Jump to content

NTR Arogya Raksha Health Insurance Scheme


Recommended Posts

argoya.jpg

 

 

deniki publicity leka pothe inka waste ee scheme museyandi

 

Ground level lo cader banners petti tdp mla's, tdp mp's karyakarthalu andaru kalipi tdp membership laga every village lo scheme gurinchi cheppi join cheyinchali appude telustundi leka pothe waste 

Link to comment
Share on other sites

Hmmm ...feb lo end aina scheme ni April varaku extend chesaru. Insurance premiums ki deadline untundi ani kuda teliyadu estaru post lu.

 

Nenu oka 10 members ki phone chesa chepdam ani..andariki telsu scheme gurinchi

 

Konta mandi already teskunnaru...konta mandi vere private insurances unnai 2 lakhs cover saripodu annaru.. konta mandi as usual 1200 kosam kakkurti paddaru

 

Item telidu edupe jjeevitam ga brathukutam memu

Link to comment
Share on other sites

  • 1 month later...
డిసెంబరు వరకూ ‘ఆరోగ్య రక్ష’లో నమోదు
 
 
అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది చివరి వరకూ దారిద్ర రేఖకు ఎగువనున్న (ఏపీఎల్‌) ప్రజలు రూ.1200 చెల్లించి ఆరోగ్య రక్ష బీమా పొందవచ్చునని ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య రక్ష బీమా పొందాలని భావించే వారు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.1200 చొప్పున చెల్లించి కార్డు పొందవచ్చని తెలిపింది.
Link to comment
Share on other sites

 

డిసెంబరు వరకూ ‘ఆరోగ్య రక్ష’లో నమోదు

 

 
అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది చివరి వరకూ దారిద్ర రేఖకు ఎగువనున్న (ఏపీఎల్‌) ప్రజలు రూ.1200 చెల్లించి ఆరోగ్య రక్ష బీమా పొందవచ్చునని ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య రక్ష బీమా పొందాలని భావించే వారు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.1200 చొప్పున చెల్లించి కార్డు పొందవచ్చని తెలిపింది.

 

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 4 weeks later...

ఆరోగ్య రక్ష భళా... జనాదరణలో డీలా...

రూ.1200తో ఏడాదికి ఉచితంగా రూ.2 లక్షల వైద్య సేవలు

తెల్లకార్డుదారులకూ అవకాశం

ప్రచారం లేక పెరగని సభ్యత్వాలు

స్వస్థలాల్లో సభ్యత్వం పెంచేందుకు ప్రారంభమైన ప్రవాసాంధ్రుల చొరవ

29ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: ఆరోగ్య రక్ష బీమా పథకం పురిటినొప్పులు పడుతోంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.1200 చెల్లించి రెండు లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరు ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం ఉన్నా ప్రజల నుంచి మాత్రం స్పందన కనిపించడంలేదు. ఇప్పటివరకు 91,585 మంది మాత్రమే సభ్యత్వం పొందారు. వీరి నుంచి రూ.10.98 కోట్లు వసూలయ్యాయి. సభ్యత్వాన్ని పొందిన వారిలో 1,333 మంది వైద్య సేవలు పొందగా రూ.3.40 కోట్ల వరకు ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించింది. సభ్యత్వాలు పెరగకుండా ఉంటే భవిష్యత్తులో ఈ పథకానికి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ పథకం ప్రాధాన్యంపై కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ప్రచారం చేయనందున ప్రజల్లోకి వెళ్లలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏజెన్సీల ద్వారా సభ్యత్వ నమోదు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సర్కారు ఆదేశించినా జిల్లాల్లో దీనిపై ఇంకా యంత్రాంగం దృష్టి పెట్టలేదు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 19,212 మంది శ్రీకాకుళం జిల్లాలో మరీ తక్కువగా 1009 మంది సభ్యత్వాన్ని తీసుకున్నారు.

ఈ పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలుచేస్తున్నారు. తెల్లకార్డుదారులు ఎన్టీఆర్‌ వైద్య సేవ, ఉద్యోగులు ఆరోగ్య సంరక్షణ పథకం, ప్రాతికేయులు ఆరోగ్య సంరక్షణా పథకాల్లో ఉండగా వీటి పరిధిలోకి రానివారి కోసం ఆరోగ్య రక్ష బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మూడు పథకాల కింద లబ్ధిపొందకుండా ప్రజాసాధికారిక సర్వేలో పేర్లను నమోదు చేసుకున్న వారు ఈ పథకం కింద అర్హులని తొలుత ప్రకటించారు. అయితే ప్రజాసాధికారిక సర్వేలో పేర్లు పూర్తి స్థాయిలో నమోదు కాలేదు. అలాగే తెలకార్డుదారులు కూడా ఈ పథకానికి అనర్హులు అని తొలుత ప్రభుత్వం పేర్కొంది. ఇంకొందరు ఇతర బీమా పథకాలలో ఉన్నారు. వీటన్నింటితో ఆరోగ్య రక్ష బీమా పథకంలో సభ్యత్వ నమోదు మందకొడిగా సాగుతోంది.

తెల్లకార్డుదారులకూ అవకాశం...

ఈ పరిస్థితుల్లో తెలుపు రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాలు కూడా ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. తెల్లకార్డు కలిగిన కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా అందరికీ కలిపి ఏడాదికి 2.5 లక్షల రూపాయల విలువచేసే ఉచిత వైద్య సేవలు మాత్రమే లభిస్తాయి. అలా కాకుండా కుటుంబంలో ఉండే సభ్యులు ఒక్కొక్కరూ రూ.1,200 వంతున చెల్లించి ఆరోగ్య రక్ష బీమా పథకంలో చేరితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యకార్డు వస్తుంది. ప్రతి కార్డుపై ఏడాదికి రెండు లక్షల రూపాయల విలువ కలిగిన వైద్య సేవలను పొందొచ్చు. ఇదే సందర్భంలో తెల్లరేషన్‌కార్డుల ద్వారా లభించే ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. దీనిపై ప్రచారం లేనందువల్ల తెల్లకార్డుదారులు ఈ సౌకర్యంపై దృష్టిపెట్టలేదు.

ప్రధాన ప్రయోజనాలు ఇలా...

* ఇతర బీమా పథకాల్లో బీపీ, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి, వయస్సు పైబడిన వారికి ప్రీమియంలు ఎక్కువ. ఆరోగ్య రక్ష బీమా పథకంలో అటువంటి అధిక చెల్లింపులు ఉండవు. 13 జిల్లాల్లో కలిపి 410 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు పొందొచ్చు.

* ఈ ఆస్పత్రుల్లో పొందిన వైద్య చికిత్సలకు సంబంధించి వైద్య బృందం ఆడిట్‌ చేస్తుంది. సరైన వైద్యం అందిందో లేదో నిర్ధారించేందుకు, ఒకవేళ సరైన వైద్యం అందనట్లు రుజువైతే ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు ఇక్కడ ఏర్పాటు ఉంది.

* వైద్యం పొందే సమయంలో ఎటువంటి డబ్బును ఆస్పత్రులకు చెల్లించాల్సిన అవసరమేలేదు. వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు, వైద్యంతోపాటు భోజనం, డిశ్చార్జ్‌ చేసే సమయంలో 11 రోజులకు సరిపడా మందుల్ని ఉచితంగా పొందవచ్చు.

* ప్రతి వ్యక్తి ఏడాదికి రూ.2లక్షల విలువ కలిగిన వైద్య సేవలు పొందొచ్చు. అవసరమైతే మరో 50వేలకు ఈ మొత్తాన్ని పెంచేందుకు అవకాశం ఉంది. రోగి సేవల ప్రాధాన్యాన్ని అనుసరించి ఉన్నతస్థాయిలో సమీక్ష జరిగిన అనంతరం దీనిపై నిర్ణయాన్ని తీసుకుంటారు.

దీని ప్రయోజనాల్ని గుర్తించిన ప్రవాసాంధ్రులు

*ఈ ఆరోగ్య రక్ష పథకం ప్రయోజనాల్ని గమనించిన ప్రవాసాంధ్రులు తమ స్వస్థలాలకు చెందిన వారికి సభ్యత్వాలను ఇప్పించేందుకు కృషిచేస్తున్నారు. కొన్నిచోట్ల వారే ఈ ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్రుల సొసైటీ ప్రతినిధి డాక్టర్‌ వేమూరి రవి తెలిపారు.

యూఎస్‌ఏ నుంచి ముందుకొచ్చినవారు...

* కృష్ణా జిల్లా పెదపులిపాకకు చెందిన ప్రవాసాంధ్రురాలు మాధవి గ్రామంలో 203 మంది తరఫున ప్రీమియం చెల్లించారు.

* గుంటూరు జిల్లా మోపేర్రులో డాక్టర్‌ పుష్ప 46 మందికి చెల్లించేందుకు సంసిద్ధత తెలిపారు.

* కృష్ణా జిల్లా గోకరాజుపల్లి గ్రామంలో జి.చంద్ర 11 మందికి, ప్రకాశం జిల్లా కొల్లవారిపాలెంలో కొల్లా అశోక్‌బాబు 38 మందికి, చిత్తూరు జిల్లా గుండ్లపల్లిలో డాక్టర్‌ జి.సాయి 34 మందికి, గుంటూరు జిల్లా చింతపల్లిపాడులో ఎం.కృష్ణ 22 మందికి, గుంటూరు జిల్లా పెద్దరావూరులో డాక్టర్‌ పుష్ప 90 మందికి, గుంటూరు జిల్లా పెద్దపాలెంలో సి.పద్మ 42 మందికి ప్రీమియం చెల్లించేందుకు సమ్మతిని తెలియచేశారు. ఇతర ప్రవాసాంధ్రులు కూడా ఈ పథకం కింద సభ్యత్వాన్ని పెంచేందుకు ముందుకొస్తున్నారు.

Link to comment
Share on other sites

idi andariki thelusu maa father adigara theesukundama ani pvt unnaiga already anna....mari too much crying le

 

 

ఆరోగ్య రక్ష భళా... జనాదరణలో డీలా...

రూ.1200తో ఏడాదికి ఉచితంగా రూ.2 లక్షల వైద్య సేవలు

తెల్లకార్డుదారులకూ అవకాశం

ప్రచారం లేక పెరగని సభ్యత్వాలు

స్వస్థలాల్లో సభ్యత్వం పెంచేందుకు ప్రారంభమైన ప్రవాసాంధ్రుల చొరవ

 

 

chandas uncle ee paper vaadu kuda crying antaara?

Link to comment
Share on other sites

  • 8 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...