Friday at 04:15 PM4 days Author ఏపీలో ఆర్ఆర్బీ అవసరంBy Andhra Pradesh News DeskPublished : 10 Jul 2026 04:24 ISTEeFont size2 min readఅమరావతిలో ఏర్పాటు చేయండిరైల్వే మంత్రికి సీఎం చంద్రబాబు లేఖఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ)ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని..అమరావతి కేంద్రంగా ఈ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా లేఖరాశారు. ఏపీలో ఆర్ఆర్బీ ఏర్పాటు ద్వారా ఇక్కడి నిరుద్యోగులకు ఊరట కలుగుతుందని, అనేక నైపుణ్యాలు గల యువత రాష్ట్రంలో ఉన్నారని, వీరందరికీ రైల్వే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.రైల్ నెట్ వర్క్లో ఆరో స్థానం..రైల్వే ట్రాక్లైన్ పరంగా 8,855 కి.మీ.లతో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే ఆరో స్థానంలో ఉంది. విశాఖపట్నం కేంద్రంగా ఈ ఏడాది జూన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు మొదలుకాగా, రాష్ట్రంలో కొన్ని రైలు మార్గాలు దక్షిణమధ్య రైల్వే (సికింద్రాబాద్), ఈస్ట్కోస్ట్ రైల్వే (భువనేశ్వర్), సదరన్ రైల్వే (చెన్నై), సౌత్ వెస్ట్ రైల్వే (హుబ్బళ్లీ) పరిధిలో కూడా ఉన్నాయి. అంటే మొత్తంగా ఏపీ ఐదు రైల్వే జోన్ల పరిధిలో ఉంది. దక్షిణ కోస్తా జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, రెండు రైల్వే వర్క్షాపులు, ఆరు లోకోషెడ్స్, విజయవాడ శివారు రాయనపాడులో ట్రాక్ మిషన్ల సెంట్రల్ పీరియాడికల్ ఓవరాలింగ్ డిపో వంటివి ఉన్నాయి. ఇటువంటి రైల్వే నెట్వర్క్ ఉండటంతో ఇక్కడ ఆర్ఆర్బీ కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.ఆర్ఆర్బీతో ప్రయోజనాలు ఇలామన రాష్ట్రంలో ఆర్ఆర్బీ ఏర్పాటైతే అనేక ప్రయోజనాలు ఉంటాయి.సాధారణంగా రైల్వేలో ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీలకు కలిపి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ ఇస్తుంటారు. అప్పుడు ఏ బోర్డులో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుస్తుంది. ఏపీలో ఆర్ఆర్బీ ఏర్పాటైతే.. దీని పరిధిలో పోస్టులకు ఏపీ అభ్యర్థులు ప్రాధాన్యం ఇవ్వొచ్చు.ప్రతిసారి పోస్టుల రిక్రూట్మెంట్కు ఒక్కో ఆర్ఆర్బీకి బాధ్యత అప్పగిస్తారు. ఇలా ఏపీ ఆర్ఆర్బీకి కూడా అవకాశం దక్కుతుంది. ్య రాష్ట్రానికి బోర్డు వస్తే ఇక్కడి అభ్యర్థుల సంఖ్య మేరకు కొత్తగా అవసరమైన చోట్ల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు.
Create an account or sign in to comment