన్ని సమస్యలకు పరిష్కారమని తెలిపారు. జల సంరక్షణ చర్యలే కరవుకు పరిష్కారమని అధికారులకు సూచించారు. రబీ విత్తనాల పంపిణీపై శ్రద్దపెట్టాలని, ఖరీఫ్ దిగుబడి ముందస్తు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. 15.7 కోట్ల పనిదినాలను పూర్తిచేశామని...రూ.4,893 కోట్ల నిధుల వినియోగం జరిగిందని...ఇంకా 7వేల కోట్ల నిధులను వినియోగించుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...