January 2, 20197 yr http://www.nandamurifans.com/forum/index.php?/topic/384611-mulapadu-cricket-stadium/
April 21, 20197 yr Funds problem ఆ ACA ki, ఎప్పుడు చూసినా Same Status lo vuntadi.. Edited April 21, 20197 yr by ramntr
April 21, 20197 yr 26 minutes ago, ramntr said: Funds problem ఆ ACA ki, ఎప్పుడు చూసినా Same Status lo vuntadi.. ACA started this stadium with its own money. They estimated the cost around 50-60 cr. But it didn't go as planned. Problems with money and problems with contractor. The costs have escalated almost 3 times. Don't know if BCCI is giving anything. On a side note BCCI gave money for building stadiums in other parts of the country like Himachal Pradesh. ACA has very little clout in BCCI.
November 18, 20241 yr On 11/10/2024 at 2:56 PM, sonykongara said: Australia ground maadiri cheyyali Veelaithe manchi opportunity, Somehow gujarath di thappa rest all pan masala item stadiums Ey....
January 20, 20251 yr Author Mangalagiri: మంగళగిరి క్రికెట్ స్టేడియం పనులు చకాచకా గుంటూరు జిల్లా మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పూర్వ వైభవం సంతరించుకుంటోంది. By Andhra Pradesh News DeskUpdated : 20 Jan 2025 07:09 IST Ee Font size గత ఐదేళ్లూ పట్టించుకోని వైకాపా సర్కారు వైకాపా పాలనలో పనులు నిలిపేయడంతో తుప్పుపట్టి పాడైపోయిన సామగ్రి గుంటూరు జిల్లా మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పూర్వ వైభవం సంతరించుకుంటోంది. అప్పట్లో తెదేపా ప్రభుత్వం రూ.90 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పనులు చేపట్టి 50 శాతానికిపైగా పూర్తి చేసింది. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో స్టేడియంపై శీతకన్నేసింది. పనులు ముందుకు సాగనివ్వలేదు. దీంతో నిర్మాణ సామగ్రి తుప్పు పట్టింది. రహదారులు ధ్వంసమయ్యాయి. ప్రాంగణమంతా కళావిహీనంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. స్టేడియానికి తుదిరూపు ఇస్తోంది. ధ్వంసమైన రహదారుల పనులు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల కట్టడాల నాణ్యత పరీక్షలు చేయిస్తోంది. మరోవైపు మైదానం క్రీడాకారులతో కళకళలాడుతోంది. ప్రస్తుతం ఇక్కడ లోకేశ్ సహకారంతో ప్రీమియర్ లీగ్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తలపడుతున్న జట్లు
January 26, 20251 yr Author MP Kesineni Nani : అమరావతిలో భారీ క్రికెట్ స్టేడియం ABN , Publish Date - Jan 26 , 2025 | 04:19 AM ‘‘దేశంలో ఇప్పటివరకూ అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఒక 1.10 లక్షల సిటింగ్ సామర్థ్యంతో అహ్మదాబాద్లో ఉంది. 60 ఎకరాల్లో 800 కోట్లతో నిర్మాణం 1.25 లక్షల సిటింగ్ సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద స్టేడియం రాజధాని స్పోర్ట్స్ సిటీలో నిర్మించాలని ప్రణాళిక: కేశినేని చిన్ని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ వెల్లడి అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని అమరావతిలో నిర్మించాలని నిర్ణయించామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఈ భారీ స్టేడియం నిర్మాణం కోసం అరవై ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని ఆయన వెల్లడించారు. ‘‘దేశంలో ఇప్పటివరకూ అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఒక 1.10 లక్షల సిటింగ్ సామర్థ్యంతో అహ్మదాబాద్లో ఉంది. దానికి మించి 1.25 లక్షల వీక్షకులు కూర్చునేలా కొత్త స్టేడియం నిర్మించాలని అనుకొంటున్నాం. బీసీసీఐ నుంచి దీనికి ఆర్థిక సాయం తీసుకోవాలని నిర్ణయించాం. కొంత స్థానికంగా మేము సమీకరిస్తాం. అమరావతిలో రెండు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందులోనే ఈ స్టేడియం వస్తుంది’ అని ఆయన చెప్పారు. ఇక అమరావతిలో 2029 జాతీయ క్రీడలు నిర్వహించడానికి బిడ్ వేయనున్నట్లు శివనాథ్ తెలిపారు. క్రికెట్ కోసం ప్రత్యేకంగా మూడు అకాడమీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర, విజయవాడ, రాయలసీమలో ఈ అకాడమీలు ఏర్పాటు అవుతాయని ఆయన చెప్పారు. వీటి నిర్వహణకు మిథాలీ రాజ్, రాబిన్ సింగ్లను తీసుకొంటున్నామని, వారి ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్కు ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం పదిహేను మంది ఎంపిక కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం అన్ని వసతులతో విశాఖ స్టేడియాన్ని ఆధునీకరిస్తున్నామని వివరించారు.
January 26, 20251 yr Author 23 minutes ago, ramntr said: 60 acres saripoyidda stadium ki.. Ahmedabad cricket stadium 63 anukunta
January 31, 20251 yr Author Vijayawada Airport : ఎయిర్పోర్టులు కళకళ ABN , Publish Date - Jan 31 , 2025 | 04:06 AM విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పూర్వవైభవం వస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మిలియన్ మార్క్ (ఏడాదికి)ను అందుకున్న ఈ విమానాశ్రయం.. 6 నెలలుగా పెరుగుతున్న ప్రయాణికులు విజయవాడ విమానాశ్రయానికి పూర్వవైభవం మిలియన్ మార్క్ దాటి.. రికార్డు దిశగా గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఈ ఘనత వైసీపీ పాలనలో ఏ ఏడాదీ దాటని వైనం వైజాగ్, తిరుపతి, రాజమండ్రిలోనూ వృద్ధి (విజయవాడ-ఆంధ్రజ్యోతి) రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ ఊపందుకుంటోంది. ఆరు నెలలుగా వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పూర్వవైభవం వస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మిలియన్ మార్క్ (ఏడాదికి)ను అందుకున్న ఈ విమానాశ్రయం.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వైభవం కోల్పోయింది. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ మిలియన్ మార్క్ను అందుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు చివరకు 9,99,555 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. జనవరిలో మొదటి రోజునే మిలియన్ మార్క్ను చేరుకుంది. మరో రెండు నెలలు ఉండటంతో ఇంకా 3 లక్షల మంది పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈసారి ఆల్టైమ్ రికార్డు నమోదు చేసే పరిస్థితి కనిపిస్తోంది. జూలై నెల నుంచి విమాన ప్రయాణాలు పెరిగాయని విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. విమానాల సంఖ్య పెరగటంతో వృద్ధి నమోదైనట్టు చెప్పారు. విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు నడిచే విమానాలలో ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. ప్రయాణికుల వృద్ధిలో విజయవాడ విమానాశ్రయం దేశంలో 35వ ర్యాంకు సాధించింది. డిసెంబరులోనే 47ు మేర ట్రాఫిక్ పెరిగింది. గతఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు చూస్తే ప్రయాణికుల వృద్ధిలో 23.9 శాతం పెరుగుదల ఉంది. ఇతర ఎయిర్పోర్టుల విషయానికి వస్తే.. జాతీయ స్థాయిలో ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి విశాఖ విమానాశ్రయం 26, తిరుపతి 45, రాజమండ్రి 53 ర్యాంకులను సాధించాయి. విశాఖపట్నం నుంచి 2,75,694 మంది ప్రయాణికులు, తిరుపతి విమానాశ్రయం నుంచి 1,02,739 మంది, రాజమండ్రి నుంచి 51,332 మంది ప్రయాణికుల రాకపోకలతో వృద్ధి నమోదైంది.
Create an account or sign in to comment