September 21, 20178 yr This one is at Mulapadu Near Ibrahimpatnam న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు స్వాగతం విమానాశ్రయం (గన్నవరం), న్యూస్టుడే : న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు గన్నవరం విమానాశ్రయంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నం మూలపాడు ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనున్న రెండు టెస్ట్ల క్రికెట్ సిరీస్లో పాల్గొనేందుకు బుధవారం వారు చెన్నై నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. న్యూజిలాండ్ ఏ జట్టు సభ్యులకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చుక్కపల్లి అరుణ్కుమార్, ఉపాధ్యక్షుడు శివారెడ్డి, మీడియా మేనేజర్ సీఆర్ మోహన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక భద్రత మధ్య బస్సులో తీసుకెళ్లి విజయవాడ గేట్వే హోటల్లో వసతి కల్పించారు. ఈ నెల 23వ తేదీ నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుందని, మూలపాడు స్టేడియంలో 2 వేల మంది ప్రేక్షకులు ఆటను తిలకించేందుకు వసతులు కల్పించినట్లు అరుణ్కుమార్ చెప్పారు. బుధవారం రాత్రి భారత ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ బెంగళూరు నుంచి స్పైస్జెట్ విమానంలో గన్నవరం చేరుకున్నారు.
September 21, 20178 yr This one is at Mulapadu Near Ibrahimpatnam న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు స్వాగతం విమానాశ్రయం (గన్నవరం), న్యూస్టుడే : న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు గన్నవరం విమానాశ్రయంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నం మూలపాడు ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనున్న రెండు టెస్ట్ల క్రికెట్ సిరీస్లో పాల్గొనేందుకు బుధవారం వారు చెన్నై నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. న్యూజిలాండ్ ఏ జట్టు సభ్యులకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చుక్కపల్లి అరుణ్కుమార్, ఉపాధ్యక్షుడు శివారెడ్డి, మీడియా మేనేజర్ సీఆర్ మోహన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక భద్రత మధ్య బస్సులో తీసుకెళ్లి విజయవాడ గేట్వే హోటల్లో వసతి కల్పించారు. ఈ నెల 23వ తేదీ నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుందని, మూలపాడు స్టేడియంలో 2 వేల మంది ప్రేక్షకులు ఆటను తిలకించేందుకు వసతులు కల్పించినట్లు అరుణ్కుమార్ చెప్పారు. బుధవారం రాత్రి భారత ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ బెంగళూరు నుంచి స్పైస్జెట్ విమానంలో గన్నవరం చేరుకున్నారు. mulapadu open stadium .. womens international Ind vs WI matches ayyayi last year http://www.nandamurifans.com/forum/index.php?/topic/384611-mulapadu-cricket-stadium/
November 2, 20178 yr 10 hours ago, Urban Legend said: Roads widen chesi Aa flood lights kuda pettesthe All set..
July 31, 20187 yr Author రాజధానికే తలమానికం.. 31-07-2018 09:22:22 మంగళగిరిలో సిద్ధమవుతున్న క్రికెట్ స్టేడియం పూర్తయిన సివిల్ పనులు డిసెంబరు నాటికి రాష్ట్ర స్థాయి మ్యాచ్లు 2020 నాటికి అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం! రూ.120 కోట్ల భారీ ప్రాజెక్టుగా రూపకల్పన సివిల్ వర్కులకు రూ.60 కోట్లు మౌలిక సదుపాయాలకు మరో రూ.60 కోట్లు నవ్యాంధ్ర రాజధానిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. మంగళగిరి పట్టణానికి సమీపాన రూ.120 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతోంది. ఇప్పటికే సివిల్ పనులు పూర్తి కాగా.. డిసెంబర్ నాటికి రాష్ట్ర స్థాయి మ్యాచ్లు.. 2020 నాటికి అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంగళగిరి/అమరావతి: నవ్యాంధ్ర రాజధానిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 2020 నాటికి పూర్తిస్థాయి సౌకర్యాలతో అందుబాటులోకి రానుంది. 16 ఏళ్ల నుంచి ఇదిగో, అదిగో అంటూ... ప్రస్తుతానికి సివిల్ వర్కులను పూర్తి చేసుకుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి తూర్పు హద్దు వెంబడి.. మంగళగిరి పట్టణానికి చేరువగా వున్న సీఆర్డీయే వారి అమరావతి టౌన్షిప్లో ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమవుతోంది. 23.20 సెంట్ల విస్తీర్ణంలో సుమారు రూ.120 కోట్ల భారీ వ్యయంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. రూ.60 కోట్ల వ్యయంతో చేపట్టిన సివిల్ వర్కు పూర్తయింది. ఇక్కడ స్టేడియంను నిర్మించేందుకు 2000 సంవత్సరంలోనే అప్పటి ఉడా ఏసీఏకు భూ కేటాయింపులు చేసింది. ఏసీఏ అధ్యక్షునిగా గోకరాజు గంగరాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టేడియం నిర్మాణ వ్యవహారాల్లో చురుకుదనం కనిపించింది. 2009లో శంకుస్థాపన జరిపించినా.. 2014లో మాత్రమే ఐవీఆర్సీఎల్ కంపెనీ కాంట్రాక్టు ఏజెన్సీగా ప నులను మొదలు పెట్టారు. వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే సివిల్ వర్కులను పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రారంభోత్సవం జరుపుకోవలసి వుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కాం ట్రాక్టు ఏజెన్సీ పనులను చాల నెమ్మదిగా చేయడంతో కాంట్రాక్టు పీరియడ్ రెట్టింపు కాలాన్ని దాటింది. గ్యాలరీ అదుర్స్ మొత్తం ఐదు లక్షల యాభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టేడియం రూపుదిద్దుకుంది. స్టేడియం తాలూకు గ్యాలరీలో దక్షిణం, ఉత్తరం బ్లాకులను ఐదు అంతస్తులుగాను, తూర్పు, పడమర బ్లాకులను మూడు అంతస్తులుగాను నిర్మించారు. ఈ సివిల్ వర్కుకుగాను ఏసీఏ రూ.60 కోట్లను వెచ్చించింది. గ్యాలరీలో మొత్తం 35 వేల మంది ప్రేక్షకులు కూర్చొనేందుకు అవకాశం వుంటుంది. విశిష్ట అతిథులకోసం గ్యాలరీలో యాభై వరకు కార్పొరేట్ బాక్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. స్టేడియంలో ప్రధానమైన క్రీడామైదానం పనులను కూడ ఇటీవలే ఆరంభించారు. రూ3.5 కోట్ల వ్యయంతో ఈ పనులను చేపట్టారు. మొత్తం 180 గజాల వ్యాసంలో వుండే మైదానం మధ్య నుంచి బౌండరీ లైను 75 గజాల వ్యాసార్ధంలో ఏర్పాటవుతోంది. గ్రౌండు చుట్టూ వుండే అండర్గ్రౌండు డ్రెయినేజీకి, బౌండరీ లైనుకు మధ్య మళ్లీ 15 గజాల జాగా వుంటుంది. ఈ జాగాలో వాణిజ్య ప్రకటనల తాలూకు హోర్డింగ్స్ను ఏర్పాటు చేస్తారు. మైదానంలో మొత్తం 13 పిచ్లను ఏర్పాటు చేస్తున్నారు. 130/100 అడుగుల సైజులో ఈ పిచ్బాక్స్ ఏర్పాటవుతోంది. క్రీడా మైదానాన్ని మధ్యస్థ కేంద్రం నుంచి చివర్లకు 18 అంగుళాలు తగ్గుతూ వచ్చేవిధంగా స్లోపు చేశారు. దీనివలన వర్షపునీరు తేలికగా మైదానం చుట్టూ వుండే అండర్గ్రౌండు డ్రెయినేజిని చేరిపోతుంది. ఆగస్టు నుంచి మౌలిక సదుపాయాలు ఆగస్టు మూడోవారం నుంచి స్టేడియంలో రూ.కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకే ఏసీఏ ప్రయత్నిస్తోంది. సీలింగ్లు, ఎయిర్ కండిషనింగ్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్, వివిధ గ్యాలరీ బాక్సుల మధ్య రెయిలింగ్, షట్టరింగ్స్, కోలాప్సబుల్ గేట్ల వంటివాటిని ఏర్పాటు చేస్తారు. ఈ ఫినిషింగ్ వర్కులతో పాటు స్టేడియం వెలుపల పక్క రోడ్లు, డ్రెయిన్లు, ఇవిగాక స్టేడియంలో మొత్తం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగువేల అడుగుల ఎత్తువరకు లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. మైదానంలో డేఅండ్నైట్ మ్యాచ్ల నిర్వహణకు రూ.పదికోట్ల వ్యయంతో ఫ్లడ్లైట్ల టవర్స్ను, రూ.ఆరు కోట్ల వ్యయంతో 35వేల సీట్లను సౌకర్యవంతంగా అమర్చనున్నారు. ఐదు కామెంటరీ బాక్స్లను రూ.ఐదు కోట్ల వ్యయంతో ఏర్పాటుచేస్తారు. ఇవిగాక డ్రెస్సింగ్ రూములు, అఫీషియల్స్ రూములు, టీవీ ప్రొడక్షన్ రూములు, సెక్యూరిటీ రూములు, కార్పొరేట్ బాక్స్లు, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లతో ఎస్టీపీఎం సిస్టమ్ను, అన్నీ గ్యాలరీల్లో కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటే జిమ్, ప్రహరీ, ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్ను నిర్మించాల్సి వుంది. డిసెంబరులోనే ట్రయల్ మ్యాచ్లు వచ్చే డిసెంబరు నాటికి స్టేడియంలో ట్రయల్ మ్యాచ్లను నిర్వహిస్తాం. వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయి మ్యాచ్లను నిర్వహించాలనుకుంటున్నాం. 2020 నాటికి అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిఽథ్యం ఇచ్చేలా ప్రణాళికను రూపొందించుకున్నాం. రెండోదశ కింద నిధులను సమకూర్చుకుని క్లబ్హౌస్ను నిర్మించాలని అనుకుంటున్నాం. తిరుపతిలో అలిపిరి వద్ద ప్రభుత్వం ఏసీఏకు 30 ఎకరాలను కేటాయించింది. అక్కడ ఓ మినీ క్రికెట్ స్టేడియంను నిర్మిస్తాం. - సీహెచ్ అరుణ్కుమార్, ఏసీఏ కార్యదర్శి ప్రస్తుతం ఏమున్నాయంటే.. ప్రస్తుతం స్టేడియం ఆవరణలో ఇప్పటికే బి గ్రౌండు, నెట్ ప్రాక్టీస్తో కూడిన సీ గ్రౌండు, సకల సదుపాయాలతో ఇండోర్ స్టేడియంలు అందుబాటులో వున్నాయి. రూ.ఐదు కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని గత మే 30న అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఇక్కడే సెంట్రల్ జోన్ అకాడమీ ద్వారా అండర్-16 గ్రూపు బాలలు 27 మందిని నైపుణ్య క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. వీరికి విద్యతో పాటు ఆహారం, వసతి కల్పిస్తున్నారు.
July 31, 20187 yr Author వేగంగా రెడీ అవుతున్న, మంగళగిరి స్టేడియం... అత్యాధునిక హంగులతో రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపొందుతోంది. ఈ క్రికెట్ స్టేడియం భవిష్యత్తులో, అమరావతికి ఒక కలికితురాయి కానుంది. అమరావతి టౌన్-షిప్ లో, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 22 ఎకరాల్లో స్టేడియం నులు జోరుగా సాగుతున్నాయి. 2000వ సంవత్సరంలో స్టేడియం నిర్మించాలి అని తలిచినా, 2010 వరకు నిర్మాణం ప్రారంభం కాలేదు. అప్పటి నుంచి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత, పనుల్లో వేగం పుంజుకుంది. 2018 చివరి నాటికి, పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ సిద్ధం అయ్యింది. స్టేడియం గ్యాలరీ, గదులు మొదలగు పనులు జరుగుతున్నాయి. ఆగస్టు మూడోవారం నుంచి స్టేడియంలో రూ.కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకే ఏసీఏ ప్రయత్నిస్తోంది. సీలింగ్లు, ఎయిర్ కండిషనింగ్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్, వివిధ గ్యాలరీ బాక్సుల మధ్య రెయిలింగ్, షట్టరింగ్స్, కోలాప్సబుల్ గేట్ల వంటివాటిని ఏర్పాటు చేస్తారు. ఈ ఫినిషింగ్ వర్కులతో పాటు స్టేడియం వెలుపల పక్క రోడ్లు, డ్రెయిన్లు, ఇవిగాక స్టేడియంలో మొత్తం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగువేల అడుగుల ఎత్తువరకు లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. వచ్చే డిసెంబరు నాటికి స్టేడియంలో ట్రయల్ మ్యాచ్లను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయి మ్యాచ్లను నిర్వహించాలనుకుంటున్నారు. 2020 నాటికి అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇవి హైలైట్స్: 23.20 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం... 180 గజాల వ్యాసంలో ఉండే మైదానం మధ్య నుంచి బౌండరీ లైను 75 గజాల వ్యాసార్థంలో ఏర్పాటవుతోంది.. గ్రౌండు చుట్టూ ఉండే అండర్గ్రౌండు డ్రెయినేజికి, బౌండరీలైనుకు మధ్య మళ్లీ 15 గజాల జాగా ఉంటుంది.. మైదానంలో మొత్తం 11 పిచ్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పిచ్లు ఒక్కోటి 66 అడుగుల పొడవు, పదడుగుల వెడల్పుతో ఉంటాయి.. అత్యాధునిక సాట్రమ్ వాటర్ డ్రెయిన్లతో, దాదపు 10 వేల లీటర్ల నీటిని బయటకు పంపే సామర్ధ్యం.. 34 వేల మంది ప్రేక్షకులు కూర్చొనేందుకు గ్యాలరీ.. 5 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం.. మొత్తం ఖర్చు రూ.120 కోట్లు (అంచనా) Edited July 31, 20187 yr by sonykongara
July 31, 20187 yr Author ఇక్కడ స్టేడియంను నిర్మించేందుకు 2000 సంవత్సరంలోనే అప్పటి ఉడా ఏసీఏకు భూ కేటాయింపులు చేసింది. ఏసీఏ అధ్యక్షునిగా గోకరాజు గంగరాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టేడియం నిర్మాణ వ్యవహారాల్లో చురుకుదనం కనిపించింది. 2009లో శంకుస్థాపన జరిపించినా.. 2014లో మాత్రమే ఐవీఆర్సీఎల్ కంపెనీ కాంట్రాక్టు ఏజెన్సీగా ప నులను మొదలు పెట్టారు. వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే సివిల్ వర్కులను పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రారంభోత్సవం జరుపుకోవలసి వుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కాం ట్రాక్టు ఏజెన్సీ పనులను చాల నెమ్మదిగా చేయడంతో కాంట్రాక్టు పీరియడ్ రెట్టింపు కాలాన్ని దాటింది. 2000 lo land isthe 2020 na miru goppllu raa
August 1, 20187 yr On 7/31/2018 at 9:30 AM, ramntr said: Chinnadannaru area wise.. True? ground not small...capacity small..
October 21, 20187 yr 41 minutes ago, NatuGadu said: 40k too less capacity.. that too for new stadium I don't think it can hold 40K. I am guessing it to be around 30-35K. Hyderabad population lo 1/4th vuntayi Vijayawada and Guntur kalipi. Uppal stadium capacity 40K. Initial 2-3 matches ki tickets kashtam avthundhemo kaani tharvatha dhorukuthaayi. Amaravati Sports City lo manchi Track and Field, Football, Hockey and Cricket stadiums kattali
December 6, 20187 yr 2017 Dec నుంచి chustuna daily. Edo chestunam anatu chestunaru. 2000 lo alloted works ivi. ఎంత దరిద్రులు రా edavalara
December 6, 20187 yr 29 minutes ago, Dr.Koneru said: 2017 Dec నుంచి chustuna daily. Edo chestunam anatu chestunaru. 2000 lo alloted works ivi. ఎంత దరిద్రులు రా edavalara same feeling
December 6, 20187 yr Author On 7/31/2018 at 7:55 PM, sonykongara said: ఇక్కడ స్టేడియంను నిర్మించేందుకు 2000 సంవత్సరంలోనే అప్పటి ఉడా ఏసీఏకు భూ కేటాయింపులు చేసింది. ఏసీఏ అధ్యక్షునిగా గోకరాజు గంగరాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టేడియం నిర్మాణ వ్యవహారాల్లో చురుకుదనం కనిపించింది. 2009లో శంకుస్థాపన జరిపించినా.. 2014లో మాత్రమే ఐవీఆర్సీఎల్ కంపెనీ కాంట్రాక్టు ఏజెన్సీగా ప నులను మొదలు పెట్టారు. వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే సివిల్ వర్కులను పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రారంభోత్సవం జరుపుకోవలసి వుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కాం ట్రాక్టు ఏజెన్సీ పనులను చాల నెమ్మదిగా చేయడంతో కాంట్రాక్టు పీరియడ్ రెట్టింపు కాలాన్ని దాటింది. 2000 lo land isthe 2020 na miru goppllu raa
January 2, 20197 yr 2020 ki అన్నా set cheyyandi... Good that we have two international stadiums in state..
January 2, 20197 yr aa Mulapadu lo vunnavi anna expand chesi universal stadium ga develop chesthe bagundu Edited January 2, 20197 yr by rk09
Create an account or sign in to comment