sonykongara Posted February 24, 2019 Author Share Posted February 24, 2019 జలాభిముఖం.. అమరావతి నగరం జలసిరులతో అలరారనున్న రాజధాని3 బ్యారేజిలు... 97 కిలోమీటర్ల పొడవునా గలగలలుదాదాపు 16 టీఎంసీల నీటి నిల్వలుపైన పులిచింతల.. అందులో 45 టీఎంసీల నీటి నిల్వ నవ్యాంధ్రకు రాజధానిగా మకుటాయమానంగా రూపుదిద్దుకుంటోన్న అమరావతి నగరం సమీప భవిష్యత్తులో జలసిరులతో అలరారనుంది. రాజధానికి ఆనుకుని ఇప్పటికే ప్రకాశం బ్యారేజి ఉంది. ఎగువన వైకుంఠపురం బ్యారేజికి శంకుస్థాపన జరిగింది. దిగువన త్వరలో చోడవరం బ్యారేజి రానుంది. వీటికి ఎగువన పులిచింతల ప్రాజెక్టు సైతం ఉండనే ఉంది. రాజధానిని ఆనుకుని ఆపైన రమారమి 97 కిలోమీటర్ల పొడవునా కృష్ణమ్మ గలగలలు వినిపించనున్నాయి. దానికి అభిముఖంగా జలసిరులు కొత్తందాలు తేనున్నాయి. పర్యాటకానికి అదనపు హంగులు అద్దనున్నాయి. నీరు ఎక్కడ నుంచి ఎలా..పులిచింతల ప్రాజెక్టులో మిగులు జలాలతో పాటు, దానికి ఇవతల ఉన్న వాగులు, వంకల నుంచి వచ్చే నీరంతా ఈ మూడు బ్యారేజీలకు ప్రాణాధారమవుతుంది. పులిచింతల దిగువన పాలేరు, మున్నేరు, కట్టలేరు, వైరాల నుంచి ప్రవాహాలు వచ్చి కృష్ణా నదిలో చేరతాయి. కొండవీటి వాగూ ఒక ఆధారం. మరోవైపు కోతుల వాగు, కప్పలవాగు, ఇప్పలవాగు, గుర్రాల వాగు, ఏనుగుగడ్డ వాగు, పడమటి వాగు, నల్లవాగు తదితరాల నుంచి పై ఏరులకు ప్రవాహాలు చేరుతుంటాయి. గత 15 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి ప్రకాశం బ్యారేజిలో చుక్క కూడా మిగులు జలం లేని పరిస్థితి ఏర్పడింది. అద్భుత వరం.. ఎన్టీఆర్ జలసాగరంకృష్ణానదికి దిగువన చోడవరం బ్యారేజి నుంచి ఎగువన వైకుంఠపురం బ్యారేజి చివరి వరకు మొత్తం 97 కిలోమీటర్ల పొడవునా నీరు నిల్వ ఉంటుంది. దీనికి ఎన్టీఆర్ జలసాగరంగా నామకరణం చేస్తున్నాం. ఒక నగరం ఇంత విస్తృతంగా జలాభిముఖంగా ఎక్కడా రూపుదిద్దుకోలేదు. ఇది రాజధాని అమరావతి అందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు లభించిన ఓ అద్భుత వరం. - దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల మంత్రి దిగువన చోడవరం బ్యారేజి నిర్మాణం * ప్రకాశం బ్యారేజికి దిగువన* అంచనా వ్యయం: రూ.899 కోట్లు* నిల్వ: దాదాపు 2.70 టీఎంసీలునీటి విస్తరణ:* ఎగువన ప్రకాశం బ్యారేజి* వరకు 12కి.మీ. మేర ప్రకాశం బ్యారేజి.. విజయవాడ నగరాన్ని ఆనుకుని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ప్రకాశం బ్యారేజి నిర్మించారు.* నిల్వ సామర్థ్యం: 3 టీఎంసీలు* ఉద్దేశం: కృష్ణా డెల్టా సాగు, తాగునీటి అవసరాలు తీర్చటం* నీటి విస్తరణ: బ్యారేజీకి ఎగువన 23.22కి.మీ. వరకు అక్కడే వైకుంఠపురం బ్యారేజి! ప్రకాశం బ్యారేజి నిల్వ నీటి చివరి ప్రాంతం వైకుంఠపురం సమీపంలో కొత్తగా బ్యారేజి నిర్మిస్తున్నారు.* అంచనా వ్యయం: రూ.2169 కోట్లు* నిర్మాణం: దాములూరు, వైకుంఠపురం గ్రామాల మధ్య* మొత్తం నిల్వ: 10 టీఎంసీలు* ఉద్దేశం: రాజధాని తాగునీటి అవసరాలు తీర్చటం* నీటి విస్తరణ: దాదాపు పులిచింతల ప్రాజెక్టు వరకు -ఈనాడు, అమరావతి Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 24, 2019 Author Share Posted February 24, 2019 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now