Jump to content

Kathipudi to Ongole National Highway 216 Expansion


sonykongara

Recommended Posts

Idi CBN 2002 lo vesina road idi...Puligadda bridge appudu kattinde....Taruvata malli ippudu expand chestunaru

 

This connects major ports along coasts and mainly useful for Diviseema and EAST Guntur which have not seen any Agri based export except domestic based

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 4 weeks later...
  • 2 months later...
ఎన్‌హెచ్‌-216 భూసేకరణ తుది దశకు

636423617997376087.jpg



  • వచ్చే నెల రెండో వారంలో రైతుల భూముల విచారణ
  • తెనాలి సబ్‌కలెక్టర్‌, తహసీల్దార్‌ కార్యాలయాలకు హాజరుకావాలని నోటీసులు
  • భూసేకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌, జేసీ-2

ఆంధ్రజ్యోతి, గుంటూరు : ఎన్‌హెచ్‌-216 (కత్తిపూడి-ఒంగోలు) సెక్షన్‌ జాతీయ రహదారిని రెండు వరసలుగా అభివృద్ధి చేసే నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జిల్లాలో ఏడు మండలాల్లోని 20 గ్రామాల్లో భూసేకరణను అధికార యంత్రాంగం తలపెట్టింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ విజ్ఞప్తి మేరకు ఇంచుమించు రెండేళ్ల క్రితమే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు పెగ్‌ మార్కింగ్‌, సర్వే, భూముల ధరల నివేదికల సేకరణ వంటి ప్రక్రియలను పూర్తి చేశారు. చివరిగా భూసేకరణలో భూములు కోల్పోయే యజమానులను గుర్తించారు. వారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించేందుకు వచ్చే నెల రెండోవారంలో తెనాలి సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా జాయింట్‌ కలెక్టర్‌ -2 ముంగా వెంకటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.

 

ఎన్‌హెచ్‌ -16 చెన్నై - కోల్‌కత్తాకు ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఎన్‌హెచ్‌-216 ప్రత్యామ్నాయంగా ఉంది. ఏ కారణం చేతనైనా ఎన్‌హెచ్‌-16లో వాహనాలను దారి మళ్లించాల్సి వస్తే ప్రస్తుతం ఎన్‌హెచ్‌-216నే వినియోగిస్తున్నారు. అయితే ఈ రహదారి ఇరుకుగా ఉండటం, గ్రామాల్లో నుంచి ఏర్పాటై ఉండటంతో ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ రహదారిని రెండు వరసలుగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరచుగా ఈ రోడ్డు భూసేకరణను సమీక్షిస్తున్నారు. రెండేళ్ల క్రితం జేసీ-1కు అమరావతి రాజధాని భూసమీకరణ, నడికుడి-శ్రీకాళహస్తి భూసేకరణ బాధ్యతలు ఉండటంతో అప్పటి కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే ఎన్‌హెచ్‌-216 భూసేకరణ బాధ్యతను జేసీ-2(నాన్‌ రెవెన్యూ)కి అప్పగించారు.

 

చెరుకుపల్లి మండలంలోని కనగాలలో 10,948 చదరపు మీటర్లు, గూడవల్లిలో 2003, అరుంబాకలో 1,192, రాంభొట్లపాలెంలో 8,663 చదరపు మీటర్ల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. నగరం మండలంలోని శివనాగులపాలెం(శివంగులపాలెం)లో 2,281 చదరపు మీటర్లు, పిట్టలవానిపాలెం మండలం చందోలులో 13,261, ఖాజీపాలెంలో 899, భట్టిప్రోలు మండలంలోని అద్దేపల్లిలో 15,766 చదరపు మీటర్లు, భట్టిప్రోలులో 5,073, పెదపులివర్రులో 7,216, సూరేపల్లిలో 8,628, గొరిగపూడిలో 9,122, రేపల్లె మండలంలో పేటేరులో 4,172, పరిసపాడులో 6,441, మురుకొండుపాడులో 2,583, బాపట్ల మండలంలోని మరుప్రోలువారిపాలెంలో 30,281, బాపట్లలో 71,514, కర్లపాలెం మండలంలోని యాజలిలో 1,636, బుద్ధాంలో 7,613, కర్లపాలెంలో 316 చదరపు మీటర్ల భూమిని సేకరించేందుకు రైతులకు నోటీసులు పంపించారు.

 

సేకరించాల్సిన భూముల్లో సాగు, నివాస, వాణిజ్య కేటగిరీవి ఉన్నాయి. ఎన్‌హెచ్‌-216 పక్కన ఉండటంతో వీటికి ఆయా గ్రామాల్లో మంచి ధర ఉంది. భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న ధరకు మూడు రెట్ల వరకు లభించే అవకాశం ఉన్నది. అయితే అక్కడ ధర రిజిస్ట్రేషన్‌ విలువ కంటే ఐదు నుంచి పది రెట్లు అధికంగా ఉండటంతో రైతులు ఎక్కువ నష్టపరిహారాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా అక్టోబర్‌ 11, 12, 13, తేదీల్లో జరిగే విచారణ వేదికలకు హాజరై తమ డిమాండ్లను అధికారుల ముందుంచేందుకు సన్నద్ధమౌతున్నారు. అయితే విచారణ వేదికలు తమ మండలాల్లో కాకుండా దూరంలో ఉన్న తెనాలిలో ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • 2 months later...
ఎన్‌హెచ్‌ విస్తరణ వేగవంతం చేయాలి: కలెక్టర్‌
eag-gen7a.jpg

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కత్తిపూడి నుంచి గుడిమెల్లంక వరకు చేపట్టిన 216 జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కాకినాడ నుంచి కత్తిపూడి వరకు జరుగుతున్న రహదారి విస్తరణ, బైపాస్‌ రోడ్లు, వంతెన నిర్మాణాలను అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్యాకేజీ-1లో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు జరిగే పనులు త్వరగా పూర్తి చేసి రహదారిని అందుబాటులోకి తేవాలని సూచించారు. కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కత్తిపూడి బైపాస్‌ రోడ్లు త్వరగా నిర్మించాలన్నారు. నెలాఖరునాటికి పిఠాపురం రైల్వే వంతెన వద్ద అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో లోపలకు ప్రవేశించే రహదారుల వద్ద అప్రోచ్‌ రోడ్లు త్వరగా చేపట్టాలని ఆదేశించారు. ప్యాకేజీ-2, 3, 4 పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కాకినాడ బైపాస్‌ నిర్మాణంలో భాగంగా ఏడీబీ రోడ్డు కూడలి వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మళ్లీ ఈనెలాఖరున సమావేశం నిర్వహిస్తామని, అప్పటికి పూర్తి ప్రగతి చూపాలన్నారు. జూన్‌లోపే అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌-2 రాధాకృష్ణమూర్తి, 216 జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్‌ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
216 హైవే బాధితుల సమస్యల పరిష్కారానికి ఫోర్‌మెన్‌ కమిటీ
13-04-2018 08:40:44
 
  • జేసీ, ఎన్‌హెచ్‌ పీడీ, డీఆర్‌వో, ఆర్‌డీవోలతో ఏర్పాటు
  • కలెక్టర్‌ అధ్యక్షతన ఆర్బిట్రేషన్‌ మీటింగ్‌
  • 150 మంది రైతుల హాజరు
(ఆంద్రజ్యోతి, విజయవాడ) : జాతీయ రహదారి-216 విస్తరణలో చల్లపల్లి, మోపిదేవి మండలాలకు చెందిన భూ బాధితుల సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఫోర్‌మెన్‌ కమిటీని నియమించారు. జాతీ య రహదారి విస్తరణకు ప్రధాన అవరోధంగా మారిన రైతుల సమస్యలను పరిష్కరించడానికి జాయింట్‌ కలెక్టర్‌, నేషనల్‌ హైవేస్‌ పీడీ, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో), ఆర్‌డీవోలతో కూడిన ఫోర్‌మెన్‌ కమిటీని ప్రకటించారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో 216 జాతీయ రహదారి భూ బాధి తులకు సంబంధించిన విషయాలపై కలెక్టర్‌ అధ్యక్షతన ఆర్బిట్రేషన్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి చల్లపల్లి బైపాస్‌, లక్ష్మీపురం, మోపిదేవి ప్రాంతాలకు చెందిన 150 మంది రైతులు పాల్గొన్నారు. ఒకే జాతీయ రహదారికి సంబంధించి వేర్వేరు పరిహారాలను నిర్ధేశించటం సమం జసంగా లేదని రైతులు కలెక్టర్‌ ముందు వాపోయారు.
 
మచిలీపట్నం మండలానికి సంబంధించి 2013 భూసే కరణ చట్టాన్ని 2 మల్టిఫికేషన్‌ ఫ్యాక్టర్స్‌ ప్రకారం పరి హారం చెల్లించారని, అదే సమయంలో తమకు కూడా నోటిఫికేషన్‌ ఇచ్చినా అధికారుల నిర్లక్ష్యం వల్ల సకాలంలో ప్రక్రియ పూర్తి కాకపోవటం వల్ల నష్టపోయామని చెప్పారు. అధికారుల జాప్యం కారణంగా రాష్ట్రస్థాయిలో చేసిన కొన్ని చట్టాల వల్ల 1.25 మల్టిఫికేషన్‌ ప్రకారం పరిహారాన్ని నిర్ణయించటం జరిగిందన్నారు. తమకు 2 మల్టిఫికేషన్‌ ప్రకారం పరిహారం నిర్ణయించకపోవటం వల్ల ఎకరాకు (రిజిస్ర్టేషన్‌ ప్రకారం) రెండు రెట్ల ధరతో పాటు పునరావాసం కింద రెట్టింపు మొత్తాన్ని వెరసి.. నాలుగు రెట్ల పరిహారాన్ని అందుకోవడానికి అర్హత కోల్పో యామని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణ విధానంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక తప్పులు చోటుచేసుకున్నాయని, వీటివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జనావాసాలను మాగాణి కింద, స్థలాల్లో ఇళ్లు ఉన్నట్టుగా చూపించటం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
 
అసైన్డ్‌ భూములకు కూడా పరిహారం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అసైన్డ్‌ భూములకు సంబంధించిన పరిహారాన్ని నిర్ణయించటంలో కలెక్టర్‌ అంగీకారం తెలపలేదని సమాచారం. మిగిలిన సమస్యలకు సంబంధించి కలెక్టర్‌ సానుకూలంగానే స్పందించారు. రైతుల సమస్యలను పరిష్కరించటానికి ఫోర్‌మెన్‌ కమిటీని నియమించానని, కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వానికి కూడా నివేదిక ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌తో మాట్లాడి ప్రభుత్వ స్థాయిలో సమస్య పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు.
Link to comment
Share on other sites

  • 6 months later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...